Take a fresh look at your lifestyle.

టర్కీ, సిరియాలను కుదిపిన భారీ భూకంపం

  • రిక్టర్‌ ‌స్కేలుపై తీవ్రత 7.8గా నమోదు
  • 1600 మంది మృతి…ఇంకా పెరిగే అవకాశం
  • శిథిలాల కింద చిక్కుకున్న వందలాది మంది
  • పేకమేడల్లా కూలిన బహుళ అంతస్థుల భవనాలు

అంకారా, ఫిబ్రవరి 6 : టర్కీ, సిరియాలను భారీ భూకంపం కుదిపేసింది. ప్రజలంతా గాఢ నిద్రలో ఉన్న సమయంలో సోమవారం తెల్లవారుజామున టర్కీ , సిరియాలలో భారీ భూకంపం సంభవించి పలు నగరాల్లో వందలాది భవనాలు పేకమేడల్లా కుప్పకూలాయి. ఇప్పటివరకూ16 వందల మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. వేలాది మంది గాయపడ్డారు. వందలాది భవనాలు, ఇళ్లు నేలమట్టమయ్యాయి. తెల్లవారుజామున 4 గంటల 17 నిమిషాలకు భూకంపం వచ్చాక ఇప్పటివరకూ మొత్తం 40 సార్లు భూమి కంపించింది. అయితే మృతుల సంఖ్య పదివేలకు చేరవచ్చన్న ఆదోళన కనిపిస్తోంది. దక్షిణ టర్కీలోని గజియాన్‌టెప్‌ ‌సపంలో నరుద్గీకి 23 కిలోటర్ల దూరంలో, భూ అంతర్భాగంలో 10 కిలోటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు యూజి జియాలాజికల్‌ ‌సర్వే తెలిపింది. శిథిలాల కింద అధిక శాతం మంది చిక్కుకుపోవడంతో మృతుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉందని అన్నారు. స్థానిక కాలమానం ప్రకారం ఈరోజు తెల్లవారుజామున 4.17 గంటలకు ఈ భూకంపం సంభవించింది. భూకంప లేఖినిపై దీని తీవ్రత 7.8గా నమోదైనట్లు యూఎస్‌ ‌జియోలాజికల్‌ ‌సర్వే వెల్లడించింది.

టర్కీలోని  గాజియాన్‌ ‌తెప్‌ ‌ప్రాంతానికి 33 కిలోటర్ల దూరంలో 18 కిలోటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు అధికారులు గుర్తించారు. భూకంపం సంభవించిన పావుగంట తర్వాత 6.7 తీవ్రతతో మరోసారి శక్తిమంతమైన ప్రకంపనలు చోటుచేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. శిథిలాల కింద అనేక మంది చిక్కుకుపోయారన్నారు. మృతుల  సంఖ్య భారీగా పెరిగే అవకాశమున్నట్లు స్థానిక డియా పేర్కొంది. టర్కీలోని  మలట్యా, ఉర్ఫా, ఒస్మానియో, దియర్‌బకీర్‌ ‌ప్రాంతాల్లో భూకంప ప్రభావం అధికంగా ఉంది. సిరియాలో అలెప్పో, హమా, లటాకియాలో అనేక భవనాలు నేలమట్టమయ్యాయి. 200 మందికి పైగా గాయపడినట్లు ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది.  భూకంప ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.  టర్కీలోని  దియర్‌బకీర్‌ ‌ప్రాంతంలో ఓ భవనం పేకమేడలా కుప్పకూలిన దృశ్యాలు సోషల్‌‌డియాలో వైరల్‌ అవుతున్నాయి. ఇక హతయ్‌  ‌ప్రాంతంలో భూకంప తీవ్రతకు సహజవాయువు గ్యాస్‌ ‌పైప్‌లైను పేలి భారీగా మంటలు చెలరేగాయి.

టర్కీలో  తరచూ భూకంపాలు సంభవిస్తుంటాయి. 2020 జనవరిలో ఇలాజిగ్‌ ‌ప్రాంతంలో 6.8 తీవ్రతతో భూకంపం సంభవించి 40 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. అదే ఏడాది అక్టోబరులో 7.0 తీవ్రతతో సంభవించిన భూకంప విలయంలో 114 మంది మృత్యువాతపడ్డారు. ఇక, 1999లో టర్కీ చరిత్రలో అత్యంత భీకర ప్రకృతి బీభత్సాన్ని చవిచూసింది. ఆ ఏడాది 7.4తీవ్రతతో భూకంపం సంభించి 17వేల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఒక్క ఇస్తాంబుల్‌లోనే 1000 మంది మరణించారు. టర్కీని భారీ భూకంపం కుదిపేసింది. దక్షిణ టర్కీలోని గజియాన్‌టెప్‌ ‌సపంలో శక్తివంతమైన భూకంపం సంభవించింది. రిక్టర్‌ ‌స్కేలుపై దీని తీవ్రత 7.8గా నమోదైంది. పలు భవానాలు కుప్పకూలడంతో సుమారు 50 మంది మరణించినట్టు రాయిటర్స్ ‌వార్తా సంస్థ తెలిపింది. విధ్వంస తీవ్రత ఆధారంగా మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని తెలిపింది. నరుద్గీకి 23 కిలోటర్ల దూరంలో, భూ అంతర్భాగంలో 10 కిలోటర్ల లోతులో కదలికలు సంభవించినట్టు యూజి జియాలాజికల్‌ ‌సర్వే తెలిపింది.భూకంప తీవ్రతకు పలు ప్రాంతాల్లో భవనాలు, అపార్ట్‌మెంట్లు కూలిపోయాయని, భారీ ఆస్తినష్టం జరిగినట్టు వార్తలు వెలువడ్డాయి.

ప్రజలు హాహాకారాలు చేస్తూ రోడ్లపైకి పరుగులు తీశారు. భారీ భూకంపం తర్వాత హైఅలర్ట్ ‌ప్రకటించినట్టు టర్కీ అంతర్గత మంత్రిత్వ శాఖ తెలిపింది. సిప్రస్‌, ‌టర్కీ, గ్రీస్‌, ‌జోర్డాన్‌, ‌లెబనాన్‌, ‌సిరియా, యూకే, ఐరాక్‌, ‌జార్జియాలోనూ భూకంపం సంభవించింది. ఉత్తర నగరం అలెప్పో, సెంట్రల్‌ ‌సిటీ హమాలో కొన్ని భవనాలు కుప్పకూలినట్లు సిరియా ప్రభుత్వ డియా పేర్కొంది. ప్రాణనష్టంపై ఎలాంటి సమాచారం లేదు. బీరూట్‌, ‌డమాస్కస్‌లలో అపార్ట్‌మెంట్లు, భవనాలు కంపించడంతో స్థానిక ప్రజలు భయంతో వీధుల్లోకి పరుగులు తీశారు. మృతుల వివరాలు వెంటనే తెలియలేదు. టర్కీలో గత మూడేళ్లలో 18 మంది భూకంపాల కారణంగా మరణించినట్టు గణాంకాలు చెబుతున్నాయి.

ఈశాన్య టర్కీలో 1999లో సంభవించిన భారీ భూకంపంలో 17,000 మందికి పైగా మరణించారు. టర్కీలోని 10 నగరాలపై భూకంప ప్రభావం ఉన్నట్టు టర్నీ దేశీయాంగ మంత్రి సులేమాన్‌ ‌సోయిల్‌ ‌తెలిపారు. గజియాన్‌టెప్‌, ‌కహ్రమాన్‌మరస్‌, ‌హటాయ్‌, ఒస్మానియె, అడియమన్‌, ‌మలట్య, అడన, కిలిస్‌ ‌తదితర సిటీలపై ఈ ప్రబావం ఎక్కువగా ఉందన్నారు. గజియాన్‌టెప్‌లోని షాపింగ్‌ ‌మాల్‌ ‌కుప్పకూలినట్టు బీబీసీ టర్కీ కరస్పాండెంట్‌ ‌తెలిపారు. తాను ఉంటున్న భవనం సుమారు 45 నిమిషాలు కుదుపులకు గురైందని బీబీసీ ప్రొడ్యూసర్‌ ‌రుష్ది అబ్దాలాఫ్‌ ‌తెలిపారు. భూకంపం తీవ్రత 7.4గా టర్కీ భూకంప నమోదు నిపుణులు అంచనా వేశారు.

Leave a Reply