Category ఎడిటోరియల్

ఇడి సమన్లు కాంగ్రెస్‌కు ప్లస్సా, మైనస్సా

నేషనల్‌ ‌హెరాల్డ్ ‌కేసులో కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీకి, ఆ పార్టీ అగ్రనేత రాహుల్‌గాంధీకి ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ‌డైరెక్టర్‌ ‌నోటీసులు జారీచేయడం, రాహుల్‌గాంధీ రెండు రోజులుగా ఇడి ఎదుట హాజరు కావడం, అందుకు దేశవ్యాప్తంగా కాంగ్రెస్‌ ‌శ్రేణులు నిరసన వ్యక్తంచేస్తున్నతీరు చూస్తుంటే కొంతకాలంగా స్థబ్దతగా ఉన్న కాంగ్రెస్‌ ‌పార్టీని కేంద్రంలోని భారతీయ జనతాపార్టీ ప్రభుత్వం కావాలని తట్టిలేపినట్లు అనిపిస్తోంది.…

జాతీయ రాజకీయాలపై ఉత్సుకత

జాతీయ రాజకీయాలిప్పుడు ఆసక్తిని కలిగించేవిగా ఉన్నాయి. ఇప్పటివరకు ఒక మూసలో పోసినట్లుగా కొనసాగుతున్న రాజకీయాల్లో కొత్త వరవడి రానున్నట్లు స్పష్టమవుతున్నది. నిన్నటి వరకైతే ఎన్డీయే లేదా యూపిఏ పార్టీల్లో ఏదో ఒక దానికి అధికారం దక్కుతుందన్నది అందరి జ్ఞానంలో ఉన్న విషయం. కాని, వొచ్చే సార్వత్రిక ఎన్నికల నాటికి ఆ ఆలోచనలో తప్పక మార్పు జరుగుతుందన్నే…

రాష్ట్రపతి ఎన్నికలో స్థానిక పార్టీల పాత్ర కీలకం

రాష్ట్రపతి ఎన్నికల నగారా మోగింది. ప్రస్తుత రాష్ట్రపతి రామ్‌నాథ్‌ ‌కోవింద్‌ ‌పదవీకాలం వొచ్చే నెల 24న ముగియనుండడంతో ఈ ఎన్నిక అనివార్య మయింది. వొచ్చే నెల 18న జరుగనున్న ఈ ఎన్నికలో అభ్యర్థులెవరన్నది ఇంకా తేలకపోయినా అధికార, విపక్షాలు మాత్రం తీవ్రంగా పోటీపడుతున్నాయి. కేంద్రంలో అధికారం చేపట్టిన ఈ ఎనిమిదేళ్ళలో ఎన్డీయేకు సారథ్యం వహిస్తున్న భారతీయ…

తెలంగాణపై పట్టుకోసం బిజెపి వ్యూహాత్మక అడుగులు

రానున్న శాసనసభ ఎన్నికల్లో తెలంగాణపైన కాషాయ జండాను ఎగురవేయాలన్న లక్ష్యంగా భారతీయ జనతాపార్టీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. ఇందుకు ఆపార్టీ జాతీయ స్థాయి నాయకత్వం డైరెక్షన్‌ ‌చేస్తుండగా, రాష్ట్ర నాయకత్వం యాక్షన్‌లోకి దిగుతున్నది. వొచ్చే నెల రెండు, మూడు తేదీల్లో రాష్ట్ర రాజధానిలో జాతీయ కార్యవర్గ సమావేశాలను నిర్వహించేందుకు బిజెపి నిర్ణయించింది. వాస్తవంగా ప్రధాని నరేంద్రమోదీ…

నుపూర్‌ ‌శర్మ అనుచిత వ్యాఖ్యలు

అధికారంలో ఉన్న వ్యక్తులు ఎవరైనా సరే అహంకారంగా మాట్లాడితే ఏమవుతుందనేదానికి నుపూర్‌ ‌శర్మ చేసిన వ్యాఖ్యలతో ఏర్పడిన గందరగోళం ఇప్పుడు పాఠాన్ని నేర్పుతున్నది.  కాన్పూర్‌లో ఒక టివి ఇంటర్వులో బిజెపి అధికార ప్రతినిధిగా ఆమె చేసిన వ్యాఖ్యలు గాలిదుమారంనుండి తుఫాన్‌గా మారి ప్రపంచ దేశాలన్నీ భారత్‌ను వేలెత్తి చూపే పరిస్థితి కారణమయింది.  ఇంతకాలంగా ప్రపంచ చిత్ర…

టిఆర్‌ఎస్‌ ‌కౌంటర్‌ ఎటాక్‌ ‌

‌రాష్ట్రప్రభుత్వంపైన వరుస విమర్శలు చేస్తున్న భారతీయ జనతాపార్టీపైన టిఆర్‌ఎస్‌ ‌కూడా కౌంటర్‌ ఎటాక్‌ ‌ప్రారంభించింది. ఒకరి తర్వాత ఒకరుగా దిల్లీ నుండి వొస్తున్న నాయకులు చేస్తున్న విమర్శలకు టిఆర్‌ఎస్‌ ఒక విధంగా డిఫెన్స్‌లో పడింది. బిజెపి నాయకులు చేస్తున్న సవాళ్ళు, ప్రసంగాలకు సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇలా ఇంకా ఎంతకాలం ఈ విమర్శలు సంధిస్తారంటూ…

రెడ్ల పాలనలోనే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందా?

రెడ్లు తప్ప మరే ఇతర కులాల వారికి పాలన చాతకాదా అంటే తెలంగాణ పిసిసి అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి మాటల్లో కాదనే సమాధానం వినిపిస్తున్నది. రెడ్ల నాయకత్వంలోనే ప్రభుత్వాలు సాఫీగా సాగుతాయన్న అభిప్రాయం ఆయన ప్రసంగంలో స్పష్టమవుతుంది.. అందుకే కేవలం కాంగ్రెస్‌లోనే కాకుండా ఇతర పార్టీల్లో కూడా రెడ్ల నాయకత్వమే ఉండాలన్న ఆయన అభిప్రాయం ఇప్పుడు రాష్ట్రంలోని…

కేంద్రంతో ముదురుతున్న విభేదాలు..

కేంద్రంతోరాష్ట్ర సర్కార్‌కు ఘర్షణ పెరుగుతున్నట్లు కనిపిస్తున్నది.  చాలాకాలంగా కేంద్ర, రాష్ట్ర సంబంధాల విషయంలో దూరం పెరుగుతున్న విషయం తెలిసిందే. అయితే కేంద్రంలోని బిజెపి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక ప్రత్యేక రాజకీయ కూటమి ఏర్పాటుపై రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్‌ ‌తీవ్రస్థాయిలో ప్రయత్నాలు ప్రారంభించినప్పటినుండి ఈ దూరం మరింత పెరగడానికి అస్కారమైంది. దీంతో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి రావాల్సిన…

పట్టు వీడని చంద్రశేఖరుడు ..

‘‘ఆరంభింపరు నీచమానవులు విఘ్నాయాస సంత్రస్తులై,  యారంభించి పరిత్యజించుదురు విఘ్నాయత్తులై మధ్యముల్‌,  ‌ధీరుల్‌ ‌విఘనిహన్య మానులగుచు ధ్రుత్యున్నతోత్సాహులై,  ప్రారబ్ధార్థము లుజ్జగింపరు సుమీ ప్రజ్ఞానిధలల్‌ ‌గావునన్‌’’  అని ఏనుగు లక్ష్మణ కవి  అన్నట్లు  ఏదైనా పనిని ప్రారంభించనే వద్దు  , ఒక సారి ప్రారంభించిన తర్వాత ఎన్ని అడ్డంకులు ఎదురైనా దాని అంతు తెలుసుకునేవరకు కార్యసాధకులు  వదిలిపెట్టరు. అలాంటివారు…