Take a fresh look at your lifestyle.

మహిళా బిల్లు కోసమే మా పోరాటం

  • 27 ఏళ్లుగా చేస్తున్నా పట్టింపు లేదు
  • పూర్తి మెజార్టీ ఉన్నా హామిని విస్మరించిన ప్రధాని మోదీ
  • వి•డియా సమావేశంలో బిఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత
  • మహిళా బిల్లు తేవడంలో సోనియాది కీలకపాత్ర అని వ్యాఖ్య
  • నేడు దిల్లీ జంతర్‌ ‌మంతర్‌ ‌వద్ద కవిత ధర్నా..పాల్గొననున్న 18 పార్టీలు

న్యూ దిల్లీ, మార్చి 9 : మహిళా రిజర్వేషన్‌ ‌బిల్లు పెట్టి ఆమోదించాలనేది తమ ప్రధాన డిమాండ్‌ అని బిఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత అన్నారు. 27 ఏళ్లుగా మహిళా రిజర్వేషన్‌ ‌బిల్లు కోసం పోరాటం చేస్తున్నారని..ఎన్ని ప్రభుత్వాలు మారినా బిల్లుకు మాత్రం ఆమోదం రాలేదని చెప్పారు. మహిళా రిజర్వేషన్‌ ‌బిల్లు కోసం తమ పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్లు మహిళలకు కేటాయించాలని డిమాండ్‌ ‌చేశారు. మహిళా రిజర్వేషన్‌ ‌బిల్లు కోసమే జంతర్‌ ‌మంతర్‌ ‌వద్ద నేడు మహా ధర్నా చేస్తున్నామని తెలిపారు. ధర్నాకు 18 పార్టీలు హాజరు కానున్నాయని అన్నారు.  2014, 2018 ఎన్నికల్లోనూ బిల్లుపై బీజేపీ హావి• ఇచ్చింది. 300కు పైగా ఎంపీ స్థానాలు బీజేపీకి ఇచ్చినా బిల్లు ఆమోదించలేదు. మహిళా బిల్లుపై నోరు విప్పకుండా.. బిల్లు అంశాన్ని కోల్డ్ ‌స్టోరేజీలో పెట్టిందని విమర్శించారు.

నేడు మహిళా బిల్లుపై దీక్ష చేస్తామని మార్చి 2న పోస్టర్‌ ‌రిలీజ్‌ ‌చేశాం. మా దీక్షకు మద్దతిస్తూ విపక్షాలు ముందుకొచ్చాయి. సిపిఎం అగ్రనేత సీతారాం ఏచూరి దీక్షను ప్రారంభిస్తారని తెలిపారు. చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించాలని, మహిళా బిల్లు కోసం 27 ఏళ్లుగా పోరాటం జరుగుతుందని కవిత చెప్పారు. ఎన్ని ప్రభుత్వాలు మారినా బిల్లు ఆమోదం పొందలేదన్నారు. 2014, 2018 మహిళా బిల్లుపై బీజేపీ మ్యానిఫెస్టోలో హావి• ఇచ్చారని కవిత గుర్తు చేశారు. బిల్లు ఆమోదం కోసం శుక్రవారం దిల్లీలో నిరాహార దీక్ష చేపడతానని ఆమె చెప్పారు.

పూర్తి మెజార్టీతో గెలిపించినా మహిళా బిల్లుపై బీజేపీ మాట తప్పిందని, మహిళా బిల్లుపై రాజకీయాలకు అతీతంగా ఆలోచించాలన్నారు. మహిళా రిజర్వేషన్‌ ‌బిల్లు తేవడంలో సోనియా పాత్ర అమోఘమని కవిత చెప్పారు. మార్చి 10న దీక్ష చేస్తామనగానే 9న విచారణకు రావాలని ఈడీ సమన్లు ఇచ్చింది. ధర్నాకు సంబంధించి ముందస్తు కార్యక్రమాల వల్ల 11న వొస్తానని చెప్పా. మహిళలను ఇంటికొచ్చి విచారించాలనే చట్టం చెబుతుంది. మహిళలను విచారించే విధానాలకు విరుద్ధంగా నన్ను విచారణకు పిలిచారు. మా మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను కేంద్రం లక్ష్యంగా చేసుకుందన్నారు.

Leave a Reply