Category శీర్షికలు

అరకొర ఆంగ్ల మీడియం

సర్కారు బడిలల్లో ఆంగ్లమీడియాలంట ఆరంభశూరత్వంకూడా లేని ప్రారంభమంట దొర మాటిస్తే ఉత్తదేనంట బడిబాటలో ప్రగల్భాలు బీదోళ్ళ పిల్లల బతుకుబాటది దారిపడాలంటే కాస్త కష్టమేనట ఆంగ్లక్షరాలను తిలకిద్దామంటే పుస్తకాలసలే ఉండవంట వసతుల కల్పన కలనేనంట బ్రష్టుపట్టించుటే ద్యేయమంట పుస్తకాలు లేని బడిబాటలో బ్రిడ్జి కోర్సుతో కాలయాపన దీనుల దీనావస్థ శిథిలావస్థలో కొట్టుమిట్టాడుతున్న బడిగోడలను తలపిస్తున్నది నిర్భాగ్యులకిక్కడ పొందాల్సిందేదైనా…

ఊట

ఆమో అతనో ఎవరో ఎనలేని మార్పు కోరుతున్నారు అది ఇక ముందులా ఉండొద్దు కొన్ని టైప్స్ ‌లోనో పోలికల్లోనో పొసగొద్దు ఒక నయా అనుభూతినివ్వాలె చూడంగానో వినంగానో అరె ఇది మాకు తట్టలేదే అన్న ప్రశ్న లోలోపలికెళ్ళాలె నేరుగా ఇదో ఆర్కిటైప్‌ అసలే అవ్వొద్దు దీనిలా కొన్ని కాపీలూ మోడల్స్ ‌రానూవొద్దు ఎన్నాళ్ళుండాలో అలా అవన్నీ…

‌ప్రమాదం ఇంకా పొంచి ఉంది ..!

కొరోనా  థర్డ్‌వేవ్‌ ‌భయాలు ఇంకా తొలగకముందే ఫోర్త్‌వేవ్‌ ‌భయాలు మరింతగా భయాందోళనలను కలిగించేవిగా ఉన్నాయి. గత వారం పదిరోజుల్లో కేసులు పెరుగుతున్న తీరు మరోమారు ఆందోళనకరంగా ఉంది. ముందు జాగ్రత్తలే మందు అని నిఫులు, వైద్యారోగ్య శాఖ హెచ్చరికలు చేస్తున్నా..ప్రజల నిర్లక్ష్యం తోడు కావడంతో క్రమంగా కేసుల సంఖ్య పెరుగుతోంది. తాజాగా కొరోనా  కేసుల సంఖ్య…

‌ద్రౌపది ఎంపికలోనూ బిజెపి రాజకీయం !

రాష్ట్రపతిని ఏకగ్రీవం చేసే అవకాశాలు ఉన్నప్పటికీ అధికార బిజెపి కావాలనే తాత్సారం చేసి..విపక్ష పార్టీలు అభ్యర్థిని ప్రకటించిన తరవాతనే తమ అభ్యర్థిని ప్రకటించింది. ఓ గిరిజన మహిళను ఎంపిక చేయడం నిజంగా భారత పార్లమెంట్‌ ‌చేసుకున్న అదృష్టం. అయితే ఈ ఎంపిక ఓ రెండ్రోజుల మందే జరిగి, విపక్షాల ను ఒప్పించి ఉంటే ఆమె ఏకగ్రీవం…

వితంతువుల పట్ల వివక్ష ఇంకెన్నాళ్ళు..

‘‘‌మరణం ఎవరికైనా సహజమే. కాని భర్త చనిపోయినా స్త్రీని ముండ్రాలిని చేసిన సమాజం ఆమెకు అనేక ప్రతిబంధకాలను కల్పించింది. మరణించిన తమ భర్తల ఆస్థిని అనుభవించడం గగనమైపోతున్నది. భర్త బంధువుల నుండి, అత్తమామలు, ఆడబిడ్డలు నుండి అనేక ఇబ్బందులను ఎదుర్కుంటున్నారు. జీవితాంతం తోడు వుంటాడు అనుకున్న భర్తల ఆకాల మరణంతో కుంగుబాటుకు గురై దు:ఖంలో వున్న…

కేంద్ర ప్రభుత్వరంగ సంస్థల ఆస్తుల కోసం కేసియార్‌ ‌సుప్రీమ్‌ ‌కోర్టుకు వెళ్ళాలి…

తెలంగాణ ప్రజల ఆస్తుల్ని బహిరంగంగా వేలం పాటలో అమ్ముకొని రియల్‌ ఎస్టేట్‌ ‌చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం నిజాయితీ ఉంటే ఈ అమ్మకాలు ఆపి తెలంగాణ ప్రజల ఆస్తి అయిన వివిధ కేంద్ర ప్రభుత్వరంగ సంస్థల భూముల అమ్మకాన్ని సవాల్‌ ‌చేస్తు సుప్రీమ్‌ ‌కోర్టుకు పోవాలి. 7200 కోట్ల విలువైన భూముల్లో పరిశ్రమల్ని పునఃప్రారంభించడానికి దిల్లీలో దీక్షకు…

భారతంలో శిశు మరణాలు ప్రధాన సమస్య అవుతోందా ?

ప్రతి వెయ్యి మంది జన్మించిన 5 ఏండ్ల లోపు శిశువుల్లో మరణించిన వారి సంఖ్యను శిశు మరణాల రేటు(ఇన్ఫాంట్‌ ‌మోర్టాలిటీ రేట్‌, ఐయంఆర్‌)‌గా వర్ణిస్తారు.  దేశ శిశు మరణాల రేటు ఆధారంగా ఆ దేశ ప్రజల ఆరోగ్య సంక్షేమం ఉంటుందని మనకు తెలుసు. ఇటీవల విడుదల చేసిన రిజిస్ట్రార్‌ ‌జనరల్‌ ఆఫ్‌ ఇం‌డియా గణాంకాల ప్రకారం…

నేడు ప్రపంచ వితంతువుల దినోత్సవం

వితంతువుల పట్ల వివక్ష ఇంకెన్నాళ్ళు.. వితంతు అనే పదం అనాగరికమైనది. ఈ పదం వినడానికి మనకే ఎంతగానో బాధ వుంటుంది. అలాంటిది వితంతువుల జీవితాలు ఎంత దుర్భరంగా వుంటాయో వేరే చప్పక్కర్లేదు. ఇవాల్టికి కూడా ఎంతో మంది వితంతువులు కుటుంబ పరంగా, సామాజిక పరంగా వివక్షతకు గురౌతున్నారు. ఎంతోమంది సంఘ సంస్కర్తలు వితంతువుల హక్కుల కోసం…

ఆత్మగౌరవంతో ఆర్థికంగా ఎదుగుతున్న బి.సి.లు

ప్రజా సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం బడ్జెట్‌ ‌లో సింహాభాగం కేటాయిస్తుంది. తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలు యావత్‌ ‌దేశానికి ఆదర్శ ప్రాయంగా నిలుస్తూ సంక్షేమంలో స్వర్ణయుగాన్ని సృష్టించిందని చెప్పడంలో అతిశయోక్తి లేదు, రాష్ట్రంలోని బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి, సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం అనేక విశిష్ట పథకాలను అమలు చేస్తూ వివిధ కుల వృత్తులకు…