– ఈవీ పాలసీ కింద రూ.577 కోట్ల ట్యాక్స్ మినహాయింపు
– రాష్ట్రంలో వాహన్ అమలు
– స్క్రాపింగ్ పాలసీ అమల్లోకి
– మంత్రి పొన్నం ప్రభాకర్
హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 22: చెక్పోస్టులను రద్దు చేస్తూ రెండు నెలల క్రితం తీసుకున్న నిర్ణయాన్ని ఇప్పడు అమలు చేస్తున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. బుధవారం ఆయన మాట్లాడుతూ తెలంగాణ లో ఈవి పాలసీ తీసుకొచ్చిన తర్వాత రూ.577 కోట్ల టాక్స్ ప్రభుత్వం మినహాయించింది. ఇవీ వెహికిల్ అమ్మకాల షేర్ నుండి 0.03 నుండి 1.13 షేర్ పెరిగింది. దిల్లీలో పొల్యూషన్ లో ఉండే పరిస్థితి లేదు.. ఇక్కడ అలాంటి పరిస్థితి లేకుండా ఉండడానికి ఇవి పాలసీ తీసుకొచ్చామన్నారు. నగరంలో 20 వేల ఎలక్ట్రిక్ ఆటో లకు అనుమతి ఇచ్చామన్నారు. ఎల్పీజీ, సీఎన్ జీ ఆటో లకు 10 వేలు చొప్పున అనుమతి ఇచ్చామన్నారు. 25 వేల రేటిరోఫిటింగ్ ఆటో లకు అనుమతి ఇచ్చామన్నారు. రాష్ట్రంలో వాహన్ అమలవుతుంది..సారథి త్వరలోనే తీసుకొస్తామన్నారు. స్క్రాపింగ్ పాలసీ తీసుకొచ్చామని గుర్తు చేశారు. వాహనాలకు కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం రేడియం స్టిక్కర్స్ అమలయ్యేలా తెచ్చామన్నారు. ఏఐ టెక్నాలజీ ను ఉపయోగించి రవాణా శాఖ కార్యాలయాల్లో రికార్డ్ చేస్తూ రెగ్యులర్ గా వొచ్చే వాళ్ళని నోట్ చేసి హెడ్ ఆఫీస్ కి అలెర్ట్ చేస్తుంది..అలాంటి వాటిని నిరోధించడానికి ఉపయోగిస్తున్నామన్నారు. వెహికిల్ ట్రాకింగ్ ప్రాసెస్ కొనసాగిస్తున్నామన్నారు. డ్రైవింగ్ మీద మంచి నైపుణ్యాలు పెంచడానికి అవగాహన కలిగించడానికి కార్యక్రమాలు అమలు చేస్తున్నామన్నారు. రోడ్ సేఫ్టీ పై ప్రజలకు విస్తృత అవగాహన కల్పిస్తున్నామన్నారు. రోడ్ సేఫ్టీ చిల్డ్రన్ అవేర్నెస్ పార్క్ లు ఏర్పాటు చేస్తున్నాం.. నాచారం లో గవర్నర్ ప్రారంభించారు.. కరీంనగర్ లో ప్రారంభించుకున్నామన్నారు. ఆటోమేటిక్ డ్రైవింగ్ లైసెన్స్ సిస్టమ్ తీసుకొస్తున్నామన్నారు. టూరిజం వెహికల్స్ కి డబుల్ నెంబర్ ప్లేట్ తో పోతున్నాయని ఆరోపణల నేపథ్యంలో హై సెక్యూరిటీ ప్లేట్స్ తీసుకొస్తున్నామని తెలిపారు. రోడ్ సేఫ్టీ క్లబ్స్ కాలేజీలలో జూనియర్, డిగ్రీ ఇతర వాటిలో అవగాహన కల్పించేలా ఏర్పాటు చేస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం క్యాష్ లెస్ ట్రీట్మెంట్ కార్యక్రమాన్ని తీసుకొచ్చింది.. దాని అమలు పై మెడికల్ , పోలీస్, నేషనల్ హైవేస్ తో సమీక్షా సమావేశం జరిగిందన్నారు. రవాణా శాఖ రెవెన్యూ కలెక్షన్ చేసే డిపార్ట్మెంట్.. 112 మంది ఏఎంవీఐ లను నియమించి వారికి శిక్షణ ఇచ్చి తీసుకున్నామన్నారు. నలుగురు ఆర్టీవో లను గ్రూప్-1 ద్వారా నియమించామన్నారు. రవాణా శాఖ కు ఒక లోగో తీసుకొచ్చాం తెలంగాణ పోలీస్ ,ఫారెస్ట్ మాదిరి లోగో తీసుకున్నామన్నారు. టీఎస్ ను టీజీ గా మార్చామన్నారు. ప్రతి ఒక్కరు డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోవాలి. ఇల్లీగల్ , ఓవర్ లోడింగ్ ఎన్ఫోర్స్ మెంట్ పై ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తున్నామన్నారు. రాష్ట్రంలో1.7 కోట్ల వాహనాలు ఉన్నాయి.. వాటన్నిటిని రోడ్ ప్రమాదాలు తగ్గించేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. డిపార్ట్ మెంట్ పారదర్శకంగా ఉండేలా చర్యలు తీసుకుంటున్నాం. పాత వాహనాలు డబుల్ నంబరింగ్ అరికట్టడానికి మైనింగ్,ఇతర వాహనాలకు మొదటగా చూస్తున్నాం. రవాణా శాఖ లోని 63 కేంద్రాల్లో కెమెరా ల ద్వారా పర్యవేక్షణ జరుగుతుందన్నారు. బ్రోకర్ వ్యవస్థను అరికట్టడానికి కఠినచర్యలు తీసుకుంటున్నామన్నారు. పోలీస్ శాఖ ,ఆర్టీసీ ఇతర విభాగాలలో పాత వాహనాలకు స్క్రాప్ కి పంపించాలని లేఖ రాసామన్నారు. వొచ్చే ఆదాయాన్ని ఆన్లైన్ ద్వారా చెల్లించేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. వాహన్ సారథి లో 28 రాష్ట్రాలు ఉన్నాయి గత 10 సంవత్సరాలుగా తెలంగాణ ఎందుకు చేరలేదని ప్రశ్నించారు. ఇప్పుడు మేము వాహన్ సారథి లో చేరాం. డేటా ట్రాన్ఫర్మింగ్ జరుగుతుంది. వాహన్ అమలు చేస్తున్నాం. సారథి అమలు చేస్తామన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





