మరి రెండో రణరంగాన్ని ఎవరు మూసేస్తారు?

శనివారం సాయంత్రం దాకా చాలా తీవ్రమైన, విషాదకరమైన, విచిత్రమైన, ఉద్రిక్త పరిస్థితిలో ఉన్నాం. ఇప్పుడు మొత్తంగా పరిస్థితి మారిందని కాదు కానీ, ఒక ఊరట. దాదాపు ఇరవై రోజుల నుంచి ఒకదానికొకటి ప్రతిక్రియగా జరిగిన అనేక గొలుసుకట్టు పరిణామాలు ప్రజలు కోరుకున్నవి కాదు. తమ మీద విరుచుకుపడుతున్న సత్యాసత్యాల ఉప్పెనల మధ్య, ఉక్కిరిబిక్కిరి కావడమే తప్ప, తరచి, తలచి, స్పందనలను ఎంచుకునే వెసులుబాటు కూడా లేదు.

ఆపరేషన్‌ సిందూర్‌ తో న్యాయం జరిగిపోయింది- అని భారత సైన్యం ప్రకటించింది. దానికి పాకిస్థాన్‌ నుంచి ప్రతిక్రియలు లేకపోతే, సాయుధచర్యలు అక్కడితో ముగిసిపోయినట్టే అయ్యేది. కానీ, అట్లా జరగలేదు. అటూ ఇటూ విమానదాడులు, డ్రోన్‌ దాడులు, చొరబాటుయత్నాలు, కాల్పులు జరుగుతూనే వచ్చాయి . ఇట్లాగే దీర్ఘకాలం మంద్రస్థాయి ఘర్షణగా కొనసాగుతుందా, తీవ్రమైన, పూర్తిస్థాయి యుద్ధంగా పరిణమిస్తుందా అన్న ఉత్కంఠ ఉండింది. . వాస్తవంగా జరిగినదానికీ , ఉభయదేశాల్లో మీడియాలో జరుగుతున్న ప్రచారాలకీ పొంతనే లేదు. రెండు దేశాలూ అనధికారికంగా ఉన్మాద ప్రచారాన్ని అనుమతిస్తూనే వచ్చాయి. మరో వాస్తవాన్ని, భిన్నాభిప్రాయాన్ని చెప్పే ప్రయత్నాల మీద సెన్సార్‌షిప్‌ అమలుచేశాయి. . ఈ ఘర్షణ విషయంలో అమెరికా మొదట హితవులకు మాత్రమే పరిమితమైనా, చివరకు ఒక రాజీ సాధించింది.

“మన సమాచార మాధ్యమాలు, ముఖ్యంగా దృశ్య సమాచార మాధ్యమాలు, న్యూస్‌ రూమ్‌ లలో ఒక సమాంతర యుద్ధాన్ని నిర్వహిస్తూ వచ్చాయి. . వీక్షకులలో ఉద్రేకరసాన్ని ఉప్పొంగించేట్టుగా, గొంతులు చించుకుని, తాము యుద్ధరంగంలో ఉండి చెబుతున్నట్టు, ఒక్కొక్కసారి తామే శత్రువు మీద దాడి చేస్తున్నట్టు అభినయించారు. . ఇక సామాజిక మాధ్యమాలలో జనాభిప్రాయాన్ని నిర్మించే బాధ్యతను స్వచ్ఛందంగానో, సంస్థాగతంగానో తీసుకున్నవారు కూడా అంతే. ఎక్కడా రాని, లేని సమాచారాన్ని గుప్పించారు,, భారత ప్రభుత్వం అధికారికంగా ప్రకటించని, ధ్రువీకరించని వార్తలను ప్రచారం చేశారు.. ఒక్కొక్కసారి, భారత ప్రభుత్వ పిఐబి, అబద్ధమని నిర్ధారించిన సమాచారాన్ని కూడా యథేచ్ఛగా పోస్ట్‌ చేశారు. మీడియాయోధులు ప్రకటించిన దాడులను, ఆక్రమణలను ప్రభుత్వమే ఖండించవలసివచ్చింది.

మే 7 నుంచి ఇప్పటిదాకా ఏర్పడిన వాతావరణం ప్రభావం అంత తొందరగా పోయేది కాదు. అనేక సమీక్షలు, రాజకీయ విమర్శలు వేడిని కొనసాగిస్తాయి. యుద్ధాన్ని తీవ్రంగా కోరుకున్నవారు నిరుత్సాహ పడి ఉంటారు. ప్రతీకారం పూర్తికాలేదని బాధపడతారు. యుద్ధాన్ని కోరుకోనివారు, దేశానికి శాంతి మంచిదని భావించిన వారు సంతోషిస్తారు. రెండు శిబిరాల మధ్య విమర్శల యుద్ధం కొనసాగుతుంది.

శత్రువు మీద ఆగ్రహం ఉన్నప్పుడు, ప్రతీకారమే తక్షణకర్తవ్యమని అనిపిస్తుంది కానీ, ఒకసారి, ఘర్షణ మొదలయ్యాక, అందులోని కష్టాలు, విషాదాలు వేరువేరు. రాయబారంలో ఎంతకైనా రాజీకి సిద్ధమన్న పాండవులను ద్రౌపది ఈసడించుకున్నది. సంగ్రామంలో తన ఐదుగురు కుమారులను పోగొట్టుకున్నప్పుడు ఆమె ఒక సాధారణ మాతృమూర్తి గా రోదించింది. విజయం పొందిన తరువాత కూడా ధర్మరాజు అసంతృప్తిలో మునిగిపోయారు. కాబట్టి, యుద్ధం వద్దన్నవారు, శత్రువుల ప్రేమికులు కాదు. సమస్య పరిష్కారానికి ఇతర మార్గాలను అన్వేషించాలనేవారు, తమవైపు ప్రాణనష్టాన్నినివారించాలనేవారు మాత్రమే. వారందరూ, వీరసైనికులు తమతమ ఇళ్లకు సజీవంగా రావాలని కోరుకునేవారు మాత్రమే. శాంతి అత్యంత సాహసోపేతమైన కాంక్ష. అది భీరువులది కాదు, ద్రోహులదీ కాదు. యుద్ధాన్ని నివారించాలనేవారందరినీ శత్రుశిబిరంలోకి నెట్టివేయడం ప్రచారయుద్ధంలో ఆత్మహత్యాసదృశమైన అవలక్షణం.

ప్రస్తుత సంఘర్షణాపర్వం పెహెల్‌గామ్‌ నుంచే మొదలయిందనుకోవడం ఒక పద్ధతి. కాదు, చరిత్రను ముప్పాతికేళ్ల నుంచి, నెహ్రూ కాలం నుంచి చూడాలనుకోవడం మరో పద్ధతి. 1980ల నుంచి రాజకీయ, చారిత్రక వివాదాలు, ప్రభుత్వ వైఫల్యాలు తీవ్రవాదంగా, ఉగ్రవాదంగా ఎట్లా పరిణమించాయో, ఆ క్రమం అనేక యుద్ధాలకు, నిరంకుశ రాజ్యవ్యవస్థలకు ఎట్లా దారితీసిందో తెలుసుకోగలిగితే, విచక్షణ వికసిస్తుంది, కానీ, వివేచన ఒక నిషిద్ధ పదార్థంగా మారిపోయింది. వర్తమానంలోకి సంక్రమించిన ఒక దుస్థితిలో సతమతమవుతున్నామన్నది మాత్రం వాస్తవం. అమాయక పర్యాటకులను, అదీ మతప్రాతిపదికన, చంపి ఏదో సాధిద్దామని, లేదా తమ నేపథ్యశక్తులకు మేలు చేద్దామని ఒకళ్లు అనుకోవచ్చు. గట్టి ప్రతీకార చర్యో, సైనిక దాడో ఇటువంటివి జరగకుండా నిరోధిస్తాయని, అదే పరిష్కారమని చెబుతూ దుఃఖావేశంలో ప్రజలు ఊగిపోవచ్చు, లేదా అటువంటి భావోద్వేగ వాతావరణం నిర్మితం కావచ్చు. ఒక నెరేటివ్‌ ప్రకారం సంఘటనలో, సంఘటనల కోసం నెరేటివో, తెలుసుకోలేనట్టుగా పరిణామాలు జరుగుతాయి.

ఒకపక్క భారత్‌ అధికారిక వైఖరి, మొత్తం ఆపరేషన్‌ ప్రతినిధులుగా ఒక ముస్లిమ్‌మహిళను, ఒక కశ్మీరీ పండిట్‌ ను కూడా కలుపుకుని, ఒక సమ్మిశ్రిత సందేశం ఇవ్వాలనుకుంటే, అందుకు భిన్నంగా, దేశంలోని  మైనారిటీలందరినీ ద్రోహులుగా శంకిస్తూ చేస్తున్న ప్రచారం ఎట్లా అనుమతి పొందుతోంది?  అనుమతి కాదు, ప్రోత్సాహమే దొరుకుతోందనిపిస్తోంది, ఆ తీరు చూస్తే!  పాకిస్తాన్‌ అనుకూల పోస్టులు పెట్టేవారి మీద చర్యలు తీసుకుంటామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు, అది సహజమే, కానీ, కాంగ్రెస్‌ పార్టీనే  దేశద్రోహిగా పోస్టులు పెట్టేవారిమీద ఆయన ఎందుకు చర్యలు తీసుకోలేకపోతున్నారు? సనాతనాన్ని అభిమానిస్తామని ఒకవైపు చెప్పుకుంటూ, భారతీయ సంస్కృతిని అవమానించే భాషను వాడేవారి మీద ఏ చర్యలూ ఎందుకులేవు? సాటి భారతీయుడిని ద్వేషించడమే ప్రధానంగా, అదీ ఇటువంటి విపత్కరసమయంలో, పనిచేసే ప్రచారశక్తులను ప్రభుత్వాలు ఎందుకు ఉపేక్షించాలి?

ఇప్పుడు భారత్‌, పాకిస్థాన్‌ మధ్య జరిగినది ఒక సంఘర్షణ (కన్‌ ఫ్లిక్ట్‌). సాంకేతికంగా దీన్ని యుద్ధం అనలేము. రెండు దేశాలూ కూడా ఒకరిమీద ఒకరు యుద్ధాన్ని ‘ప్రకటించలేదు’. పాతికేళ్ల కిందటి ‘కార్గిల్‌’ కూడా ‘వార్‌’ కాదు, ‘కన్‌ఫ్లిక్ట్‌’ మాత్రమే. కానీ, మన సమాచార మాధ్యమాలు, ముఖ్యంగా దృశ్య సమాచార మాధ్యమాలు, న్యూస్‌ రూమ్‌ లలో ఒక సమాంతర యుద్ధాన్ని నిర్వహిస్తూ వచ్చాయి. . వీక్షకులలో ఉద్రేకరసాన్ని ఉప్పొంగించేట్టుగా, గొంతులు చించుకుని, తాము యుద్ధరంగంలో ఉండి చెబుతున్నట్టు, ఒక్కొక్కసారి తామే శత్రువు మీద దాడి చేస్తున్నట్టు అభినయించారు. . ఇక సామాజిక మాధ్యమాలలో జనాభిప్రాయాన్ని నిర్మించే బాధ్యతను స్వచ్ఛందంగానో, సంస్థాగతంగానో తీసుకున్నవారు కూడా అంతే. ఎక్కడా రాని, లేని సమాచారాన్ని గుప్పించారు,, భారత ప్రభుత్వం అధికారికంగా ప్రకటించని, ధ్రువీకరించని వార్తలను ప్రచారం చేశారు.. ఒక్కొక్కసారి, భారత ప్రభుత్వ పిఐబి, అబద్ధమని నిర్ధారించిన సమాచారాన్ని కూడా యథేచ్ఛగా పోస్ట్‌ చేశారు. మీడియాయోధులు ప్రకటించిన దాడులను, ఆక్రమణలను ప్రభుత్వమే ఖండించవలసివచ్చింది. . ఇక, భిన్నాభిప్రాయం ఒకింత కనిపించినా, వారిని అసభ్య, కుసంస్కార భాషలో దూషించారు! . సొంత అభిప్రాయాలు కలిగినవారిని భౌతికంగా నిర్మూలించాలనేవరకు వారి తీవ్రత వెళ్లింది!

పాకిస్థాన్‌ వైపున జరింగింది కూడా ఇదే. భారత్‌ మీద తాను అరివీరభయంకరంగా యుద్ధం చేస్తున్నట్టు, అపారమైన నష్టాలు కలిగిస్తున్నట్టు అక్కడి మీడియా చెప్పుకుంది. . వాస్తవంలో జరిగేదానికీ ఆ లెక్కలకీ పొంతనే లేదు. మరోవైపు, బలమైన ఇండియా తమ మీద దౌర్జన్యం చేస్తున్నదని చెబుతూ బాధితదేశంగా అంతర్జాతీయ సానుభూతిని పొందాలనుకుంది. . ఒక పరిశీలకుడు వ్యాఖ్యానించినట్టు, యుద్ధం చాలా సందర్భాలలో ఎదుటివారి మీద చూపించే పరాక్రమంగా మాత్రమే ఉండదు, తమ దేశప్రజల కోసం చేసే విన్యాసంగా కూడా ఉంటుంది.

యుద్ధకాలంలో జాతీయ ఉద్వేగాలు ప్రబలంగా ఉంటాయి. దేశంలోని ఆంతరంగిక విభేదాలు అప్రధానమై పోయి, ఐక్యత ముందుకు వస్తుంది. ప్రతిపక్షాలన్నీ అధికారపక్షానికే మద్దతు ఇస్తాయి. ఐక్యత అత్యవసరమూ కీలకమూ అయిన సందర్భాల్లో, రాజకీయాలు అప్రధానమైపోయి, జాతీయ ప్రభుత్వాలు ఏర్పడతాయి. సంఘర్షణల్లో దేశానికి నాయకత్వం వహించి, విజయాన్ని అందించిన పక్షమో లేదా నష్టాన్ని తగ్గించిన పక్షమో యుద్ధానంతర రాజకీయాల్లో ప్రయోజనం పొందుతారు. రాజకీయ లాభం కోసం యుద్ధాలు, ఘర్షణలు కోరి తెస్తారనడం తీవ్రమైన ఆరోపణ అవుతుంది కానీ, యుద్ధ వాతావరణం నుంచి, విజయాల నుంచి కలిగే భావావేశాలను రాజకీయంగా ఉపయోగించుకున్న సందర్భాలు, మన దేశంలోనే ఎన్నో ఉన్నాయి. అపజయాల నుంచి కలిగే కుంగుబాటు కూడా నూతన రాజకీయ శక్తుల ఆవిర్భావానికి దారితీసిన ఘట్టాలు ప్రపంచచరిత్రలో చూడవచ్చు.

బైసారన్‌ లో హత్యాకాండ జరిగిన ఒకటి రెండు గంటలలోనే, సామాజిక మాధ్యమాలలో, పాకిస్థాన్‌ పై ఆగ్రహం కంటె అధికంగా, లౌకిక, ప్రజాస్వామ్య, ప్రగతిశీలుర దూషణ మొదలయింది. హత్యాకాండకు వీరే బాధ్యులయినట్టు, లేదా హంతకులకు వీరే ప్రతినిధులయినట్టు, నిలదీయడం, నిందించడం, అసభ్యంగా దూషించడం తీవ్రమయింది. ఈ దాడిలో, ఒక సంఘటితమైన ప్రయత్నం ఉన్నట్టు సులువుగానే గ్రహించవచ్చును కానీ, అనేక మంది తమంతట తామే, ఏ ప్రేరణా లేకుండానే కూడా, భారతదేశంలోని ప్రతిపక్ష శిబిరాలకు చెందిన వ్యక్తులమీద, సమూహాల మీద దాడిప్రారంభించారు. అంతకుముందు దాకా, తెలుగు సమాజం సమకూర్చుకున్న అభ్యుదయ సంస్కారంతో ఉండే వ్యక్తులు కూడా, ఈ లించింగ్‌ లో భాగస్వాములయ్యారు. అవుతున్నారు. ఈ మార్పు చాలా బాధాకరమైనది, వినాశకరమైనది.

ఆశ్చర్యకరంగా, మన దేశంలో పెహల్‌గామ్‌ జరిగిన వెంటనే రెండు పోరాట రంగాలు అవతరించాయి. అవి ఆపరేషన్‌ సిందూర్‌ జరుగుతున్న కాలంలో కూడా కొనసాగాయి. . బైసారన్‌ లో హత్యాకాండ జరిగిన ఒకటి రెండు గంటలలోనే, సామాజిక మాధ్యమాలలో, పాకిస్థాన్‌ పై ఆగ్రహం కంటె అధికంగా, లౌకిక, ప్రజాస్వామ్య, ప్రగతిశీలుర దూషణ మొదలయింది. హత్యాకాండకు వీరే బాధ్యులయినట్టు, లేదా హంతకులకు వీరే ప్రతినిధులయినట్టు, నిలదీయడం, నిందించడం, అసభ్యంగా దూషించడం తీవ్రమయింది. ఈ దాడిలో, ఒక సంఘటితమైన ప్రయత్నం ఉన్నట్టు సులువుగానే గ్రహించవచ్చును కానీ, అనేక మంది తమంతట తామే, ఏ ప్రేరణా లేకుండానే కూడా, భారతదేశంలోని ప్రతిపక్ష శిబిరాలకు చెందిన వ్యక్తులమీద, సమూహాల మీద దాడిప్రారంభించారు. అంతకుముందు దాకా, తెలుగు సమాజం సమకూర్చుకున్న అభ్యుదయ సంస్కారంతో ఉండే వ్యక్తులు కూడా, ఈ లించింగ్‌ లో భాగస్వాములయ్యారు. అవుతున్నారు. ఈ మార్పు చాలా బాధాకరమైనది, వినాశకరమైనది.

అయితే, భారత ప్రభుత్వం అధికార ప్రకటనల్లో, పత్రికాసమావేశాల్లో ధోరణి వేరుగా ఉన్నది. పెహల్‌గామ్‌ బాధితులను భారతీయులని, పర్యాటకులని ప్రస్తావవశంగా సంబోధిస్తేనే, విరుచుకుపడిన సామాజిక సేన, భారత ప్రభుత్వం అధికారికంగా, భారతీయులు, నేపాలీయుడు అని చెబితే అభ్యంతరం చెప్పలేదు. ఒక మతవర్గాన్ని టార్గెట్‌ చేసినట్టు అధికార ప్రకటనలు ఎక్కడా చెప్పలేదు. కింది స్థాయి రాజకీయనాయకులు, రాష్ట్రాల అధినేతలు ఏం మాట్లాడినా, ప్రధానమంత్రి, హోంమంత్రి మాత్రం ఈ సందర్భంగా తమ వ్యక్తీకరణలో జాగ్రత్తగా ఉన్నారు. బిహార్‌లో చేసిన భీషణ ప్రతిజ్ఞ కూడా, పాకిస్థాన్‌ లో ఆశ్రయం పొందిన ఉగ్రవాదులను ఉద్దేశించినట్టు ధ్వనించింది కానీ, నేరుగా పాకిస్థాన్‌ ను ఉద్దేశించలేదు. దేశంలోని సామాజిక వర్గాలను బోనులో నిలబెట్టలేదు.

కానీ, దేశీయంగా నిర్మించిన రెండో రణరంగం మాత్రం, భారతీయ ముస్లింలను మొత్తంగా, వారికి మద్దతుదారులన్న పేరుతో సకల ప్రతిపక్ష శిబిరాలను లక్ష్యంగా పెట్టుకున్నది. దీని వేదిక ప్రధానస్రవంతి మీడియా దగ్గర నుంచి సామాజికమాధ్యమాల దాకా విస్తరించి ఉన్నది. ఈ యుద్ధం భారతప్రభుత్వ అధికారిక వైఖరికి భిన్నమే కాదు, వ్యతిరేకమైనది కూడా. అయినా, దేశవ్యతిరేక భావ ప్రచారానికి పాల్పడే ప్రయత్నాలను నిరోధించాలన్న ప్రభుత్వ విధానం, ఈ సోషల్‌ సేనకు వర్తించడంలేదు. ఈ సామాజిక యుద్ధసేన యథేచ్ఛగా వీరవిహారం చేస్తుండగా, ప్రత్యామ్నాయ సత్యాలకు వేదికగా నిలిచిన ‘దివైర్‌” వంటి పత్రిక మీద మాత్రం ఆంక్షలు విధించారు. దేశం ఒక యుద్ధదశకు వెళ్లవలసి వస్తున్నక్లిష్టదశలో అవసరమైన జాతీయ ఐక్యతను భంగపరచే విధంగా, దేశంలో 60 శాతం కంటె అధికంగా ఉన్న ప్రతిపక్ష ప్రజానీకాన్ని దేశద్రోహులుగా, పాక్‌ మిత్రులుగా చిత్రించడం ఎంతటి దేశద్రోహం? ఎంతటి ప్రమాదకరం?

ఒకపక్క భారత్‌ అధికారిక వైఖరి, మొత్తం ఆపరేషన్‌ ప్రతినిధులుగా ఒక ముస్లిమ్‌మహిళను, ఒక కశ్మీరీ పండిట్‌ ను కూడా కలుపుకుని, ఒక సమ్మిశ్రిత సందేశం ఇవ్వాలనుకుంటే, అందుకు భిన్నంగా, దేశంలోని మైనారిటీలందరినీ ద్రోహులుగా శంకిస్తూ చేస్తున్న ప్రచారం ఎట్లా అనుమతి పొందుతోంది? అనుమతి కాదు, ప్రోత్సాహమే దొరుకుతోందనిపిస్తోంది, ఆ తీరు చూస్తే! పాకిస్తాన్‌ అనుకూల పోస్టులు పెట్టేవారి మీద చర్యలు తీసుకుంటామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు, అది సహజమే, కానీ, కాంగ్రెస్‌ పార్టీనే దేశద్రోహిగా పోస్టులు పెట్టేవారిమీద ఆయన ఎందుకు చర్యలు తీసుకోలేకపోతున్నారు? సనాతనాన్ని అభిమానిస్తామని ఒకవైపు చెప్పుకుంటూ, భారతీయ సంస్కృతిని అవమానించే భాషను వాడేవారి మీద ఏ చర్యలూ ఎందుకులేవు? సాటి భారతీయుడిని ద్వేషించడమే ప్రధానంగా, అదీ ఇటువంటి విపత్కరసమయంలో, పనిచేసే ప్రచారశక్తులను ప్రభుత్వాలు ఎందుకు ఉపేక్షించాలి?

సంక్షోభ సమయాల్లో ప్రజలు కేవలం ప్రేక్షకులుగా ఉండరు. ఏవో కొన్ని సాంకేతికమైన విషయాలు గోప్యత కిందికి వస్తాయి కానీ, పారదర్శకమైన సత్యమే ప్రజలను సరైన అవగాహనతో ఉంచుతుంది. దేశభక్తిని సరైన పద్ధతిలో వ్యక్తం చేయడానికి ఆస్కారం ఇస్తుంది. దేశమంటే మనుషులే. యుద్ధం రానే రాగూడదు. వస్తే, న్యాయమే గెలవాలి, మన పక్షం న్యాయమే అయి ఉండాలి! . అందులో సందేహం లేదు. యుద్ధానికి ముందూ, యుద్ధంలోనూ, ఆ తరువాతా కూడా, మానవత్వం ఓడిపోకూడదు. విచక్షణ అంతరించకూడదు. స్వేచ్ఛలు తగ్గిపోకూడదు!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page