అకాల వర్షంతో తడిసిన పంట

  • ఏమీ చేయలేక ఆందోళనలో అన్నదాతలు
  • ద్రోణి ప్రభావంతో మరో రెండు రోజులు వర్షాలు : వాతావరణశాఖ

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, మే 16 : ఆదివారం రాత్రి ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలకు జగిత్యాల, మెదక్‌, ‌నిజామాబాద్‌, ‌నిర్మల్‌, ‌మేడ్చల్‌ ‌జిల్లాల్లో అన్నదాతలు అతలాకుతలం అయ్యారు. పలు మండలాలతో గ్రామాల్లో భారీ వర్షానికి వరిధాన్యం తడిసి ముద్దయింది., మొక్కజొన్న, సజ్జ, నువ్వు, మామిడి పంటలు నేలవాలాయి. అకాల వర్షాలతో ఏమి చేయలేని రైతులు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. పలు గ్రామాల్లో లోతట్టు ప్రాంతాల్లో కొనుగోలు కేంద్రాలు ఉండడంతో ధాన్యం కుప్పలు వరదనీటిలో మునిగిపోయాయి. వరద నీరు ధాన్యం. కుప్పల వద్దకు చే•రి ధాన్యాన్ని నీట ముంచాయి. మరోవైపు పంట పొలాలలో వేసిన నువ్వు, మొక్కజొన్న పంటలు నెలకొరిగాయి.

ద్రోణి ప్రభావంతో మరో రెండు రోజులు వర్షాలు : వాతావరణశాఖ

రాష్ట్రంపై ఉపరితల ద్రోణి ప్రభావం ఉందని, ద్రోణి ప్రభావంతో తేలికపాటి వర్షాలు మరో రెండు రోజులపాటు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ ప్రకటించింది. మరో రెండు రోజులు ద్రోణి ప్రభావం కొనసాగే అవకాశం ఉందని వాతావరణశాఖ అంచనా వేసింది. అలాగే ఎండల తీవ్రత తగ్గిపోయి..సాధారణ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని, మధ్యాహ్నం నుండి ఆకాశంలో మబ్బులు కమ్ముకుంటాయని తెలిపింది. ద్రోణి ప్రభావంతో సోమవారం ఉదయం వరకు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిశాయి. కామారెడ్డి, మెదక్‌, ‌నిజామాబాద్‌ ‌లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. నిర్మల్‌, ‌కామారెడ్డి, రాజన్న సిరిసిల్ల, జగిత్యాల, నిజామాబాద్‌ ‌లోని పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షం కురిసింది. హైదరాబాద్‌ ‌నగరంలోని కొన్ని ప్రాంతాల్లో తెల్లవారుజాము నుంచి ఈదురు గాలులతో తేలికపాటి వర్షాలు, తేలికపాటి జల్లులు కురిశాయి. కుబ్దుల్లా పూర్‌ ‌లో 3.6 సెంటివి•టరేజ్‌ ‌మోస్తరు వర్షం నమోదయింది. కొన్ని చోట్ల పట్టణాల్లో భారీ చెట్లు విరిగి రోడ్లపై, విద్యుత్‌ ‌తీగలపై పడడంతో విద్యుత్‌ ‌సరఫరా నిలిచి పోయింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page