Category ముఖ్యాంశాలు

జమ్మూకాశ్మీర్‌లో మేఘాల విస్ఫోట‌నం

– కొండచరియలు విరిగిపడి 11మంది మృతి న్యూదిల్లీ, ప్రజాతంత్ర, ఆగస్టు 30: జమ్మూ కాశ్మీర్‌లో శనివారం ఉదయం రాంబన్‌లో మేఘాల విస్ఫోటనం సంభవించగా రియాసిలో ఒక ఇంటిపై కొండచరియలు విరిగిపడటంతో ఐదుగురు పిల్లలు సహా 11మంది మరణించారు. రాంబన్‌లోని రాజ్‌గఢ్‌ తహసీల్‌లో మేఘాల విస్ఫోటనం కారణంగా ఆకస్మిక వరదలు సంభవించిన తరువాత నలుగురు గ్రామస్తులు మరణించగా…

నాల్గవ ఆర్థిక శక్తిగా భారత్‌

– ఓర్వలేని వారి కుట్రలను తిప్పికొట్టాలి – కేంద్ర మంత్రి ప్రహ్లాద్‌ జోషి హైదరాబాద్‌,ప్రజాతంత్ర,ఆగస్ట్‌30:భారత దేశం గత దశాబ్ద కాలంగా అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతూ ఉందని ప్రపంచంలోనే నాల్గవ ఆర్థిక శక్తిగా ఎదిగిందని కేంద్ర మంత్రి ప్రహ్లాద్‌ జోషి అన్నారు. దీన్ని చూసి ఓర్వలేనివారి కుట్రలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. శనివారం హైదరాబాద్‌ కాచిగూడ లోని…

తెలంగాణ కేబినెట్‌ ‌సంచలన నిర్ణయం

– రిజర్వేషన్ల పరిమితిని ఎత్తివేయాలని తీర్మానం – సెప్టెంబర్‌లోగా స్థానిక ఎన్నికల నిర్వహణకు అంగీకారం – ఎమ్మెల్సీలుగా కోదండరామ్‌, అజారుద్దీన్‌ల పేర్లు సిఫార్సు హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,ఆగస్ట్30: ‌తెలంగాణ కేబినెట్‌ ‌సంచలన నిర్ణయం తీసుకుంది.రిజర్వేషన్ల పరిమితిని ఎత్తివేయాలని నిర్ణయించింది. పంచాయతీ రాజ్‌  ‌చట్టం2018 సవరణకు ఆమోదం తెలిపిన కేబినెట్‌..  ‌రిజర్వేషన్ల పరిమితిపై గత ప్రభుత్వం తెచ్చిన ఆర్డినెన్స్ ‌స్థానంలో…

పేదల కోసం తపించిన సురవరం

– ఆయన ఆశయాల సాధ‌న‌కు కృషి – సురవరం సంస్మరణ సభలో సిఎం రేవంత్‌రెడ్డి  హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,ఆగస్ట్30: ‌పేదల జీవితాలలో మార్పు రావాలని.. వారి కోసం నిరంతరం శ్రమించిన గొప్ప నాయకుడు సురవరం సుధాకర్‌రెడ్డి అని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. తను నమ్మిన సిద్ధాంతాలను చివరి వరకు ఆచరించిన అవిశ్రాంత యోధుడని కొనియాడారు. సమాజంలో అనాగరికాలు రూపుమాపేలా…

కాళేశ్వరంపై హరీష్‌ మరోమారు పిటిషన్‌

– పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌కు భయమెందుకని ప్రశ్న హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఆగస్ట్‌ 30 : కాళేశ్వరం కమిషన్‌ నివేదికను సస్పెండ్‌ చేయాలని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీష్‌రావు మరోసారి హైకోర్టును ఆశ్రయించారు. ఈమేరకు మధ్యంతర పిటిషన్‌ దాఖలు చేశారు. అసెంబ్లీలో కాళేశ్వరం కమిషన్‌ నివేదికను ప్రవేశపెట్టకుండా చూడాలన్నారు. ఈ పిటిషన్‌ ప్రస్తుతం హైకోర్టు రిజిస్ట్రీ…

యూరియా కోసం రైతుల పాట్లు

– తెల్ల‌వారుజాము నుంచే క్యూలు – ప్ర‌భుత్వంపై ఆగ్ర‌హం సిద్దిపేట, ప్రజాతంత్ర, ఆగస్ట్  30: యూరియా బస్తాల కోసం రైతులకు తిప్పలు తప్పడం లేదు. సిద్ధిపేట జిల్లా నంగునూరు మండల కేంద్రంలోని పీఏసీఎస్ వద్ద  శనివారం యూరియా టోకెన్లు జారీ చేయగా, టోకెన్ల వారీగా రైతు వేదిక వద్ద బస్తాలను పంపిణీ చేశారు. యూరియా బస్తాల…

ప్రభుత్వ వైఫల్యం వల్లే యూరియా కొరత

– వ్యవసాయ శాఖ కమిషనర్‌కు వినతిపత్రం సమర్పణ – సచివాలయం ముందు ఆకస్మిక ధర్నా – కేటీఆర్‌, హరీష్‌ తదితరులను అదుపులోకి తీసుకున్న పోలీసులు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఆగస్ట్‌ 30: రైతు సమస్యలు, పంట నష్టం, యూరియా కొరతపై బీఆర్ఎస్‌ నేతలు వ్యవసాయ శాఖ కమిషనర్‌ కార్యాలయం వద్ద శనివారం నిరసన చేపట్టారు. అన్నదాతల సమస్యలను…

ట్రంప్‌ సుంకాలు చట్ట విరుద్దం

Trump’s Tariffs Set to Backfire: Economic Risks Loom Large

– అమెరికా ఫెడరల్‌ కోర్టు తీర్పు వాషింగ్టన్‌, ఆగస్ట్‌ 30: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ విధించిన సుంకాలు చట్టవిరుద్ధమని అమెరికా ఫెడరల్‌ కోర్టు తీర్పునిచింది. టారిఫ్‌లను విధించేందుకు అధ్యక్షుడికి విసÊఋత అధికారాలు లేవని స్పష్టం చేస్తూ ఫెడరల్‌ అప్పీల్స్‌ కోర్టు సంచలన వాఖ్యలు చేసింది. అయితే దీనిపై సుప్రీం కోర్టుకు అప్పీల్‌ చేసుకునేందుకు వీలుగా…

పీపీటీ ఇచ్చే అవకాశం ప్రతిపక్షానికి లేదు

– వడ్డీలపై బీఆర్ఎస్ అసత్య ప్రచారం – మీడియాతో భట్టి విక్రమార్క చిట్‌ చాట్‌ హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, ఆగ‌స్టు 30: ప్రతిపక్షాలకు అసెంబ్లీలో ప‌వ‌ర్ పాయింట్‌ ప్రజంటేషనన (పిపిటి) ఇచ్చే సంప్రదాయం లేదని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన సంద‌ర్భంగా మీడియాతో ఆయన చిట్‌చాట్‌ మాట్లాడుతూ బీఆర్ఎస్ అధికారంలో…