సిద్ధిపేట, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 20 : సిద్దిపేట జిల్లాలో జరుగుతున్న రోడ్డు ప్రమాదాలపై వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్ రావు సోమవారం బీఆర్కే భవన్లో హైలెవెల్ సమీక్ష నిర్వహించారు. సిద్ధిపేట జిల్లాలో, సిద్ధిపేట నుంచి హైదరాబాద్ వచ్చే రహదారిపై జరుగుతున్న ప్రమాదాలపై విశ్లేషించారు. ఈ సందర్భంగా అధికారులు గ్రామీణ రోడ్ల నుంచి రాష్ట్ర, జాతీయ రహదారులపై వచ్చే రూట్లతో బ్లాక్స్పాట్ల గురించి తెలియజేశారు. అలాగే ప్రమాదాలు జరిగినప్పుడ వైద్య సాయం అందించే ట్రామా కేర్ సెంటర్లపై చర్చించారు. దీంతో పాటు సిద్ధిపేట, గజ్వేల్ ప్రాంతాల్లో ప్రమాదాలు జరిగే ప్రదేశాల్లో సూచిక బోర్డులు, స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.
రహదారుల వెంట ఉన్న ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల సమాచారాన్ని ప్రభుత్వ పోర్టల్లో అందుబాటులో ఉంచాలని నిర్ణయించారు. నర్సాపూర్ జంక్షన్, డబుల్ బెడ్రూం ఇళ్ల వైపు వెళ్లే రూట్లలో సర్వీస్ రోడ్లు నిర్మించాలని మంత్రి అధికారులను ఆదేశించారు. సిద్ధిపేట, ఒంటిమామిడి జంక్షన్, ప్రజ్ఞాపూర్ జంక్షన్లలో స్పీడ్ ఇండికేటర్లను ఏర్పాటు చేసి ప్రయాణీకులకు అవగాహన కల్పించాలని, రోడ్ సేఫ్టీ కమిటీలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ప్రయాణీకులకు కనిపించే విధంగా ఇందులో చీఫ్ సెక్రటరీ శాంతికుమారి, ఆర్ అండ్ బి ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీనివాస రాజు, ఆర్ అండ్ బి గణపతి రెడ్డి, ట్రాన్స్పోర్ట్ కమిషనర్, సిద్ధిపేట పోలీస్ కమిషనర్ , రోడ్డు సేఫ్టీ అధికారులు పాల్గొన్నారు.