హైదరాబాద్,ప్రజాతంత్ర, ఏప్రిల్ 28 : మావోయిస్టుల అంశంపై జానారెడ్డితో చర్చ జరిగినట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. గతంలో మావోయిస్టులతో చర్చలు నిర్వహించిన అనుభవం జానారెడ్డి, కేకేలకు దగ్గర ఉందని, ఇప్పుడు కూడా అదే విధంగా వ్యవహరించేందుకు అధిష్టానం నిర్ణయాన్ని ఎదురుచూస్తున్నామని వెల్లడించారు.
పార్టీ హైకమాండ్ కు సమాచారం ఇచ్చి, పీస్ కమిటీ రిక్వెస్ట్ పంపిస్తామని తెలిపారు. జానారెడ్డితో సీఎం రేవంత్రెడ్డి భేటీ అయ్యారు. మావోయిస్టులతో చర్చల కోసం శాంతి కమిటీ ఏర్పాటు చేస్తామని ఈ సందర్భంగా సీఎం అన్నారు. మావోయిస్టుల అంశంపై జానారెడ్డి, కే కేశవరావు పార్టీలో చర్చిస్తారని తెలిపారు.