- అఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి
- అమెదక్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి తో కలిసి అమీన్ పూర్ అముఖ్య నాయకులతో ఎమ్మెల్యే జిఎంఆర్ సమావేశం
- అఅమీన్ పూర్ మున్సిపల్, మండల స్థాయి సన్నాహక సమావేశాన్ని విజయవంతం చేయండి
పటాన్ చెరు,ప్రజాతంత్ర,ఏప్రిల్ 25:సమర్థుడు, పరిపాలన అనుభవం కలిగిన వెంకట్రామిరెడ్డి విజయానికి ప్రతి ఒక్కరు సహకరించాలని పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. అమీన్ పూర్ మున్సిపల్ పరిధిలోని మున్సిపల్ వైస్ చైర్మన్ నందారం నరసింహా గౌడ్ నివాసంలో స్థానిక మున్సిపల్ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి అధ్యక్షతన ఏర్పాటు చేసిన మున్సిపల్ స్థాయి ముఖ్య నాయకుల సమావేశానికి బి ఆర్ ఎస్ పార్టీ మెదక్ లోక్ సభ అభ్యర్థి వెంకట్ రామ్ రెడ్డి తో కలిసి ఎమ్మెల్యే జిఎంఆర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ..ఈ నెల 28న అమీన్ పూర్ మున్సిపల్ పరిధిలోని బాలాజీ ప్రైవేట్ ఫంక్షన్ హాల్ లో ఏర్పాటు చేసిన అమీన్ పూర్ మున్సిపల్ మండల స్థాయి మెదక్ పార్లమెంట్ ఎన్నికల సన్నహాక సమావేశానికి ప్రతి ఒక్కరూ హాజరై, విజయవంతం చేయాలని కోరారు. ఆరు గ్యారంటీల పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ వారి అమలులో విఫలం చెందుతున్న తీరును ప్రజలకు వివరించాలని కోరారు. మెదక్ లోక్ సభ అభ్యర్థి వెంకటరామిరెడ్డి మాట్లాడుతూ.. తాను పటాన్ చెరు నియోజకవర్గ ప్రాంతానికి చెందిన వాడినని.. తనను గెలిపిస్తే స్థానిక ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డితో కలిసి నియోజకవర్గ అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తానని తెలిపారు.
ఈ కార్యక్రమంలో అమీన్ పూర్ ఎంపీపీ దేవానందం, జెడ్పిటిసి సుధాకర్ రెడ్డి, సీనియర్ నాయకులు శంకర్ యాదవ్, సపాన దేవ్, బాల్ రెడ్డి, పార్టీ మున్సిపల్ అధ్యక్షులు బాల్ రెడ్డి, మండల అధ్యక్షులు శ్రీనివాస్, ప్రజా ప్రతినిధులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.