Category ప్రత్యేక వ్యాసాలు

పంటల కొనుగోళ్లలో ఏటా తిప్పలే !

సంక్రాంతి సందర్భంగా అన్నదాతలను పొగడడం..రైతు ప్రభుత్వమని చెప్పుకోవడం మినహా సంపూర్ణంగా రైతులకు మేలు జరగడం లేదు. వారు ఎదుర్కొంటున్న సమస్యలను క్షేత్రస్తాయిలో ఆలోచన చేయడం లేదు. ఉభయ తెలుగు రాష్టాల్ల్రో పంటల కొనుగోళ్లు అనేవి ఏటా ఓ ప్రహసనంగా మారుతున్నాయి. పంటలను సకాలంలో కొనుగోలు చేసి వారికి డబ్బులు చెల్లించే పక్కా ఏర్పాట్లు జరగడం లేదు.…

భారతదేశం కోసం ఓ బడ్జెట్‌ …

ఈ ఏడాది భారతీయ జనతా పార్టీ (బీజేపీ) నాయకత్వంలోని జాతీయ ప్రజాస్వామ్య కూటమి (ఎన్‌డిఎ) ప్రభుత్వం వరుసగా 11వ కేంద్ర బడ్జెట్ను ప్రవేశపెట్టనుంది. ఈసారి అసాధారణ పరిస్థితుల నడుమ తాజా బడ్జెట్‌ ‌రాబోతోంది. ఈ మేరకు తీవ్రస్థాయిలో విభజితమైన ప్రపంచం మునుపెన్నడూ లేని రీతిలో ఆర్థిక సవాళ్లతోనే కాకుండా అదనంగా వాతావరణ మార్పు సమస్యతో సతమతమవుతోంది.…

అం‌ధ విశ్వాసాలను తూర్పారబట్టిన విశ్వ మానవుడు యోగి వేమన

వేమన పద్యాలు వందల సంవత్సరాల వరకు గ్రంథస్తం కాకుండా కేవలం సామాన్యుల నోటనే నిలిచి ఉన్నాయి. భారతదేశం సందర్శించిన ఒక ఫ్రెంచి మిషనరీ జె ఎ దుబాయ్‌ 1806‌లో హిందువుల అలవాట్లు ఆచారాలు, పండుగలు అనే గ్రంథాన్ని ఫ్రెంచి భాషలో వ్రాశాడు. దీనిని 1887 లో హెన్రీ కె బ్యూకేంప్‌ ఆం‌గ్లలోకి అనువదించాడు. దీనిలో ఆత్మ…

గవర్నర్‌ ‌వ్యవస్థని రద్దు చేయాలి

స్వాతంత్య్ర భారతదేశంలో నాటి నుండి నేటి దాకా  కొన్ని రాష్ట్రాల్లోని  గవర్నర్లు రాజ్యాంగబద్ధంగా వ్యవహరించకుండా తమ ఇష్టారాజ్యంగా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలపై పెత్తనాలు సాగిస్తూ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ ఒక రకంగా సమాంతర ప్రభుత్వాలని నడిపిస్తున్నారు. ఆ  విధంగా వ్యవహరించే వారి ఆధిపత్య ధోరణులు ఏమాత్రం సహేతుకం కావు. ఇలాంటి  సంకుచిత పరిస్థితుల్లో గవర్నర్ల విధి…

జీవన గమనంలో సం‘క్రాంతి’

‘‘‌సంక్రాంతి అంటేనే పల్లెలకు ప్రత్యేక కళ వస్తుంది ఇంటికి చేరిన ధాన్యరాశులతో రైతుల లోగిళ్ళు కళకళలాడుతున్న తరుణాన… కుటుంబమంతా సంతోషం వెల్లివిరిసేలా సంక్రాంతి సాక్ష్యాత్కారిస్తుంది. ప్రత్యేక రుచులతో వంటకాలు, భోజనాలు ఏడాదంతా గుర్తుండేలా చేస్తాయి. భారతావని అంతటా ఆనందంగా జరుపుకునే పండుగగా సంక్రాంతి గణుతికెక్కింది. రైతన్నలు ఆనందంగా తమ ఊరిలోని కళాకారులకు తమ కష్టంలో పాలు…

అలిశెట్టి కవిత్వంలో ఎన్నికల ‘ఎండమావులు’

ఆధునిక తెలుగు సాహిత్యంలో వచన కవిత్వంతో యువతరం పాఠకుల్లో అగ్గిని రాజేసిన అక్షర యోధుడు అలిశెట్టి ప్రభాకర్‌.  12 ‌జనవరి 1954లో జన్మించి అనారోగ్య సమస్యలతో అనునిత్యం పోరాడిన కవి ముప్పైయి తొమ్మదేళ్లకే కన్నుమూశారు. అలిశెట్టి ప్రభాకర్‌ ‌కవిత్వంలో ఆయన నిబద్ధత, జీవితంలోని ఆత్మగౌరవం నేటి యువతరం కవులకు ఆదర్శనీయము, ఆచరణనీయమైన వ్యక్తిత్వమని  ఆయన సన్నిహిత…

వెంటాడే హృదయపు వాక్యం…

తెలియక మనమంటాం పిల్లలని/ వయసు బరువు పడ్డాక రెక్కలు తెగిపోతాయి/  కాయలు పండిపోయాక పూలు కేవలం ఓ స్మృతి అని జీవన తాత్త్విక  కోణాలను స్పృశించారు ప్రఖ్యాత కవి డాక్టర్‌ ఏనుగు నరసింహారెడ్డి. అనుభూతికి అక్షర సాక్ష్యంగా నేనే కవితా సంకలనాన్ని ఆయన ఆవిష్కరించారు. జీవన గాఢతను పొదువుకున్న అంతరాంతర సీమల్లోని అభివ్యక్తులుగా ఇందులోని 49…

రాజకీయ దురంధరుడు మర్రి చెన్నారెడ్డి

నేడు మర్రి చెన్నారెడ్డి జయంతి ‘‘ఆంధ్రప్రదేశ్‌ ‌లోని తెలంగాణ ప్రజలు సాంఘిక ఆర్ధిక విద్యా రంగాలలో వెనుకబడి యుండడాన్ని డాక్టరు చెన్నారెడ్డి సహించలేక పోయారు. ఏప్రిల్‌ 1968 ‌లో కేంద్ర మంత్రివర్గం నుండి రాజీనామా చేసారు. 1968లో ఢిల్లీ నుండి హైదరా బాదుకు తిరిగి రాగానే ‘‘తెలంగాణ ప్రజా సమితి’’ అనే పార్టీని నెలకొల్పి, ప్రత్యేక…

‘‘‌భరత జాతి ఔన్నత్యాన్ని చాటిన లబ్దప్రతిష్టుడు’’

నేడు వివేకానందుని జయంతి భారతదేశం ఔన్నత్యాన్ని విదేశాలకు చాటిచెప్పిన హిందూ సన్యాసి స్వామి వివేకానంద. తన భావాలను సమాజానికి పంచి, మేల్కొలిపిన మహామనిషి ఆయన. స్వదేశంలోనే కాక విదేశాలలోనూ తమ ఉపన్యాసాలతో జీవిత పరమార్థాన్ని బోధించి, ప్రజలను జాగృతం చేసిన ప్రాసం గి కుడు. వివేకానందుడు. పాశ్చాత్య దేశాలలో అడుగిడి, హిందూమత ప్రాశస్థ్యాన్ని చాటి చెప్పిన…