భద్రాచలంకు హెలికాప్టర్‌, అదనపు రక్షణ సామాగ్రి తరలించండి

సిఎస్‌కు సిఎం కేసీఆర్‌ ఆదేశం
హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 15 : భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో గోదావరి ఉగ్రరూపం దాల్చి భద్రాచలం వద్ద గోదావరి 70 అడుగులు దాటి ఉధృతంగా ప్రవహిస్తున్న నేపథ్యంలో వరదలకు జలమయం అవుతున్న లోతట్టు ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టాలని అధికార యంత్రాంగాన్ని సీఎం కేసీఆర్‌ ఆదేశించారు.

రక్షణ చర్యలు చేపట్టేందుకు కావాల్సిన ఎన్డీఆర్‌ఎస్‌, ‌రెస్క్యూ బృందాలను, వరద బాధితులను రక్షించేందుకు ఉపయోగపడే లైఫ్‌ ‌జాకెట్లు తదితర సామాగ్రితో సహా హెలికాప్టర్లను భద్రాచలానికి తరలించాలని సీఎస్‌ ‌సోమేశ్‌ ‌కుమార్‌ను సీఎం కేసీఆర్‌ ఆదేశించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *