Category ముఖ్యాంశాలు

కేటీఆర్‌కు ‘గ్రీన్ లీడర్‌షిప్’ అవార్డు

– ఈ నెలాఖ‌రులో న్యూయార్క్ లో ప్ర‌దానం హైదరాబాద్, ప్ర‌జాతంత్ర‌, సెప్టెంబ‌ర్ 11: మాజీ మంత్రి, భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) వర్కింగ్ ప్రెసిడెంట్ కె. తారక రామారావు (కేటీఆర్)కు అరుదైన అంతర్జాతీయ గౌరవం లభించింది. సుస్థిర పాలన, పర్యావరణ పరిరక్షణలో ఆయన చేసిన కృషికి గాను ప్రతిష్టాత్మకమైన ‘గ్రీన్ లీడర్‌షిప్ అవార్డు 2025’కు ఆయన…

ఇండి కూటమిలో ఐక్యత లోపించింది

– కాంగ్రెస్‌ హయాంలోనే రాజ్యాంగానికి ముప్పు – స్పీకర్‌ దగ్గర ఉన్న యాంటీ డిఫెక్షన్‌ బిల్లుల సంగతేమిటో? – రాష్ట్రంలో అన్ని వ్యవహారాల్లో విఫలమైన కాంగ్రెస్‌ – ‘మీట్‌ ది ప్రెస్‌’లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 11: ఉపరాష్ట్రపతి ఎన్నికలో ఇండీ కూటమి నుంచి క్రాస్‌ ఓటింగ్‌ జరిగిందని, ఆ…

పంచాయతీరాజ్‌ సవరణ చట్టం-2025కు గవర్నర్‌ ఆమోదం

State Governor Jishnudev Verma

~ ఇంకా ఆమోదం పొంద‌ని (మూడో సవరణ) చట్టం హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 11: తెలంగాణ పంచాయతీరాజ్‌ (రెండో సవరణ) చట్టం 2025 బిల్లుపై గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ సంతకం చేశారు. ఈమేరకు గెజిట్‌ విడుదలయింది. తెలంగాణ పంచాయతీరాజ్‌ (రెండో సవరణ) చట్టం-2025లో సంగారెడ్డి జిల్లాలో ఇంద్రేశం, జిన్నారం మున్సిపాలిటీల ఏర్పాటు, ఇస్నాపూర్‌ మున్సిపాలిటీ విస్తరణ,…

భారతదేశపు సీడ్‌ హబ్‌గా తెలంగాణ

– సీడ్‌ డిప్లొమసీతో రెండు దేశాల‌ మధ్య పెరగనున్న విశ్వాసం – ఇండో-ఆఫ్రికా సీడ్‌ సమ్మిట్‌లో మంత్రి తుమ్మల హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 11: ఇండో-ఆఫ్రికా సీడ్‌ సమ్మిట్‌-2025 భారత్‌-ఆఫ్రికా దేశాల మధ్య వ్యవసాయ రంగంలో సంబంధాలను బలోపేతం చేసే వేదికగా నిలుస్తుందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. హైదరాబాద్‌లో గురువారం నిర్వహించిన…

నిరుద్యోగుల ఆశలపై నీళ్లు

` గ్రూప్‌-1 పోస్టుల భర్తీలో డబ్బులు చేతులు మారాయి – హైకోర్టు ఆదేశాల ప్రకారం పరీక్ష మళ్లీ నిర్వహించాలి – అవకతవకలపై జ్యుడీషియల్‌ విచారణ చేపట్టాలి. – బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 11: గ్రూప్‌-1 పరీక్షల్లో అక్రమాలపైన, ఎన్నికల సమయంలో ఏడాది లోపే రెండు లక్షల ఉద్యోగాలిస్తామని కాంగ్రెస్‌ చేసిన…

రిజర్వేషన్ల అమలుకు కేంద్రం ఆటంకాలు

– బీసీల కుల గణనలో రోల్‌ మోడల్‌గా తెలంగాణ – ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్నప్రభుత్వం – మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి – 15న కామారెడ్డి సభ ఏర్పాట్లపై మంత్రులతో సమావేశం హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 11: స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల కల్పనలో తెలంగాణ రాష్ట్రం దేశానికి ఆదర్శంగా నిలబడుతుందని…

ట్రాఫిక్‌ ‌నియంత్ర‌ణ‌కు ప‌టిష్ట ప్ర‌ణాళిక‌లు

– అత్యవసరంగా స్కైవేలు, ఎలివేటెడ్‌ ‌కారిడార్ల నిర్మాణం – మెహిదీపట్నం వద్ద స్కై వాక్‌ ‌ప్రాజెక్ట్ ‌- రాజీవ్‌ ‌రహదారిలో ఔటర్‌ ‌వరకు ఆరు లైన్ల విస్తరణ – లంగర్‌హౌజ్‌లో గాంధీ సర్కిల్‌ ఆఫ్‌ ‌యూనిటీ నిర్మాణం – రాజ్‌నాథ్‌ ‌సింగ్‌తో కీలక భేటీలో పలు ప్రాజెక్టులపై చర్చ – రక్షణ శాఖ భూములు బదిలీ…

12న ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్‌ ‌పదవీ ప్రమాణం

– రాష్ట్రపతి భవన్‌లో ప్రమాణం చేయించనున్న రాష్ట్రపతి ముర్ము న్యూదిల్లీ,సెప్టెంబర్‌ 10: ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఘన విజయం సాధించిన సీపీ రాధాకృష్ణన్‌ ‌బాధ్యతలు చేపట్టేందుకు ముహూర్తం ఖరారు అయిందని తెలుస్తోంది. ఈనెల 12వ తేదీన సీపీ రాధాకృష్ణన్‌ 15‌వ భారత ఉపరాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టనున్నారు. ఉపరాష్ట్రపతి చేత భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రమాణ…

నేపాల్‌లో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు కసరత్తు

– మాజీ చీఫ్‌ ‌జస్టిస్ట్ ‌సుశీలా కర్కీకి బాధ్యతలు – జెన్‌ ‌జెడ్‌ ఉద్యమకారులు మొగ్గు ఖాట్మండ్‌,‌సెప్టెంబర్‌ 10:  ‌కల్లోల నేపాల్‌లో  ఉద్రిక్త పరిస్థితులు కొనసాగున్న నేపథ్యంలో తాత్కాలిక సారథిని ఎన్నుకునేందుకు అక్కడి యువత ముమ్మర చర్చలు జరుపుతోంది. ఈ క్రమంలో మాజీ చీఫ్‌ ‌జస్టిస్‌ ‌సుశీలా కర్కీ వైపు జెన్‌-‌జెడ్‌ ఉద్యమకారులు మొగ్గుచూపినట్లు- తెలుస్తోంది.…