- ప్రతీ నెల నేరుగా పేషంట్స్ చెంతకు న్యూట్రిషన్ కిట్..
- సిద్ధిపేట నియోజకవర్గంలో 265 మందికి మనోధైర్యం ఇవ్వనున్న మంత్రి హరీష్ రావు
- అభాగ్యుల మనోవేదనకు ఆత్మీయ కానుక
- 4 రకాల పోషకాహారాల కిట్ త్వరలో ఇంటింటికి పంపిణీ
సిద్ధిపేట, ప్రజాతంత్ర, అక్టోబర్ 17 : జబ్బు వొచ్చిన బాధ కంటే ఎదుటివారి అవహేళనతో టిబి పేషేంట్లు మనోవేదన చెందుతున్నారు. అండగా నిలిచేవారు లేక చాలా మంది మనోధైర్యం కోల్పోతున్నారు. తమకు క్షయ వ్యాధి ఉందని చెప్పడానికి కూడా వెనుకాడుతూ ఇటు చికిత్సకు, అటు పోషకాహారానికి దూరమవుతున్నారు. ఇలాంటి అభాగ్యులకు అండగా నిలుస్తూ, ఆత్మీయ భరోసా కల్పించడానికి మంత్రి హరీష్ రావు మానవతా ధృక్పథంతో ఆలోచించారు.
వ్యాధి తీవ్రతను నియంత్రించడంతో పాటు ఆరోగ్యం స్థిరంగా ఉండేలా గొప్ప నిర్ణయం తీసుకున్నారు. టీబీ పేషంట్గా ఒక వైపు బాధ ..మరో వైపు ఆర్థిక స్థోమత లేని బాధితులకు 4 రకాల పోషకాహారాలతో కూడిన న్యూట్రిషన్ కిట్ను తన స్వంత ఖర్చులతో ఇవ్వడానికి ముందుకొచ్చారు. సిద్ధిపేట నియోజకవర్గం లోని 265 మంది టీబీ పేషంట్స్కు 6 నెలల పాటు ప్రతి నెల వారి ఇంటికి చేరేలా నాణ్యత కలిగిన న్యూట్రిషన్ కిట్ను ఆత్మీయ కానుకగా అందించనున్నారు.
బాధితులకు మానసిక ధైర్యం..ఎహెచ్ఆర్ న్యూట్రిషన్ కిట్
సంపాదన కోల్పోపోడం, కొన్ని నెలల పాటు జబ్బుతో బాధపడడం వల్ల రోగుల్లో ఆత్మవిశ్వాసం పోతుంది. రోగ నిరోధక శక్తి తగ్గుతుంది. ఇలాంటి పరిస్థితిలో మంత్రి హరీష్ రావు టిబి పేషంట్స్కు ఆరోగ్యానికి అండగా నిలవనున్నారు. టిహెచ్ఆర్ న్యూట్రిషన్ కిట్ సిద్దిపేట నియోజకవర్గంలోని 265 మంది రోగుల కోసం కిట్లు సిద్ధం చేయించారు. ఆ కిట్లో 3కిలోల బియ్యం, ఒక కిలో పప్పు, 300గ్రా ఆవు నెయ్యి, 30 కోడిగుడ్లు ఉంటాయ్. రాష్ట్రంలోనే సిద్ధిపేట నియోజకవర్గం నుండి ఈ వినూత్నమైన మానవత్వ కార్యక్రమం ప్రారంభం కానుంది.
సిద్దిపేట జిల్లాలో 902 మంది టీబీ పేషంట్స్ ఉన్నారు. టీబీ పేషంట్స్ పట్టించుకోని..ఆ రోగులను చూడగానే చీదరించుకుంటున్న నేటి కాలంలో మంత్రి హరీష్ రావు వారికి మనో ధైర్యాన్ని ఇచ్చారు. ఒక ఎమ్మెల్యేగా, మంత్రిగా, ప్రజల బాధలు తెలిసిన నాయకుడిగా టిబి పేషంట్స్కు వారిలో ఆత్మవిశ్వాసం…మనోధైర్యం..నిం
మనోధైర్యమే రోగానికి మందు..
టిబి రోగులు పడే బాధ అంత ఇంత కాదు..వారికి రోగం ప్రబలినప్పటి నుండి వారిలో రోజు రోజుకు ఆత్మవిశ్వాసం పోగొట్టుకుని, రోగ నిరోధక శక్తి తగ్గి కుమిలి పోతున్నారు. ఎంతటి వ్యాధినైనా మనోధైర్యంతో నయం చేసుకోవచ్చు. రోగుల్లో ఆత్మ విశ్వాసం కల్పిస్తే అంతకు మించిన వైద్యం మరొకటి ఉండదు. ఇదే రకంగా ఉమ్మడి జిల్లాలోని ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లో కిట్లు ఇవ్వాలని, టీబీ రోగులకి అండగా నివాలని మంత్రి హరీష్ రావు పిలుపునిచ్చారు.