ప్రజాతంత్ర, యాదాద్రి, మార్చి 16 : యాదాద్రి ప్రధానాలయ ఉద్ఘాటనకు ముహూర్తం ఖరారైంది. ఈ నెల 28న ప్రధానాలయంలో మహాకుంభ సంప్రోక్షణ కార్యక్రమం జరగనుంది. ఈ నెల 28న మిధునలగ్న సుముహూర్తంలో మహాకుంభాభిషేకం నిర్వహించనున్నారు. సాయంత్రం ఆలయంలో శాంతి కల్యాణం జరగనుంది. ఈనెల 21-28 వరకు పాంచరాత్రాగమ పద్ధతిలో ఉద్ఘాటన పూజలు నిర్వహించనున్నారు.
ఈ నెల 21న ఉదయం 9 గంటలకు విశ్వక్సేనుడికి తొలిపూజ జరగనుంది. స్వప్తిపుణ్యాహవచన మంత్ర పఠనాలతో ప్రధానాలయ ఉద్ఘాటన నిర్వహించనున్నారు. 21 నుంచి వారం పాటు బాలాలయంలో పంచకుండాత్మక హోమం జరగనుంది.