గోముఖ వ్యాఖ్యలను జనం పసిగట్టలేరా?

కళ్లెదుట ఉన్నదాని నుంచే, మన ముందూ వెనుకా చుట్టూ ఉన్న ప్రపంచం నుంచే అన్నీ పుడతాయి,  విచారమైనా వినోదమైనా, ఆగ్రహమైనా ఆక్రోశమైనా, హహాకారమైనా హాస్యరసమైనా! చుట్టూ ఇన్ని నెత్తుటివరదలున్నాయి కదా, ఇంతటి క్రూరత్వమూ ద్వేషమూ పరచుకున్నాయి కాదా, ఎట్లా చిర్నవ్వగలము, ఎట్లా చక్కిలిగిలి పొందగలము అనుకుంటే, జీవితమే ఉండదు. కాబట్టి, నవరసభరితమైన నాటకాన్ని పంటిబి గువున, కొనప్రాణాన అయినా ఆనందించవలసిందే. మన ప్రతినాయకులందరిలోనూ ఉండే విదూషకత్వానికి కేరింతలు కొట్టవలసిందే.
హైదరాబాద్‌ ‌కేంద్రీయ విశ్వవిద్యాలయంలో అడవులను, వన్యప్రాణులను బుల్‌ ‌డోజర్లు పెట్టి బాధించడం మీద మన గౌరవనీయ ప్రధాన మంత్రి గారు ఈ మధ్య హర్యానాలో చాలా బాధపడ్డారు. ఆయన సున్నితమైన హృదయం తెలిసినవారెవరైనా, పర్యావరణం అంటే ఆయనకు ఎంత ప్రేమో, అడవులను, అడవులలోని ఖనిజ సంపదను అన్యాక్రాంతం కాకుండా ఆయన ఎంతగా కాపాడతారో, ఆదివాసుల ప్రాణం అంటే ఆయనకెంత ప్రాణమో సులువుగానే గ్రహిస్తారు.  తెలంగాణలో కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం ఉన్నది కాబట్టి, దాని మీద పోయవలసిన ఏడుదోసిళ్ల దుమ్ములో ఒక దోసిలికి ఈ జింకలనెమళ్ల హననం సరిపోతుంది అనుకున్నట్టున్నారు. తన జీవకారుణ్యం గురించిన పరిశోధనలు చేసే ఓపిక ఎవరికీ ఉండదని ఆయనకు చాలా నమ్మకం.

పెట్టుబడి రుణాల కోసం జపాన్‌ ‌లో ప్రయత్నాలు చేస్తున్న రేవంత్‌ ‌రెడ్డి, అక్కడి తెలుగువారు ఏర్పాటు చేసిన సమావేశంలో, ప్రాజెక్టుకు కొందరు అడ్డుపడడం గురించి మాట్లాడారు. అందులో విశేషం ఏమీ లేదు కానీ, మూసీప్రాజెక్టు ఆవశ్యకతను చెబుతూ పేర్కొన్న పర్యావరణ కారణాలు మాత్రం ఆశ్చర్యకరం. దిల్లీని చూసి అయినా మనం గుణపాఠం తీసుకోవాలని ఆయన అన్నారు. నాలుగువందల ఎకరాలను హరితరహితం చేయడం, దిల్లీ నుంచి మనం గుణపాఠం తీసుకోవడం అవుతుందా? అన్న ప్రశ్నకు ఆయన ఇప్పుడు సమాధానం చెప్పవలసి ఉంటుంది.

ప్రపంచం ముందు పరువు పోయినా, కోర్టులు గుంజీలు తీయిస్తున్నా, గావు పట్టిన ఆ నాలుగువందల ఎకరాలను ఎట్లాగైనా పూర్తిగా కొరికే యాలని తెలంగాణ ప్రభుత్వం డిసైడ్‌ అయినట్టుంది. అందుకని, మునుపు అనేక మార్లు భంగపడ్డ మంత్రిపుంగవులు మళ్లీ మళ్లీ ‘ మా భూములు మావేనని’ గర్జిస్తూనే ఉన్నారు. అడవి మిథ్య, జింకలు మిథ్య, బుల్‌ ‌డోజర్లు మిథ్య అని వేదాంతాలు చెబుతున్నారు. రాహుల్‌ ‌గాంధీ కులగణన కోసం చేస్తున్న పోరాటానికి, తెలంగాణలో దళిత వర్గీకరణ అమలు చేస్తున్నందుకు బెదిరిపోయి బిజెపి ఈ పర్యావరణ నిందలు వేస్తున్నదని ఒక అమాత్యులు వ్యాఖ్యానించారు. ఒక్క పీసీసీ అధ్యక్షుడు మాత్రం మోదీగారి విమర్శకు  కాస్త అర్థవంతమైన సమాధానం ఇచ్చారు. ‘ఎన్ని అడవులు కార్పొరేట్లకు ధారవోసినావు నీవు, ఇప్పుడు ఇట్లా నీతులు చెబుతున్నావు!’  అని ఓ విసరు విసిరారు. హెచ్‌సీయూ వివాదాన్ని ఏదో రకంగా నిశ్శబ్దం చేయకపోతే, అప్రదిష్ఠ పెరుగుతూనే పోతుందని తెలియని అమోఘమేధావులు తెలంగాణ ప్రభుత్వ సలహాదారులలో ఉన్నారు. లేకపోతే, ప్రభుత్వంలో సీనియర్‌ ఐఎఎస్‌ అధికారికి హెచ్‌సియు సోషల్‌ ‌మీడియా పోస్టుల మీద నోటీసులు ఇవ్వడం ఏమిటి, పోలీస్‌ ‌స్టేషన్‌కు రమ్మనడం ఏమిటి? మాడు పగిలేటట్టు ఆమె సమాధానం ఇచ్చారు. సరిపోయింది.

మనుషులు దేనికి స్పందిస్తారో, దేనికి నిమ్మకు నీరెత్తుతారో తెలియదు. విద్యాసంస్థల భూములను కానీ, మహానగరాలకు ప్రాణవాయువులు అందించే హరితవనాలను కానీ అభివృద్ధి పేరుతో నేలమట్టం చేసే ప్రయత్నాల మీద అందరూ గొంతెత్తవలసిందే. నోరులేని వన్యప్రాణులు నీడలేక అంతరిస్తుంటే, దానికి మనసు చెమర్చని మనుషులెవరూ ఉండకూడదు. ఈ ఆకుపచ్చని హృదయాలు అన్నీ మనుషుల మీద జరుగుతున్న జాతిహనన మారణకాండల మీద కూడా అదే విధంగా స్పందిస్తాయని చెప్పలేము. వీరిలో ఎందరిని గాజా  ఊచకోతలు, బస్తర్‌ ఆదివాసీ ఆర్తనాదాలు కదిలిస్తాయో చెప్పలేము.  రెంటికీ పోటీ పెట్టడం తప్పే కానీ, ప్రపంచం మనుగడకు రెండు రకాల సున్నితత్వాలూ అవసరమే.  కానీ, అత్యంత క్రూరత్వానికి  సారథ్యం వహించేవారు, మరొకవైపు కుందేళ్లను, జింకలను ప్రేమి స్తుంటే, అందులోని ద్వం ద్వానికి, ఆ విరోధాభాసకు బాధ కలగకుండా,  నవ్వు రాకు ండా ఉండదు. కేంద్ర ంలో కానీ, రాష్ట్రంలో కానీ, స్వ యంగా వేల వేల ఎక రాల అటవీభూములను ‘అభివృద్ధి మాత’ కు హారతి ఇచ్చిన వారి  నుంచి ఇప్పుడు కొత్తగా ఈ హృద యస్పందనలు విడ్డూరంగా అనిపిస్తాయి. అశ్వమేధం కోసం వదిలిన గుర్రంలాగా, ధర్మాన్ని నెలకొల్పే బుల్‌డోజర్‌ ‌కాంగ్రెస్‌ ‌రాష్ట్రానికి కూడా చేరుకుని వీరవిహారం చేస్తుంటే, మహారాజుగారు ఎందుకు తప్పుపట్టాలి? ?

నిజానికి, హెచ్‌సీయూ వ్యవహారంలో ఎక్కువ నష్టం జరిగింది రాహుల్‌గాంధీ ప్రతిష్ఠకు. ఆ విషయం గ్రహించినందువల్లనే తనవంతు బాణం కూడా ప్రధానమంత్రి సంధించారు. ఈ విషయంలో తప్పులో పడిన రాహుల్‌ ‌గాంధీ, మరో రూపంలో తన స్వచర్మ రక్షణకు ప్రయత్నిస్తున్నారు. రోహిత్‌ ‌వేముల విషయంలో తాను తీసుకున్న వైఖరిని రంగం మీదికి తెచ్చారు. విద్యాసంస్థలలో కులవివక్షను నిరోధించడానికి రోహిత్‌ ‌వేముల చట్టాన్ని తీసుకురావాలని ఆయన తెలంగాణ ముఖ్యమంత్రిని కాక, విడ్డూరంగా కర్ణాటక ముఖ్యమంత్రికి సూచన చేశారు! రోహిత్‌ ‌వేముల తెలుగువాడు. హెచ్‌సీయూ విద్యార్థి. అతని ఆత్మహత్య సందర్భంలో రాహుల్‌ ‌యూనివర్సిటీని సందర్శించే ప్రయత్నం చేశారు. రేవంత్‌ ‌రెడ్డికి ఆ సూచన చేస్తే, హెచ్‌సీయూ గుర్తుకు వచ్చి, అక్కడ ఇటీవలి బీభత్సం చర్చకు వచ్చి తన మీద అంతా విరుచుకుపడతారని రాహుల్‌ అనుకుని ఉంటారు! కులగణన, వర్గీకరణ వంటి సామాజికాంశాలకు ప్రతిగా, ప్రధాని అడవులు, జింకల ప్రస్తావన తెచ్చారని తెలంగాణ మంత్రులు చేసిన వాదనకు, రాహుల్‌ ‌స్పందనకు సరిగ్గా సరిపోయింది!

నిజానికి, హెచ్‌సీయూ వ్యవహారంలో ఎక్కువ నష్టం జరిగింది రాహుల్‌గాంధీ ప్రతిష్ఠకు. ఆ విషయం గ్రహించినందువల్లనే తనవంతు బాణం కూడా ప్రధానమంత్రి సంధించారు. ఈ విషయంలో తప్పులో పడిన రాహుల్‌ ‌గాంధీ, మరో రూపంలో తన స్వచర్మ రక్షణకు ప్రయత్నిస్తున్నారు. రోహిత్‌ ‌వేముల విషయంలో తాను తీసుకున్న వైఖరిని రంగం మీదికి తెచ్చారు. విద్యాసంస్థలలో కులవివక్షను నిరోధించడానికి రోహిత్‌ ‌వేముల చట్టాన్ని తీసుకురావాలని ఆయన తెలంగాణ ముఖ్యమంత్రిని కాక, విడ్డూరంగా కర్ణాటక ముఖ్యమంత్రికి సూచన చేశారు! రోహిత్‌ ‌వేముల తెలుగువాడు. హెచ్‌సీయూ విద్యార్థి. అతని ఆత్మహత్య సందర్భంలో రాహుల్‌ ‌యూనివర్సిటీని సందర్శించే ప్రయత్నం చేశారు.  రేవంత్‌ ‌రెడ్డికి ఆ సూచన చేస్తే, హెచ్‌సీయూ గుర్తుకు వచ్చి, అక్కడ  ఇటీవలి బీభత్సం చర్చకు వచ్చి తన మీద అంతా విరుచుకుపడతారని రాహుల్‌ అనుకుని ఉంటారు! కులగణన, వర్గీకరణ వంటి సామాజికాంశాలకు ప్రతిగా, ప్రధాని అడవులు, జింకల ప్రస్తావన తెచ్చారని తెలంగాణ మంత్రులు చేసిన వాదనకు, రాహుల్‌ ‌స్పందనకు సరిగ్గా సరిపోయింది!

తెలంగాణ ప్రభుత్వం పర్యావరణ శిరోవేదన ఇంకా ముగియలేదు, అది జపాన్‌కు కూడా పాకింది! పెట్టుబడుల సమీకరణకు రేవంత్‌ ‌రెడ్డి జపాన్‌ ‌లో ఉన్నారు.  తెలంగాణలో ఇప్పటికే ఉన్నకంపెనీల నుంచి అదనపుపెట్టుబడులను, కొత్త కంపెనీలనుంచి కొత్త పెట్టుబడులను ఆకట్టుకోవడానికి ఆయన ప్రయత్నిస్తున్నారు. అది సహజమే, అవసరమే. రాష్ట్రం మీద తన ముద్ర ఉండేటట్టు రెండు భారీ ప్రాజెక్టులను రేవంత్‌ ‌రెడ్డి తలపెట్టారు. ఒకటి నాలుగో నగరం, రెండు, మూసీ రివర్‌ ‌ఫ్రంట్‌. ఇతర పెట్టుబడులకు నాలుగో నగరం లక్ష్యం కాగా, రివర్‌ ‌ఫ్రంట్‌ ‌హైదరాబాద్‌ ‌మీద గురిపెట్టినది.  కొరియాలోనూ, ఇప్పుడు జపాన్‌ ‌లోను రివర్‌ ‌ఫ్రంట్‌ ‌లను చూసి ఆయన చాలా ముచ్చట పడుతున్నారు.   మూసీప్రాజెక్టులో  భూసేకరణ, పునరావాసాలకు పెద్ద మొత్తంలో నిధులు కావాలి. వాటితో సహా  మొత్తంగా  ఈ ప్రాజెక్టుకు నిధులన్నీ బయటి నుంచే సమీకరి ంచాలి.  ప్రాజెక్టు ఆలోచన మీద ప్రజలలో పెద్ద సుముఖత వ్యక్తం కావడం లేదు. ప్రతిపక్షాల వ్యతిరేకత ఎట్లాగూ ఉంది.  పెట్టుబడి రుణాల కోసం జపాన్‌ ‌లో ప్రయత్నాలు చేస్తున్న రేవంత్‌ ‌రెడ్డి, అక్కడి తెలుగువారు ఏర్పాటు చేసిన సమావేశంలో, ప్రాజెక్టుకు కొందరు అడ్డుపడడం గురించి మాట్లాడారు. అందులో విశేషం ఏమీ లేదు కానీ, మూసీప్రాజెక్టు ఆవశ్యకతను చెబుతూ పేర్కొన్న  పర్యావరణ కారణాలు మాత్రం ఆశ్చర్యకరం. దిల్లీని చూసి అయినా మనం గుణపాఠం తీసుకో వాలని ఆయన అన్నారు.

హైదరాబాద్‌ ‌కేంద్రీయ విశ్వవిద్యాలయంలో అడవులను, వన్యప్రాణులను బుల్‌ ‌డోజర్లు పెట్టి బాధించడం మీద మన గౌరవనీయ ప్రధాన మంత్రి గారు ఈ మధ్య హర్యానాలో చాలా బాధపడ్డారు. ఆయన సున్నితమైన హృదయం తెలిసినవారెవరైనా, పర్యావరణం అంటే ఆయనకు ఎంత ప్రేమో, అడవులను, అడవులలోని ఖనిజ సంపదను అన్యాక్రాంతం కాకుండా ఆయన ఎంతగా కాపాడతారో, ఆదివాసుల ప్రాణం అంటే ఆయనకెంత ప్రాణమో సులువుగానే గ్రహిస్తారు.  తెలంగాణలో కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం ఉన్నది కాబట్టి, దాని మీద పోయవలసిన ఏడుదోసిళ్ల దుమ్ములో ఒక దోసిలికి ఈ జింకలనెమళ్ల హననం సరిపోతుంది అనుకున్నట్టున్నారు. తన జీవకారుణ్యం గురించిన పరిశోధనలు చేసే ఓపిక ఎవరికీ ఉండదని ఆయనకు చాలా నమ్మకం.

నాలుగువందల ఎకరాలను హరితరహితం చేయడం, దిల్లీ నుంచి మనం గుణ పాఠం తీసుకోవడం అవు తుందా? అన్న ప్రశ్నకు ఆయన ఇప్పుడు సమా ధానం చెప్పవలసి ఉం టుంది. దిల్లీ తీవ్రమైన నీటి కాలుష్యాన్ని, వాయు కాలుష్యాన్ని ఎదుర్కొం టోంది. పట్టణంలోని వాహనాలు, పరిశ్రమలు వదిలే కాలుష్యానికి తోడు పై నుంచి పంజాబ్‌ ‌హర్యానాల్లో పంటవ్యర్థాలను కాల్చిన పొగ దిల్లీ ఆకాశాన్ని, ముఖ్యంగా శీతాకాలంలో ముంచెత్తుతుంది. హర్యానా నుంచి వచ్చే విషకాలుష్య ప్రవాహాలు యమునలో కలసి తాగేనీటిని కలుషితం చేస్తున్నాయన్న ఆరోపణ మొన్నటి ఎన్నికల్లో ప్రధానాంశంగా ఉన్న సంగతి తెలిసిందే. దిల్లీలో ఉండే ప్రత్యేక వాతావరణ పరిస్థితులు, అడ్డూ ఆపూ లేని నిర్మాణ కార్యక్రమాల సంగతి పక్కన పెడితే, హైదరాబాద్‌ ‌లో జలవాయు కాలుష్యాలు గణనీయంగా ఉన్నాయి. ఉష్ణోగ్రతలు క్రమంగా పెరిగిపోతున్నాయి. పారిశ్రామిక వ్యర్థాల శుద్ధి, మూసీ ప్రవాహం శుద్ధి ముడిపడి ఉన్నాయి. రివర్‌‌ఫ్రంట్‌ ‌వంటి వాణిజ్య ప్రాజెక్టుతో నిమిత్తం లేకుండానే, మూసీ ప్రక్షాళన చేయవలసిందే. పర్యాటకతను తీర్చి దిద్దడం కోసం చేసే అలంకరణలను, ప్రజల నివాస, మనుగడ అవసరాలను దెబ్బతీయడకుండా ఎట్లా చేయవచ్చో ఆలోచించవచ్చు. కానీ, ప్రభుత్వం మూసీ పొడువునా నివసిస్తున్నవారిని అభద్రతలోకి, ఆందోళనలోకి నెట్టివేసి, ఎటువంటి సంప్రదింపులు లేకుండా దుందుడుకుగా వ్యవహరి ంచాలని చూసింది.

కానీ, రేవంత్‌ ‌రెడ్డి ప్రకారం, హైదరాబాద్‌ ‌దిల్లీ కాగూడంటే, వాయుకా లుష్యాన్ని కూడా నిరోధించాలి కదా, నగరంలో పెరుగుతున్నవేడిని నియంత్రించాలి కదా, మరి అసలే అంతంత మాత్రంగా ఉన్న సిటీ హరితశ్వాస స్థలాలను ఎందుకు చదును చేయడం?
పరిపాలనలో ప్రజలను, ప్రతిపక్షాలను, పౌరసమాజాన్ని భాగస్వాములను చేస్తూ, ప్రాజెక్టులను రూపొందించుకుంటే,  ఏకాభిప్రాయాన్ని సాధించు కోవచ్చు. ఏకపక్ష నిర్ణయాలు, సంప్రదింపులు లేని పాలన అంటూ గత ప్రభుత్వాన్ని విమర్శించిన రేవం త్‌రెడ్డి, తాను కూడా అదే దారిలో నడిస్తే ఉపయో గమేమిటి? ఎప్పటికేది తోస్తే, అప్పటికి అది మాట్లాడి నెగ్గుకు రావచ్చునని, ప్రజలు అన్నిటినీ సమన్వయ పరచుకుని అర్థం చేసుకోలేరని పాలకులు అనుకు ంటారు. కానీ,  నాయకులలోని  వైరుధ్యాలను ప్రజలు గుర్తించగలరు.  అకస్మాత్తుగా ఒకరికి జీవకారుణ్యం ఆవేశిస్తే, మరొకరికి వేముల రోహిత్‌ ‌గుర్తొస్తే, ఇంకొకరికి దిల్లీకాలుష్యం స్ఫురిస్తే, జనం చెవులు కట్టుకుని వింటారని ఆశించవద్దు. వీళ్ళు ఇట్లా ఆవులిస్తూ  ఉంటే , వాళ్లు లెక్కపెడుతూ ఉంటారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page