మెట్రో పరేడ్ గ్రౌండ్ స్టేషన్ నుండి జేబీఎస్ కు లిఫ్ట్ ఎస్కులేటర్ ఏర్పాటు చేయాలి

కాలానుగుణ పరిస్థితులకు తోడ్పాటుగా రోడ్డు రవాణా రద్దీని నివారించుటకు అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో మెట్రో రైలు అందుబాటులోనికి తీసుకొని రాబడింది.   దీనివలన కాలుష్య రహిత వేగవంతమైన మెరుగైన రవాణా సౌకర్యాలు  కలుగుతున్నవి.  హైదరాబాద్ మెట్రో రైల్వే  జేబీఎస్ పరేడ్ గ్రౌండ్ స్టేషన్ నుండి జేబిఎస్ వెళ్ళుటకు మహాత్మా గాంధీ బస్ స్టేషన్ లో ఉన్న విధముగా సరాసరి వెళ్ళుటకు లిఫ్టు ఎస్కులేటర్ సౌకర్యాలు కల్పించబడలేదు.  ఫలితంగా ఉత్తర తెలంగాణ జిల్లాల నుండి జేబిఎస్  ద్వారా మెట్రో రైలులో ప్రయాణించుటకు ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు.  ఈ బస్ స్టేషన్ నుండి మహారాష్ట్ర ప్రజలు కూడా రాకపోకలు సాగిస్తుంటారు.

ఇంతేగాక బోయినపల్లి అల్వాల్ తిరుమలగిరి కార్ఖానా తదితర స్థానిక ప్రాంత ప్రజలు కూడా జేబిఎస్ వరకు లోకల్ బస్సులో ప్రయాణించి మెట్రో స్టేషన్ చేరుకోవాలంటే కష్టంగా ఉంటుంది.  ఇంతే కాక పరేడ్ గ్రౌండ్ స్టేషన్ లో ఎస్కలేటర్,  లిఫ్ట్ సౌకర్యాలు కల్పించబడలేదు.  ఈ స్టేషన్ నుండి రాకపోకలు కొనసాగించుటకు పక్కన ఉన్న జేబిఎస్ పరేడ్ గ్రౌండ్ స్టేషన్ నుండి రావలసి వొస్తున్నది.

వయోధికులు, స్త్రీలు, పిల్లలు మెట్ల మార్గం ద్వారా పైకి ఎక్కవలసి వొస్తుంది.  ఫలితంగా అత్యంత కష్టం కలుగుతున్నది కావున ప్రజల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని ఈ స్టేషన్ లో కూడా లిఫ్టు ఎస్కలేటర్ వాహనాల పార్కింగ్ స్థలం వద్ద ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు.   సౌకర్యవంతమైన ఏర్పాట్లు చేసి మెట్రో రైలును అధికంగా వినియోగించుటకు వీలు కల్పించి దేశంలోనే హైదరాబాద్ మెట్రో రైలు ఆదర్శవంతమైన వ్యవస్థగా ఏర్పడాలని ఆకాంక్షిస్తున్నాను

దండంరాజు రాంచందర్ రావు 

పాత బోయినపల్లి 

9849592958

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page