గిరిజన సాంప్రదాయాలతో  స్వాగతం                  

పిఓ రాహుల్‌కు గవర్నర్‌ అభినందనలు
ట్రైబల్‌ ‌మ్యూజియంను ప్రారంభించిన గవర్నర్‌  

‌భద్రాచలం ఐటిడిఏ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ట్రైబల్‌ ‌మ్యూజియంను  రాష్ట్ర గవర్నర్‌ ‌జిష్ణుదేవ వర్మ సోమవారం లాంఛనంగా ప్రారంభించారుప్రారంభోత్సవ వేడుకకు హాజరైన రాష్ట్ర గవర్నర్‌ ‌కు ఐటీడీఏ వద్ద గిరిజన సంప్రదాయ స్వాగతం పలికారుఈ సందర్భంగా గవర్నర్‌ ‌ట్రైబల్‌ ‌మ్యూజియంను సందర్శించారుగిరిజన సంస్కృతిసాంప్రదాయాలు ఉట్టిపడేలా ట్రైబల్‌ ‌మ్యూజియంలో ఏర్పాటు చేసిన వివిధ వస్తువులను చూసి గవర్నర్‌ ఐటీడీఏ పీవో రాహుల్‌ ‌ని ప్రత్యేకంగా అభినందించారుభావితరాలకు ఇవి ఎంతగానో ఉపయోగపడతాయని గవర్నర్‌ ఈ ‌సందర్భంగా ప్రశంసించారుగిరిజనులను ఇంకా అన్ని విధాల అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని గవర్నర్‌ ఈ ‌సందర్భంగా పిఓ కు తెలిపారుఇంకా ట్రైబల్‌ ‌మ్యూజియంను ఆధునికరించాలని కోరారు

గిరిజన సంస్కృతి సాంప్రదాయాలు ఆచార వ్యవహారాలకు సంబంధించిన కళాఖండాలను తయారు చేస్తున్న గిరిజనులకు వాటిని సందర్శకులకు విక్రయించి ఉపాధి అవకాశాలు కల్పించుకునేలా చొరవ చూపాలని ఆయన అధికారులకు సూచించారుట్రైబల్‌ ‌మ్యూజియం వద్ద ఏర్పాటు చేసిన వివిధ రకాల మట్టి ఇళ్ళు ట్రెడిషనల్‌ ‌హౌస్‌ ‌లు  వీక్షించి గవర్నర్‌ ఆనందం వ్యక్తం చేశారుఅనంతరం ఆదివాసీ గిరిజన మహిళలు తయారు చేసిన గిరిజన వంటకాలను చవిచూసి మరల భద్రాచలం వొచ్చినప్పుడు తప్పనిసరిగా గిరిజన వంటకాలను తనివి తీర భోజనం చేస్తానని ఆయన మహిళలకు హామీ ఇచ్చారుఈ సందర్భంగా గవర్నర్‌ ‌ఫోటో దిగి అక్కడున్న వారిని ఆనందింప చేశారుఈ కార్యక్రమంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుపార్లమెంటు సభ్యులు పోరిక బలరాం నాయక్‌‌భద్రాచలం శాసనసభ్యులు డాక్టర్‌ ‌తెల్లం వెంకట్రావుఇల్లందు శాసనసభ్యులు కోరం కనకయ్యభద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్‌ ‌జితేష్‌ ‌వి పాటిల్‌,ఐటీడీఏ పీవో బి.రాహుల్‌ఐటీడీఏ ఏపీవో జనరల్‌ ‌డేవిడ్‌ ‌రాజ్‌ఐటీడీఏ వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page