హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 20 : జిఎస్టీపై మాటమార్చారని సీఎం కేసీఆర్పై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. జీఎస్టీ బిల్లుకు మద్దతుగా అసెంబ్లీ తార్మానం చేసి మోడీని పొడిగిన కేసీఆర్ ఈ రోజు నాలుక మడతేశారని ఆరోపించారు.
ఆ రోజు జీఎస్టీకి మద్దతిచ్చి ఇవాళ ఎందుకు వ్యతిరేకిస్తున్నారని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. పాలు, పెరుగుపై పన్ను వేస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం జీఎస్టీ మండలి సమావేశంలో ఎందుకు అభ్యంతరం చెప్పలేదో కేసీఆర్ సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.




