Category తెలంగాణ

కౌంటింగ్ కు సర్వం సిద్ధం రుద్రారం గీతం యూనివర్సిటీలో ఏర్పాట్లు పూర్తి

పటాన్ చెరు,ప్రజాతంత్ర, డిసెంబర్ 2: సంగారెడ్డి జిల్లాలోని ఐదు నియోజకవర్గాల అసెంబ్లీ స్థానాల ఓట్లు కౌంటింగ్ ను పటాన్ చెరు మండల పరిధిలోని రుద్రారం గీతం యూనివర్సిటీలో కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఈ మేరకు ఆదివారం నిర్వహించే కౌంటింగ్ కోసం రుద్రారం గీతం యూనివర్సిటీలో ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ కార్యక్రమంలో కౌంటింగ్ ప్రక్రియ…

సుధీర్ రెడ్డి భారీ మెజార్టీతో గెలవాలని హనుమాన్ దేవాలయంలో ప్రత్యేక పూజలు

 ఎల్బీనగర్ ప్రజాతంత్ర, డిసెంబర్ 2: ఎల్బీనగర్  నియోజకవర్గ శాసనసభ్యులుగా సుధీర్ రెడ్డి మరోసారి విజయం సాధించాలని కర్మన్ ఘాట్ హనుమాన్ దేవాలయ చైర్మన్ నల్ల రఘుమరెడ్డి ఆధ్వర్యంలో శనివారం హనుమాన్ దేవాలయం నందు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్బంగా స్వామి వారి ప్రసాదాన్ని సుధీర్ రెడ్డికి అందజేశారు. తప్పకుండా భారీ మెజారిటీతో విజయం సాధిస్తామని…

ఉప్పల్ లో  గెలుపు నాదే బిజెపి ఎమ్మెల్యే అభ్యర్థి ఎన్.వి.ఎస్.ఎస్ ప్రభాకర్ ధీమా 

ఉప్పల్, ప్రజాతంత్ర, డిసెంబర్ 2: ఉప్పల్ నియోజకవర్గంలో కేంద్ర నిధులతో నేను ఎమ్మెల్యే గా ఉన్న సమయంలో చేసిన అభివృద్ధి తప్ప టిఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి ఏమీ లేదని ఆ అభివృద్ధి చూసి ప్రజలు నాకు మరోసారి పట్టం కట్టబోతున్నారని ఉప్పల్ నియోజకవర్గం బిజెపి ఎమ్మెల్యే అభ్యర్థి ఎన్.వి.ఎస్.ఎస్ ప్రభాకర్ ధీమా వ్యక్తం చేశారు.…

ముగిసిన మైసిగండి మైసమ్మ దేవత కార్తీక పౌర్ణమి బ్రహ్మోత్సవాలు

ఆమనగల్లు, ప్రజాతంత్ర డిసెంబర్ 2 : కడ్తాల మండలంలోని మైసిగండి గ్రామంలో వెలసిన శ్రీ మైసమ్మ దేవత అమ్మవారి కార్తీక పౌర్ణమి బ్రహ్మోత్సవాలు శనివారంతో ముగిశాయి. ఈ బ్రహ్మోత్సవాల్లో భాగంగా నవంబర్ 27 నుంచి అమ్మవారికి కార్తీక పౌర్ణమి పూజలు నిర్వహించారు. శనివారం అమ్మవారిని వివిధ కూరగాయలతో అలంకరణ చేసి ప్రత్యేక పూజలు చేశారు. ఈ…

పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి సర్పంచ్ గూడూరు లక్ష్మీ నర్సింహ్మ రెడ్డి

ఆమనగల్లు, ప్రజాతంత్రం డిసెంబర్ 2 : పరిసరాల పరిశుభ్రత మనందరి బాధ్యత అని కడ్తాల్ సర్పంచ్ గూడూరు లక్ష్మీనరసింహారెడ్డి అన్నారు. శనివారం పట్టణ కేంద్రంలో ప్రభుత్వ కార్యాలయాలలో ప్రత్యేక పారిశుద్ధ్య నిర్వహణ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ పరిసరాలు పరిశుభ్రంగా ఉండే విధంగా ప్రతి ఒక్కరు సహకరించాలని,  గ్రామపంచాయతీ ట్రాక్టర్ లోనే  ప్రతిరోజు…

మృతురాలి కుటుంబానికి సర్పంచ్ ఆర్థిక సహాయం అందజేత

 ఆమనగల్లు, ప్రజాతంత్ర డిసెంబర్ 2 : కడ్తాల పట్టణానికి చెందిన సోమరాజు అంజమ్మ అనారోగ్యంతో మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న కడ్తాల సర్పంచ్ గూడూరు లక్ష్మీ నరసింహ్మ రెడ్డి (ఎల్ ఎన్ రెడ్డి) వారి కుటుంబాన్ని పరామర్శించి ఓదార్చారు. అంజమ్మ  మృత దేహానికి పూల మాల వేసి నివాళులర్పించారు. అనంతరం రూ. 5, వేల…

పటాన్ చెరు పట్టణంలో ఎక్కడి చెత్త అక్కడే

పటాన్ చెరు,ప్రజాతంత్ర, డిసెంబర్ 2: పటాన్ చెరు పట్టణ పరిధిలోని గౌతమ్ నగర్, చైతన్య నగర్, శాంతినగర్ కాలనీలో ఎక్కడీ చెత్త అక్కడే పేరుకుపోయింది. అధికారులు చెత్తను జిహెచ్ఎంసి ఆటోలకు వేయాలని చెబుతున్నారు. కొన్నిచోట్ల ఆటోవాలలు నిర్ణయించిన మొత్తం కంటే ఎక్కువ అడుగుతుండడంతో ఇచ్చుకోలేని వారు చెత్తను బహిరంగ ప్రదేశాల్లో వేస్తున్నారు. మరోవైపు చెత్త కుండీలు…

మాల మహనాడు ఆధ్వర్యంలో జె.ఈశ్వరి భాయి జయంతి

హిమాయత్‌నగర్‌, ప్రజాతంత్ర, డిసెంబర్ 02 : మాల మహనాడు ఆధ్వర్యంలో మాల మహనాడు రాష్ట్ర కార్యాలయంలో ఆర్.పి.ఐ జాతీయ అధ్యక్షులు, రెండు పర్యాయాలు, ఎమ్మెల్యే, ఒక సారి కౌన్సిలర్ గా గెలుపొందిన జె.ఈశ్వరి బాయి 105 వ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఆమె మార్గంలో తాము 2018 పట్టభద్రుల ఎమ్మెల్సీగా మహబూబ్ నగర్, రంగారెడ్డి, హైదరాబాద్…

 నేడు సాయిరాం ఆస్పత్రి ఆవరణలో మాణిక్ ప్రభు పాదుకా పూజా

వికారాబాద్ జిల్లా, ప్రజాతంత్ర, డిసెంబర్ 2: వికారాబాద్ జిల్లా కేంద్రంలోని గంగారంలో గల శ్రీ సద్గురు సాయిరాం ఆసుపత్రి ఆవరణలో సత్యసాయి సేవా కన్వీనర్ సత్యనారాయణ గౌడ్ నివాసంలో ఆదివారం ఉదయం 10 గంటలకు హుమ్నాబాద్ మాణిక్ ప్రభు పాదుకా పూజా కార్యక్రమం నిర్వహించనున్నట్లు సత్యసాయి సేవ కన్వీనర్ సత్యనారాయణ గౌడ్ శనివారం తెలిపారు. ఈ…