Tag law and order

భద్రతా పరిస్థితుల నేపథ్యంలో సాయంత్రం 6.30 గంటలకే కన్నాట్ ప్లేస్‌లో దుకాణాలు మూసివేత

న్యూదిల్లీ, జూలై 23: దేశ రాజధాని న్యూదిల్లీ  ప్రముఖ వాణిజ్య కేంద్రం కన్నాట్ ప్లేస్ (CP) పరిసరాల్లో నెలకొన్న క్లిష్ట పరిస్థితుల దృష్ట్యా అక్కడి అన్ని దుకాణాలు, కార్యాలయాలు, రెస్టారెంట్లు గురువారం (జూలై 23) సాయంత్రం 6.30 గంటలకే మూసివేయాలని న్యూదిల్లీ ట్రేడర్స్ అసోసియేషన్ (NDTA) అత్యవసర సలహా సర్క్యులర్ జారీ చేసింది. ఎన్‌డీఎంసీ (NDMC) చైర్మన్, వైస్ చైర్మన్ సూచనల మేరకు…

ఈ నెత్తుటి మరకలు ఎక్కడివి?

అసహనం మనుష్యుల కే కాదు!ప్రభుత్వాలకి ఉంటుంది? మానసిక వైకల్యం మనుష్యులకే కాదు!వ్యవస్థలు కూడా ఒక్కోసారి అలా మారిపోతుంటాయి.ముఖ్యంగా అధికారం పోగుపడ్డ అహంకారం గాయపడ్డప్పుడు చేష్టలే కాదు భాష కూడా విచలితం అవుతుంటుంది.ఇప్పుడు తెలంగాణలో నెత్తుటి భాష రాజ్యం ఏలుతుంది.. నెత్తుటి మరకలు రాజకీయ చరిత్ర ముఖం మీద పుట్టుమచ్చలు,పెట్టుమచ్చలు అవబోతున్నాయి.తెలంగాణానే కాదు, ఆంధ్రప్రదేశ్ లోకూడా అదే…

లోపించిన పోలీసు సంకల్పం ..!

దేశంలో చట్ట పాలన, ప్రజాస్వామ్యం, రాజ్యాంగబద్ధ పరిపాలన గురించి అధికార వర్గాలు గొప్పలు చెప్పుకునే ప్రతి సందర్భంలోనూ ఒక ప్రాథమిక ప్రశ్న మళ్లీ మళ్లీ ముందుకొస్తున్నది.. “చట్టం నిజంగా అందరికీ సమానంగా అమలవుతోందా?” ముఖ్యంగా అధికారంలో ఉన్న వారికి సంబంధించిన కేసుల్లో విచారణ తీరు, అరెస్టుల ఆలస్యం, పోలీసుల ప్రవర్తన, రాజకీయ జోక్యం వంటి అంశాలు ప్రజల్లో…

పెరుగుతున్న నేరాలు.. సైబర్ మోసాల నుంచి హత్యల వరకు!

Rising Crimes From Cyber Frauds to Brutal Murders..

తెలంగాణ రాష్ట్రం సాంకేతిక రంగంలో దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నప్పటికీ, అదే సమయంలో నేరాల పెరుగుదల విషయంలో కూడా ఆందోళనకర పరిస్థితులను ఎదుర్కొంటోంది. ముఖ్యంగా 2024 లో తెలంగాణ లో సైబర్ నేరాల రేటు ప్రతి లక్ష జనాభాకు 71.1 కేసులుగా నమోదై దేశంలోనే అత్యధికంగా నిలవడం తీవ్ర చర్చకు దారితీస్తోంది. దేశ సగటు 7.3 కేసులతో…

ఇలా వృద్ధుల పొట్ట కొట్టడం న్యాయమా?

“ఇది కేవలం ఉద్యోగులు, న్యాయస్థానాలు, తీర్పులు, సదుపాయాలు వంటి అంశాలకు సంబంధించిన సమస్య మాత్రమే కాదు. ఇందులో ప్రధానంగా జీవితమంతా, మూడు నాలుగు దశాబ్దాల పాటు ప్రభుత్వ సేవ, ప్రజా సేవ చేసి, పదవీ విరమణ పొందిన ప్రభుత్వోద్యోగులున్నారు. అంటే వృద్ధాప్యానికి చేరిన బలహీనులైన, శక్తి ఉడిగిన, సహాయం అవసరమైన మనుషులున్నారు. ఆ రకంగా ఇది…

నిర‌స‌న హ‌ద్దు దాటితే…

When Protest Crosses the Line

గోట్ ఇండియా టూర్‌లో భాగంగా  హైద‌రాబాద్‌ను సంద‌ర్శించిన ప్ర‌పంచ ప్ర‌ఖ్యాత ఫుట్‌బాల్ క్రీడాకారుడు మెస్సీకి హైద‌రాబాద్ న‌గ‌రం అద్భుత ఆహ్వానం ప‌ల‌క‌డ‌మే కాదు, త‌న‌ ప‌ట్ల చూపిన అభిమానం పుల‌క‌రింప‌జేసి వుంటుంది. నిజానికి గోట్ ఇండియా టూర్‌లో భాగంగా మెస్సీ మ‌న‌దేశంలో మూడు రోజుల పాటు నాలుగు న‌గ‌రాల్లో ప‌ర్య‌టించాల్సివుంది. అవి వ‌రుస‌గా కోల్‌క‌తా, హైద‌రాబాద్‌,…

వినరా వినరా నరుడా, తెలుసుకోర పామరుడా!

“పదేళ్లుగా దేశంలో నెలకొన్న  విభజన వాతావరణంలో, ముఖ్యంగా ఉత్తర భారతదేశంలో సాంస్కృతిక అసహనం, తమ ప్రాధాన్యాలను అమలుచేయించడానికి పౌర నిఘా (విజిలాంటిజమ్) పెరిగిపోయాయి. మూక దాడులు, హింసాకాండ పెరిగిపోయాయి. గోమాంసం తింటున్నారని, గోవులను అక్రమరవాణా చేస్తున్నారని అనుమానంతో హత్యలు జరిగిన సంఘటనలు కూడా ఉన్నాయి. ఇందుకు తగ్గట్టుగానే, ఉత్తరభారతంలో పరిస్థితులు ఉన్నాయి..” “వయసుడిగిన నాడు నన్ను…