పూలే జ్ఞానమంటే వణుకెందుకు..?

రెండు నిమిషాల పదిహేడు సెకండ్ల సినిమా ట్రైలర్‌ ఇప్పుడు భారత దేశంలోని ఆధిపత్య సమూ హానికి దడపు ట్టిస్తుంది. ఆడపిల్లలు చదువు కోకూడదు,మరి ముఖ్య ంగా అంటరాని వారికి చదువుకునే హక్కు ఉండదనే బ్రాహ్మణాధిపత్య భావాజాలానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసిన మహాత్మ జ్యోతిరావు పూలే, సావిత్రి బాయిపూలే జీవిత చరిత్రను ఆధారంగా చేసుకొని నిర్మించబడ్డ సినిమా‘‘పూలే’’వెండి తెర పై ప్రదర్శనను అడ్డుకోవ డానికి ఆధిపత్య వర్గాలు, సంఘ్‌ ‌పరివార్‌ అనుబంధ సంస్థలు తమ శక్తినంతా ధారపోస్తున్నాయి.’’వంద ఏండ్ల బ్రిటిష్‌ ‌బానిసత్వ సంకెళ్ళను తెంచటం కంటే మూడు వేల ఏండ్ల కుల వ్యవస్థ రక్కసి చేతులలో బానిసలుగా ఉన్న అంటరాని కులాల విముక్తి కోసమే నా పోరాటం’’అని సామాజిక విప్లవానికి తెర తీసిన పూలే మాటలతో ప్రారంభమవుతుంది ఈ సినిమా ట్రైలర్‌. ‘‌మీ దేవుడికి మీరు పూజలు చేసుకోవచ్చు,కాని మాకు విద్య కావాలి’ అని కుల వ్యవస్థకు వ్యతిరేకంగా సమర శంఖాన్ని పూరించిన మహాత్మ జ్యోతిరావు పూలే దంపతుల చరిత్ర ఈ సినిమా ద్వారా దేశ ప్రజల ఎరుకలోకి వస్తుంది అనే ఆలోచననే ఆధిపత్య శక్తులలో, మనువాదుల వెన్నులో వణుకుపుట్టిస్తుంది. ఏప్రిల్‌ 11 ‌జ్యోతిరావుపూలే జయంతి నాడే విడుదల కావాల్సిన ఈ చిత్రం, వివక్షతలకు కేరాఫ్‌ ‌గా ఉన్న బ్రాహ్మణ వర్గాల నుండి తీవ్రమైన నిరసనలు, అవరో ధాలను ఎదుర్కొంటుంది. సామాజిక న్యాయం కోసం పోరాడిన మహనీయునల జీవితాలని తెరకెక్కించే ప్రయత్నాన్ని అణచివేసే దిశగా జరుగుతున్న ప్రయత్నాలు భారత సినిమా చరిత్రలో ఒక చీకటి అధ్యాయంగా నిలిచిపోనున్నాయి.
దేశంలో చలన చిత్రాలకు ప్రదర్శనా హక్కులను ఇచ్చి సర్టిఫికేట్‌ ‌జారి చేసే సంస్థ సెంట్రల్‌ ‌బోర్డ్ అఫ్‌ ‌ఫిల్మ్ ‌సర్టిఫికేషన్‌ (•దీఖీ•) సినిమా అనేది కేవలం వినోదం కోసమే కాక సామాజిక మార్పుకు, ప్రజల చైతన్యానికి దోహదపడేవిదంగా ఉండాలి.ఆ ప్రమాణాలను కొలమానంగా సినిమా ప్రదర్శన హక్కులను ఇవ్వాలి.కాని ఈ మధ్య కాలంలో చాలా సినిమాలలో సామాజిక అంశాలు, నైతిక విలువలు కొరవడు తున్నాయి.. ఈ మధ్య కాలంలో వచ్చిన ఛావ, ఎమర్జెన్సీ, బస్తర్‌, ‌కాశ్మీర్‌ ‌ఫైల్స్, ‌కేరళ స్టోరీస్‌, ‌ద సాబర్మతి ఎక్ష్ప్రెస్స్, ‌రజాకార్‌ ‌చిత్రాలు ఈ కోవకు చెందినటువంటివే.ఈ చిత్రాలలో అవాస్తవాలు ఉన్నాయని చరిత్రను వక్రీకరిస్తున్నారని ఈ చిత్రాలను బహిష్కరించాలని, కనీసం సెన్సార్‌ ‌కట్‌ ‌లతో ప్రదర్శించాలని చరిత్రకారులు, సామాజిక కార్యకర్తలు సెన్సార్‌ ‌బోర్డ్ ‌కి సూచించారు. ఐనా ఈ ప్రాపగండ సినిమాలు మాత్రం ఎటువంటి ఆటంకం లేకుండా ప్రదర్శించ బడ్డాయి.
సామాజిక చైతన్య దివిటిలైన పూలే దంపతుల చరిత్ర వెండి తెర పైకి రానీయకుండా చేసే కుట్రలు పన్నుతున్నారు. కొన్ని ఆధిపత్య వర్గాల మనోభావాలు దెబ్బతింటాయని, కొన్ని సన్నివేశాలను సెన్సార్‌ ‌చేయాలని సెన్సార్‌ ‌బోర్డు ఆదేశించడం విడ్డూరం.జాతీయ స్థాయిలో భారతీయ సినిమా పరిశ్రమను పర్యవేక్షించే సంస్థ, కులవ్యవస్థ నిజాయితీని ప్రదర్శించే చిత్రానికి సెన్సార్షిప్‌ ‌పెట్టడం ఎంతో హేయమైన చర్యగా పరిగణించవచ్చు.వాస్తవిక చరిత్రను, కులవ్యవస్థ పట్ల విమర్శనాత్మక దృక్పథాన్ని చూపించే ఈ చిత్రాన్ని అడ్డుకోవడం ద్వారా మనుస్మృతిని కొనియాడే ఆధిపత్య హిందూత్వ శక్తులు తమ కుల రాజకీయాలను కాపాడుకోవడానికి ప్రయత్నిస్తుందనేది స్పష్టమవుతుంది. జ్యోతిరావు పూలే మరియు సావిత్రిబాయి పూలే దంపతులు 19వ శతాబ్దంలో భారతదేశంలో సామాజిక సంస్కరణలకు పాటుపడ్డారు. అస్పృశ్యులకు విద్యాబోధన, మహిళలకు విద్యావకాశాలు, వితంతు వివాహాలకు మద్దతు, బాల్య వివాహాలకు, కులవ్యవస్థకు వ్యతిరేకంగా పోరాటం వంటి అనేక విషయాలలో వీరు అగ్రగామిగా నిలిచారు. వీరిద్దరి కృషి వల్లనే అణగారిన వర్గాలకు విద్య అందుబాటులోకి వచ్చింది. ఇలాంటి మహనీయుల జీవితాలని తెరపై చూపించడం ద్వారా, ప్రస్తుత కాలంలో కూడా కులవ్యవస్థ అసమానతలపై పోరాడటానికి బలం చేకూర్చగలదు.అయితే, ఇదే కారణం వల్లనేమో ఆధిపత్య వర్గాలు ఈ చిత్రాన్ని అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్నాయి కావొచ్చు.
ప్రస్తుతం హిందూత్వ వాదులచే హిందూ మత రక్షకుడిగా చిత్రించబడుతున్న ఛత్రపతి శివాజీని, మహాత్మా జ్యోతిరావు పూలే మొట్టమొదటిసారిగా అన్ని కులాల ప్రజల ఐక్యతను సాధించిన నాయకుడిగా గౌరవించారు.పూలే తన రచనల ద్వారా శివాజీని అన్ని మతాల, కులాల ప్రజల సంక్షేమం కోసం పాటుపడిన రాజుగా కొనియాడిన పూలే చరిత్ర తెరక్కకూడదని ప్రయత్నించే సమూహాలు, సంఘాలు సిగ్గుతో తలదించుకొని వారి సంకుచిత ఆలోచనలకు స్వస్థి పలకాలి.ఛత్రపతి శివాజీ మహారాజ్‌ ఒక నిర్దిష్ట మతానికి చెందిన వ్యక్తి కాదనే వాస్తవం గ్రహించాలి.ఈ చిత్రం శివాజీపై ఫూలే దృక్పథాన్ని తెలియచేస్తే, అది నేటి కాలంలో హిందూత్వ వాదుల ప్రచారానికి పెద్ద ఎదురు దెబ్బే. శివాజీని హిందూమత రక్షకుడిగా కాకుండా, సమాన హక్కుల కోసం పోరాడిన సామాజిక న్యాయ యోధుడిగా చూపించడం హిందుత్వ సంస్థలకు ఎంతమాత్రం ఇష్టం ఉండదు. ఇది కూడా పూలే సినిమా మీద వస్తున్న వ్యతిరేకతకు కారణం కావచ్చు.
పూలే చిత్ర దర్శకుడు అనంత్‌ ‌మహాదేవన్‌ ‌మరియు ప్రముఖ చిత్రనిర్మాత అనురాగ్‌ ‌కశ్యప్‌ ఇప్పుడు ఆధిపత్య శక్తుల నుండి తీవ్రమైన ట్రోలింగ్‌కు గురవుతున్నారు. కులవ్యవస్థపై ప్రశ్నలు లేవనెత్తేవారిని మౌనం చేయడానికి ఇది మరో ప్రయత్నం. ద్వేషం, దూషణ ఏ స్థాయికి వెళ్లిందంటే ఈ చిత్ర నిర్మాణంలో సంబంధం ఉన్న వారందరి కుటుంబ సభ్యులను కూడా భయంకరమైన పదజాలంతో దూ• •స్తున్నారు.ఈ చిత్రంలో నటించిన ప్రతీక్‌ ‌గాంధీ మరియు పత్రలేఖ పై కూడా విమర్శలు గుప్పిస్తున్నారు. సత్యాన్ని చూపించాలనుకునే కళాకారులపై ఇలాంటి దాడులు భావ ప్రకటనా స్వేచ్ఛకు తీవ్రమైన ముప్పుగా మారాయి.
దర్శకుడు అనంత్‌ ‌మహాదేవన్‌ ఈ ‌చిత్రానికి సంబందించి కొన్ని విషయాలు స్పష్టం చేస్తాడు .ప్రస్తుతం మనం 21వ శతాబ్దం లో ఉన్నాం.పూలే దంపతులు సామాజిక జ్యోతిని రగిలించింది 19వ శతాబ్దం లో ఆ కాలంలోనే సమాజాన్ని పురోగమనం వైపు మలిపారు పూలే దంపతులు. మరింత పురోగమి ంచాల్సిన ఈ కాలపు సమాజం దురదృష్టవశాత్తు తిరోగమనం వైపు పయనిస్తుంది. భవిష్యత్తు లోకి ప్రయాణం చేసే సమయం లో గతం లో జరిగిన లోపాలను సరిదిద్దుకుంటూ పరిణితి చెందాలి.అంటాడు పూలే. స్వయంగా బ్రాహ్మణ కులానికి చెందిన అనంత మహదేవన్‌ ‌లాంటి వారి పట్ల ఎవ్వరికి ఎటువంటి ఏహ్య భావన ఉండాల్సిన అవసరం లేదు. పూలే సినిమా యధాతథంగా రాదని, పాలక పక్ష, ఆధిపత్య వర్గాల ఒత్తిడికి తలొగ్గి సెన్సార్‌ ‌బోర్డు పన్నెండు భాగాలు తొలగిస్తున్నారని వార్తలు వస్తున్నాయి. ఈ సందర్భంలో చిత్ర దర్శకుడికి సెన్సార్‌ ‌బోర్డు తొలగించిన భాగాలు ప్రజల ప్రజలముందు పెట్టండి. ప్రజలకు నిజాలు తెలియాలి. కుల వ్యవస్థలోని అసమానతలు అందరికీ అర్థమవ్వాలి. సత్యం అణగదొక్కబడితే అది మరింత బలంగా పైకి లేస్తుంది.చరిత్రలో ఎన్నోసార్లు మనం దీన్ని చూశాం. జ్యోతిరావు పూలే మరియు సావిత్రిబాయి పూలే వంటి మహ నీయులు కూడా అనేక అడ్డంకులు, ప్రతిఘ టనలను ఎదుర్కొన్నారు, కాని చివరికి వారి ఆలో చనలు విజయం సాధించాయి.పూలే చిత్రం కూడా అదే స్పూర్తితో విజయం సాధించాలని ఆశిద్దాం. వివక్షతల పై జరిగే యుద్ధంలో మనమందరం భాగాస్వాములవుదాం. మహనీయుల ఆలోచనలను మరింత మనలో నింపుకుంధాం.
image.png
డిఎస్‌ఎస్‌ఆర్‌ ‌క్రిష్ణ
రాష్ట్ర కార్యదర్శి, తెలంగాణ విద్యావంతుల వేదిక

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page