కేంద్రం దిగివచ్చేవరకు ఆందోళన కొనసాగిస్తాం
మెడలు వంచైనా కొనిపిస్తాం
దిల్లీలో తెలంగాణ సత్తా చాటుతాం
రాష్ట్ర వ్యాప్తంగా టిఆర్ఎస్ ఆందోళనలు…ధర్నాలు
పార్టీ పిలుపుతో జాతీయ రహదారుల దిగ్బంధనం
ధర్నాల్లో పాల్గొన్న మంత్రులు, ఎమ్మెల్యేలు
ప్రధాని మోడీకి వ్యతిరేకంగా నానాదాల హోరు
పటాంచెరులో ముంబై జాతీయ రహదారిని దిగ్బంధం… ప్రధాని మోడీ దిష్టిబొమ్మ దగ్ధం
బిజెపి మొండి వైఖరి విడనాడాలి : హైవే రోడ్డు పై బైఠాయించి నిరసన వ్యక్తం చేసిన టిఆర్ఎస్ మంత్రి మంత్రి శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్యేలు
భారతీయ జనతా పార్టీ తెలంగాణలో పండించిన ధాన్యాన్ని కొనడం లేదని తెలంగాణ రైతులను నట్టేట ముంచుతున్నారని బిజెపి మొండివైఖరి నిరసిస్తూ మంత్రి శ్రీనివాస్ గౌడ్, దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి ఇ తదితర ఎమ్మెల్యేలు బుధవారం జాతీయ రహదారిపై ధర్నా చేపట్టారు. తెలంగాణ రాష్ట్రంలో పండించిన పంటను బేషరతుగా కేంద్ర ప్రభుత్వం కొనాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పంజాబ్ రాష్ట్రం తరహా తెలంగాణ లో పండించిన ధాన్యాన్ని కొనాలి అన్నారు కేంద్ర ప్రభుత్వం వన్ తెలంగాణ పై దురుద్దేశంతోనే రైతులు పండించిన ధాన్యాన్ని కోరడం లేదని మంత్రి ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి ఇ లు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ధ్వజమెత్తారు తెలంగాణ ఏర్పడకముందు రాష్ట్రంలో దాదాపు 35 లక్షల ఎకరాలలో పంట పండే దని తెలంగాణ వచ్చాక ముఖ్యమంత్రి కెసిఆర్ సారథ్యంలో ప్రాజెక్టు రూపకల్పన చేశాక దాదాపు కోటి ఎకరాల పై పడి పంటలను రైతులు పండిస్తున్నారు అని దాదాపు 4 అంతలు పంట పెరిగిందని అది చూసి ఓర్వలేకనే కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరిని ప్రదర్శిస్తున్నారు తెలంగాణ లో లో ధర్నా లు తమకేమి కొత్తవి కాదని కేంద్ర ప్రభుత్వం తెలంగాణలో పండించిన వరి ధాన్యాన్ని కొనక పోతే ముందు మరింత పోరాటం చేస్తామని అన్నారు ఈ ధర్నా కార్యక్రమంలో మక్తల్ ఎమ్మెల్యే చిట్టెం కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ షాద్నగర్ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ దేవరకద్ర ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి ఇ సర్పంచులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు
రాష్ట్రంలోని వరి ధాన్యం కొనుగోలు చేసేవరకు కేంద్రంలోని బీజేపీ సర్కారుపై కొట్లాడుతామని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. బాజాప్తా వరి వేయండని, వి• వడ్లను మేం కొనిపిస్తామన్న బీజేపీ నాయకులు తీరా పంట చేతికి వచ్చాకా మోహం చాటేస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో పండిన పంటను మొత్తం కేంద్ర ప్రభుత్వమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ నాగపూర్ జాతీయ రహదారిపై రైతులు, టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు రాస్తారోకో నిర్వహించారు. రైతుల పక్షాన ధర్నా చేస్తున్న వారికి మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రంలో పండిన ప్రతీ గింజ కేంద్రం కొనుగోలు చేసేదాకా రైతుల తరపున టీఆర్ఎస్ ప్రభుత్వం పోరాటం చేస్తుందన్నారు. కేంద్ర ప్రభుత్వంతో తాడోపేడో తేల్చుకుంటామని స్పష్టం చేశారు. ఇంత మండుటెండలో కూడా టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున తరలివచ్చి రైతుల పక్షాన ధర్నా చేస్తున్నారని, ఇప్పటికైనా బీజేపీ సర్కార్ బుద్ధి తెచ్చుకుని కళ్లు తెరవాలని సూచించారు.