Take a fresh look at your lifestyle.

స్వల్పంగా పెరిగిన కొరోనా కేసులు

న్యూది•ల్లీ,జనవరి6 : దేశంలో కొరోనా వైరస్‌ ‌కేసులు స్వల్పంగా పెరిగాయి. గత 24 గంటల్లో 1,99,731 మందికి కరోనా వైరస్‌ ‌నిర్దారణ పరీక్షలు చేయగా.. 228 కేసులు బయటడినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 4,46,79,547కి చేరింది. ప్రస్తుతం దేశంలో 2,503 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. గత 24గంటల్లో నలుగురు మృతి చెందడంతో..

మొత్తం మరణాల సంఖ్య 5,30,714కి చేరింది.ఇప్పటివరకు నమోదైన మొత్తం పాజిటివ్‌ ‌కేసుల్లో 0.01 కేసులు మాత్రమే యాక్టివ్‌గా ఉన్నాయని వెల్లడించింది. రికవరీ రేటు 98.80 శాతంగా, మరణాలు 1.19 శాతంగా ఉన్నాయని పేర్కొంది. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 220.12 కోట్ల కరోనా వ్యాక్సిన్‌ ‌డోసులను పంపిణీ చేశామని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.

Leave a Reply