Category ముఖ్యాంశాలు

కొత్త ఇంజనీర్లకు కాళేశ్వరం ఓ ప్రయోగశాల

మ్యాన్ మేడ్ వండర్ ఎలా కూలింది..? అధికారులు క్షేత్ర స్థాయిలో పర్యటించాల్సిందే..     రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించండి.. అన్ని ప్రాజెక్టులను పూర్తి చేస్తే తెలంగాణ ఆదర్శంగా నిలుస్తుంది.. ఏఈఈలకు ఉద్యోగ నియామక పత్రాల ప్ర‌దానోత్స‌వంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, సెప్టెంబ‌ర్ 26 : నీళ్లు, నీళ్లు, నియామకాల ఆకాంక్షల కోసమే…

కులగణనపై ఎవరికీ అనుమానాలు వద్దు

Hyderabad Floods

కాంగ్రెస్‌ ఇచ్చిన హామీని నెర‌వేరుస్తుంది.. చాకలి ఐలమ్మ జయంతి సభలో మంత్రి పొన్నం హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర, సెప్టెంబర్ 26:‌ కులగణనపై ఎలాంటి అనుమానాలు వొద్దని, కాంగ్రెస్‌ ‌పార్టీ ఎవరికీ అన్యాయం చేయదని రవాణా శాఖ మంత్రి పొన్నం  ప్రభాకర్‌ అన్నారు.  రవీంద్రభారతిలో నిర్వహించిన చాకలి ఐలమ్మ జయంతి కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. భూమి కోసం, భుక్తి కోసం…

చాకలి ఐలమ్మకు సిఎం ఘన నివాళి

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌26: ‌తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధురాలు, వీరనారి చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా ఆమెకు రాష్ట్రం యావత్తూ ఘనంగా నివాళి అర్పించింది. పార్టీలకు అతీతంగా పలువురు ఆమెను స్మరించుకున్నారు. జూబ్లీహిల్స్ ‌నివాసంలో ఆమె చిత్రపటానికి ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆమె పోరాటాన్ని స్మరించుకున్నారు.

సిరిసిల్లలో కేటీఆర్‌ అవినీతిని బయటపెడతాం

Whip Adi Srinivas fire on KTR

బతుకమ్మ చీరలకు రూ.197 కోట్ల బకాయిలు కెటిఆర్‌పై విప్‌ ఆది శ్రీనివాస్ ఫైర్‌ ‌సిరిసిల్ల, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 26:  ‌తన మీద కోపంతో సిరిసిల్ల నేతన్నలకు తెలంగాణ ప్రభుత్వం అన్యాయం చేస్తోందని బీఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌కేటీఆర్‌ ‌చేసిన వ్యాఖ్యలపై ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ ‌ఫైర్‌ అయ్యారు. సిరిసిల్ల కాంగ్రెస్‌ ‌పార్టీ కార్యాలయంలో గురువారం…

తెలంగాణా కోసం అలుపెరుగని పోరాటం

Whip Adi Srinivas fire on KTR

మహనీయుడు బాపూజీ ..కొనియాడిన సీ ఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్,ప్రజాతంత్ర,సెప్టెంబర్26: మ‌లి ద‌శ తెలంగాణ ఉద్య‌మానికి త‌న ఇంటిని, త‌న ఆస్తుల‌ను దానం చేసిన మ‌హ‌నీయుడు కొండా ల‌క్ష్మ‌ణ్ బాపూజీ అని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి కొనియాడారు. ప్ర‌త్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం అయిదు ద‌శాబ్దాలుగా అలుపెరుగ‌ని కృషి చేసిన మ‌హ‌నీయుడు బాపూజీ అని…

ద‌స‌రాకు ఇందిర‌మ్మ క‌మిటీలు…

రాజా హరిసింగ్‌ను అవ‌మానించేలా రాహుల్ వ్యాఖ్య‌లు ప‌దేళ్ల‌లో క‌శ్మీర్ అభివృద్ధిపై చ‌ర్చ‌కు సిద్ధ‌మా..? దేశమంతా పాదయాత్ర చేసినా రాహుల్ కు తెలుసుకున్న‌ది శూన్యం మూడుసార్లు ఓడినా కాంగ్రెస్ లో మార్పు రాలేదు.. మండిపడ్డ కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. దేశమంతా రాహుల్ గాంధీ పాద‌యాత్ర చేసినా ఆయ‌న తెలుకుసున్న‌ది ఏమీలేద‌ని, ఇప్ప‌టికైనా రాహుల్.. చరిత్ర తెలుసుకోవాల‌ని కేంద్ర‌మంత్రి కిష‌న్ రెడ్డి అన్నారు. జమ్మూకశ్మీర్ అభివృద్ధిపై రాజా హరిసింగ్ విగ్రహం వద్ద రాహుల్ గాంధీ బహిరంగ చర్చకు రావాలని స‌వాల్ విసిరారు. జమ్మూ జమ్మూకశ్మీర్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ చేస్తున్న వ్యాఖ్యలు వివాదాస్పదంగా ఉంటున్నాయని, మహారాజా హరిసింగ్ విషయంలో రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యల్ని పూర్తిగా ఖండిస్తున్న‌ట్లు పేర్కొన్నాను. గత మూడు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని దేశ ప్రజలు ఓడించినా.. మీలో మార్పురాలేదు. దేశవ్యాప్తంగా పాదయాత్ర చేసినా.. దేశ చరిత్ర మీద, వాస్తవ పరిస్థితులపై కనీస అవగాహన కూడా రాలేదని అన్నారు. జమ్మూ కాశ్మీర్ లో బీజేపీలో డోగ్రా స్వాభిమాన్ సంఘటన్ పార్టీ విలీనం సందర్భంగా విలేకరుల సమావేశంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మాట్లాడారు. జమ్ము కాశ్మీర్ ప్రజల మనసు గెలిచి మహరాజా హరి సింగ్ ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చారు. అలాంటి వ్యక్తి విషయంలో రాహుల్ మాటలు తీవ్ర అభ్యంతరకరంగా ఉన్నాయన్నారు. మహారాజా హరి సింగ్ పారిపోయాడని మాట్లాడటం హాస్యాస్పదమ‌ని, జమ్మూ కాశ్మీర్లో దాదాపుగా ప్రతి ఇంట్లో మహారాజా హరిసింగ్ ఫోటో ఉంటుంద‌ని, అలాంటి మహనీయుడిని అవమానించడమంటే.. యావత్ డోగ్రా సమాజాన్ని జమ్మూకాశ్మీర్ ప్రజలను అవమానించడమే. లెఫ్టినెంట్ గవర్నర్ గురించి కూడా చాలా చులకనగా మాట్లాడారు. బయటినుంచి వచ్చిన వ్యక్తికి ఇక్కడ పెత్తనమేంటని అన్నారు. జమ్మూకశ్మీర్లో.. 1965లో గవర్నర్ వ్యవస్థ ప్రారంభమైన తర్వాత.. కరణ్ సింగ్ ను మినహాయిస్తే .. మిగిలిన వారందరూ వేరే ప్రాంతాల నుంచి వచ్చిన వారే. దేశవ్యాప్తంగా కూడా ఇలాగే స్థానికేతరులే గవర్నర్లుగా ఉన్నారు. ఉంటారు కూడా.. గవర్నర్ వ్యవస్థను, లెఫ్టినెంట్ గవర్నర్ వ్యవస్థను మోదీనో , బీజేపీనో తీసుకురాలేదు. దేశవ్యాప్తంగా గవర్నర్ వ్యవస్థ ఇలాగే కొనసాగుతోంది. దేశ చరిత్ర రాజకీయ పరిజ్ఞానం పెంచుకున్న తర్వాతే రాహుల్‌ బహిరంగ వేదికలమీద మాట్లాడాల‌ని కిష‌న్ రెడ్డి సూచించారు. పార్లమెంట్లో వివిధ చట్టాలపై చర్చ సందర్భంగా.. దేశ సైనికుల గురించి మిడిమిడి జ్ఞానంతో మాట్లాడార‌ని మండిప‌డ్డారు. ఇతర దేశాల్లో మన దేశ వ్యవస్థలను అగౌరవపరుస్తూ మాట్లాడార‌ని, ఎన్నికల వ్యవస్థను, పార్లమెంటును, ప్రజాస్వామ్య వ్యవస్థను కించపరిచార‌ని, కులాలు,మతాలు, భాషల పేరుతో సమాజాన్ని విడదీసేలా మాట్లాడార‌ని అన్నారు. జమ్మూ కాశ్మీర్లో 60 ఏళ్లలో మీరేం చేశారో.. గత 10 ఏళ్లలో బీజేపీ ప్రభుత్వం ఏం చేసిందో చెప్పేందుకు బహిరంగ చర్చకు రావాలని రాహుల్ గాంధీకి కిషన్ రెడ్డి సవాల్ విసిరారు. ఎన్నికల ప్రచారంలో ఏది పడితే అది మాట్లాడకుండా.. చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉండాలన్నారు. సంక్షేమం, అభివృద్ధి, మౌలిక వసతుల కల్పన విషయంలో.. జమ్ము కాశ్మీర్లో శాంతి నెలకొల్పడంలో, ప్రతి పేదవాడికి ఇండ్ల నిర్మాణంతో పాటు ఇంటికి టాయిలెట్లు, గ్యాస్ సిలిండర్ ఇవ్వడంలో.. ఐదులక్షల ఆరోగ్య బీమా, యువతకు, మహిళలకు చేయుత నందించడం.. వంటి ఎన్నో పనులు.. జమ్మూకశ్మీర్లో మోదీ ప్రభుత్వం చేసింద‌ని తెలిపారు. 2004-2014 మధ్యలో.. మీ పరిపాలనలో జమ్మూకశ్మీర్లో అశాంతి, అలజడి తప్ప మీరు సాధించిందేమీ లేదన్నారు. గతంలో ప్రతిపక్ష నేతలుగా పని చేసిన అటల్ బిహారి వాజ్‌పేయి, ఎల్‌కే అద్వానీ, సుష్మా స్వరాజ్, గులాంనబీ ఆజాద్ లాంటి వాళ్లు.. ప్రతిపక్ష నేతలుగా తమదైన ముద్రవేశారు. దేశ హితం లక్ష్యంగా పనిచేశారు. కానీ రాహుల్ గాంధీ ఇతర దేశాల్లో భారతదేశాన్ని అవమానించే రీతిలో మాట్లాడితే చరిత్ర క్షమించదని కిష‌న్ రెడ్డిఅన్నారు. డోగ్రా స్వాభిమాన్ సంఘటన్ పార్టీ నేత‌లు ప్రపంచంలోనే అత్యంత పెద్ద పార్టీలో బీజేపీలో సభ్యులయ్యారని, ఇది ఏ ఒక్క కుటుంబానికి సంబంధించింది కాదని, 140 కోట్ల దేశ ప్రజలందరికీ చెందిన‌ పార్టీలో చేరడంతో దేశం గర్వపడుతుంద‌ని కిష‌న్ రెడ్డి తెలిపారు.

విధివిధానాలు రూపొందించ‌డి… పీఎంఏవై నుంచి గ‌రిష్టంగా ఇళ్లు సాధించాలి… రాజీవ్ స్వ‌గృహ ఇళ్ల‌కు వేలం… ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి ద‌స‌రా పండుగ నాటికి ఇందిర‌మ్మ క‌మిటీలు ఏర్పాటు చేయాల‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. గ్రామ‌/ వార్డు, మండ‌ల/ ప‌ట్ట‌ణ‌, నియోజ‌క‌వ‌ర్గ‌, జిల్లా స్థాయి క‌మిటీల ఏర్పాటుకు విధివిధినాలు ఒక‌ట్రెండు రోజుల్లో రూపొందించాల‌ని ముఖ్య‌మంత్రి సూచించారు.…

ఇరాక్ లో చిక్కుకున్న తెలంగాణ వాసులు

TPCC NRI Cell Convenor Manda Bhim Reddy, Indian Overseas Congress UK Vice President Varava Sudhakar Goud

నాలుగు నెలలుగా జీతాలు లేవు స్పందించిన ప్రజావాణి అధికారి దివ్యా దేవరాజన్ ఇరాక్ దేశంలోని బస్రా లో గత నాలుగు నెలలుగా జీతాలు ఇవ్వకుండా కంపెనీ యాజమాన్యం ఇబ్బంది పెడుతున్నదని ముగ్గురు బాధితుల పక్షాన వారి కుటుంబ సభ్యులు బుధవారం హైదరాబాద్ లోని ప్రజాభవన్ లో ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. బాధితుల వెంట టీపీసీసీ ఎన్నారై…

పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేస్తాం..

Palamuru Ranga Reddy lift scheme

12 లక్షల ఎకరాలకు సాగునీటి అందిస్తాం నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి గ‌త బీఆర్ఎస్ ప్ర‌భుత్వం రూ.27,500 కోట్లు ఖర్చుపెట్టి ఒక్క ఎకరాకు సాగునీరు ఇవ్వలేద‌ని, తాము మాత్రం ఈ శాసన సభ కాలంలోనే ఉమ్మడి పాలమూరు జిల్లాలోని ప్రాజెక్టులన్నింటిని పూర్తి చేసి 12 లక్షల ఎకరాలకు సాగునీరు అందించి ఉమ్మడి పాలమూరు సస్యశ్యామలం…

ప్రపంచంతో నే పోటీ ..

ఆ శక్తి తెలంగాణా యువతకు ఉంది.  ద‌స‌రాకు ఇందిర‌మ్మ క‌మిటీలు… విధివిధానాలు రూపొందించ‌డి… పీఎంఏవై నుంచి గ‌రిష్టంగా ఇళ్లు సాధించాలి… రాజీవ్ స్వ‌గృహ ఇళ్ల‌కు వేలం… ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి ద‌స‌రా పండుగ నాటికి ఇందిర‌మ్మ క‌మిటీలు ఏర్పాటు చేయాల‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. గ్రామ‌/ వార్డు, మండ‌ల/ ప‌ట్ట‌ణ‌, నియోజ‌క‌వ‌ర్గ‌, జిల్లా స్థాయి…