Category ముఖ్యాంశాలు

బీసీ బిల్లుకు అడుగడుగునా బీజేపీ అడ్డంకులు

– రాహుల్‌ ప్రధాని కావాలన్నది వైఎస్‌ కోరిక – వైఎస్‌ వర్ధంతి సందర్భంగా పిసిపి నివాళి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 2: బీసీ రిజర్వేషన్లపై సోమవారం గవర్నర్‌ వద్దకు అఖిలపక్షం వెళ్లిందని, బీఆర్‌ఎస్‌ నేతలు వచ్చారు కానీ బీజేపీ ముఖం చాటేసిందని టీపీసీసీి చీఫ్‌ మహేష్‌ కుమార్‌ గౌడ్‌ అన్నారు. గాంధీ భవన్‌లో ఆయన విూడియాతో…

ఘోష్‌ నివేదిక ఆధారంగా సిబిఐకి నో

– తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం – కేసీఆర్‌, హరీష్‌ల పిటిషన్లపై విచారణ అక్టోబరు 7కు వాయిదా హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 2: కాళేశ్వరం ప్రాజెక్టు వ్యవహారంలో కేసీఆర్‌, హరీష్‌రావులకు హైకోర్టులో భారీ ఊరట కలిగింది. జస్టిస్‌ పీసీ ఘోష్‌ నివేదిక ఆధారంగా సీబీఐ విచారణ చేపట్టవద్దని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. కాళేశ్వరం కమిషన్‌ నివేదికను సవాల్‌…

పార్టీ నుంచి ఎమ్మెల్సీ కవిత సస్పెన్షన్‌

– బీఆర్‌ఎస్‌ పార్టీ సంచలన నిర్ణయం – హరీష్‌, సంతోష్‌లపై విమర్శలతో పార్టీ సీరియస్‌ – అధ్యక్షుడి ఆదేశాలతో సస్పెండ్‌ చేస్తున్నట్లు ప్రకటన హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 2: బీఆర్‌ఎస్‌ పార్టీ సంచలన నిర్ణయం తీసుకుంది. పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ కుమార్తె, ఎమ్మెల్సీ కవితను పార్టీ నుంచి సస్పెండ్‌ చేస్తున్నట్లు ప్రకటించింది. పార్టీ…

4న నూతన వీఆర్వోలకు నియామక పత్రాలు

– సీఎస్‌ రామకృష్ణారావు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 2: నూతనంగా నియమితులైన ఐదు వేలమంది విలేజ్‌ రెవెన్యూ ఆఫీసర్లకు ఈనెల 5న ముఖ్యమంత్రి చేతుల మీదుగా నియామక పత్రాలను అందజేస్తున్నట్టు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు ఒక ప్రకటనలో తెలిపారు. మాదాపూర్‌లోని హైటెక్స్‌లో ఆరోజు సాయంత్రం 4 గంటలకు జ‌రిగే ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్‌…

నాటి గుండ్రాంపల్లి ఘటన మరువలేం

– ఆ అమరుల కుటుంబాలకు పాదాభివందనం – నివాళులర్పించిన బీజేపీ చీఫ్‌ రామచందర్‌రావు నల్గొండ, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 2: నిజాం నిరంకుశత్వ పాలనలో గుండ్రాంపల్లిలో 26మందిని రజాకార్లు దారుణంగా చంపి బావిలో పడేసిన ఘటన మరిచిపోలేనేది.. ఆ అమరవీరుల, త్యాగధనుల కుటుంబాలకు పాదాభివందనం చేస్తున్నానని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌.రామచందర్‌రావు అన్నారు. ఈ గ్రామం సాహస…

మహోన్నత ఆశయంతో ఇళ్ల నిర్మాణం

– మానవీయ కోణంతో చేపట్టిన భారీ సంక్షేమ పథకం – సిమెంటు, స్టీలు పరిశ్రమలు భాగస్వాములు కావాలి – డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 2: ప్రజా ప్రభుత్వం మహోన్నత ఆశయంతో మానవీయ కోణంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల భారీ సంక్షేమ పథకాన్ని విజయవంతం చేసేందుకు రాష్ట్రంలోని సిమెంటు,…

జాగృతి కవిత పై బి ఆర్ ఎస్ పార్టీ వేటు 

  జాగృతి కవిత పై బి ఆర్ ఎస్ పార్టీ వేటు Please subscribe our channel youtube.com/@prajatantra-news తెలంగాణా జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ను పార్టీ నుంచి బహిష్కరిస్తూ భారత రాష్ట్ర సమితి నిర్ణయం తీసుకుంది. కవితను పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్లు పార్టీ లేఖ విడుదల చేసింది. క్రమశిక్షణ చర్యలంటూ…

కమిషన్ నివేదిక ఆధారంగా ఎలాంటి చర్యలు తీసుకోవొద్దు : హై కోర్టు

కాళేశ్వరం పై  జస్టిస్ పి సీ ఘోష్  కమిషన్ నివేదిక ఆధారంగా ఎలాంటి చర్యలు తీసుకోవొద్దని హై కోర్టు  ఆదేశించింది. అక్టోబర్ ఏడో తేదీన తదుపరి విచారణ చేపడతామని తెలిపింది. దీంతో కేసీఆర్, హరీశ్ రావుకు భారీ ఊరట లభించినట్లయింది.కాళేశ్వరం కమిషన్ నివేదికపై సీబీఐ విచారణ జరిపించాలన్న తెలంగాణ ప్రభుత్వ నిర్ణయానికి బ్రేక్ పడినట్లయింది .…

అఫ్గానిస్థాన్‌లో భారీ భూకంపం

–  622 మంది మృత్యువాత – 1500 మంది  క్షతగాత్రులు కాబూల్‌,  సెప్టెంబర్ 01: అఫ్గానిస్థాన్‌లో భారీ భూకంపం సంభవించింది. పాకిస్థాన్‌ ‌సరిహద్దులోని కునార్‌ ‌ప్రావిన్స్‌లో రిక్టర్‌ ‌స్కేల్‌పై 6.0 తీవ్రత నమోదైంది. ఈ ఘోర విపత్తు కారణంగా 622 మంది మరణించినట్లు ఆ దేశ అధికారిక మీడియా సంస్థ రేడియో టెలివిజన్‌ అఫ్గానిస్థాన్‌ ‌వెల్లడించింది.…