Category శీర్షికలు

పుతిన్‌ దురాక్రమణ దాహానికి 500 రోజులు దాటింది..!

రష్యా‌ అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ ప్రకటించిన “ప్రత్యేక మిలటరీ ఆపరేషన్” పేరున‌ ఫిబ్రవరి 24, 2023న ఉక్రెయిన్‌పై అమానుష దాడితో మొదలై నాటో సహాయసహకార ప్రవేశంతో గత 500 రోజులుగా కొనసాగడంతో ప్రపంచ దేశాలన్నీ యుద్ధ ప్రభావంతో ఉత్పత్తి, సరఫరా గొలుసులు తెగిపోవడంతో ఆర్థికంగా 1.6 లక్షల కోట్ల డాలర్లకు పైగా కుంగిపోవడం, మరో లక్ష…

మహిళలే ఎందుకు లక్ష్యం ?

గత కొన్ని నెలలుగా మణిపూర్‌లో ఉద్రిక్తలు పెరిగిపోతున్నప్పటికినీ, భారతదేశమంతా నిమ్మకు నీరెత్తినట్టుగా ఉండిపోయింది. మే 3, 2023న మొదటిసారిగా అక్కడ అల్లర్లు ప్రారంభమైతే స్పందించని దేశం జూలై 19, 2023న ఒక్కసారిగా తన మొద్దు నిద్ర నుండి బయటపడింది. మణిపూర్‌లో ఒక గుంపు ఇద్దరు స్త్రీలను నగ్నంగా ఊరేగిస్తూ వేధింపులకు గురిచేస్తున్నట్లు చూపించే ఒక భయంకరమైన…

వరదల వలన తీవ్ర నష్టాలు

మానవ మనుగడకు ప్రకృతి చేసే సవాళ్ళల్లో వరదలు ఒకటి.వివిధ రీతుల్లో ముంచుకొచ్చే వరదల కారణంగా భూమండలంపై ఎన్నో ప్రాంతాలు తల్లడి ల్లుతున్నవి.వరదల వల్ల ప్రపంచవ్యాప్తంగా కోట్ల సంఖ్యలో ప్రజలు ఆర్థికంగా, సామాజికంగా, పర్యవరణంగా నష్టపోతున్నారు.సూర్యుడి నుంచి భూమి గ్రహించే ఉష్ణోగ్రత వల్ల భూమి వేడెక్కి నేల మీద ఉన్న తేమ, జలాశయాలు, నదులు, చెరువుల్లోని నీరు…

వేదికపై రాళ్ల వర్షం కురిసిన జంకని సింహంవలే గర్జించిన కవితాచార్యుడు

నేడు  దాశరథి కృష్ణమాచార్య  జయంతి 1944లో ఓరుగల్లు జిల్లాలో  ఆంధస్రారస్వత పరిషత్తు ప్రథమ  వార్షికోత్సవం నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో కవులు, కళాకారులు కవి సమ్మేళనం జరపడానికి పూనుకున్నారు. కవి సమ్మేళనం జరుగుతున్న విషయాన్ని నాటి రజాకారులు పసిగట్టారు. సమ్మేళనాన్ని ఆపేందుకు వ్యూహం పన్నారు. దాశరథి, దేవులపల్లి రామానుజరావు, సురవరం ప్రతాపరెడ్డి , తెలుగు భాషా సంరక్షకులు,…

‌సిగ్గు పడుదామా..

‘‘కుకి తెగకు చెందిన ఇద్దరు గిరిజన యువతుల్ని నగ్నంగా ఊరేగించి సామూహిక అత్యాచారానికి పాల్పడి హత్య చేసిన దారుణమైన ఘటన మానవత్వం వాదులను ప్రజాస్వామిక వాదులను కలచివేసింది. ఫాసిజాన్ని అమలు చేసే క్రమంలో కుకి గ్రామంపై ఆ  మూకలు కన్ను వేశారు.మహిళలను బలవంతంగా పట్టపగలు రెండు కిలోమీటర్లు నగ్నంగా నడిపించుకుంటూ గ్రామానికి తీసుకొని పోయి అత్యంత…

సత్యానికి గెలుపన్నది సత్యంరా మానవుడా..! ప్రజాకవి దాశరథి

‘‘నావియక్సు కిరణాల  కళ్ళేమో – నాకేం తెలుసు, లోకమా ? కంటికి కనిపించిందంతా కైతగా రాసేస్తున్నాను’’ అన్న మహాకవి దాశరథి కృష్ణమాచార్య 1925 జూలై 22న తెలంగాణలోని వరంగల్‌ ‌జిల్లా చిన్న గూడూరు (ఈ గ్రామమిప్పుడు మహబూబాబాద్‌ ‌జిల్లాలో ఉంది) గ్రామంలో జన్మించాడు.  చిన్నతనంలోనే పద్యాలు అల్లడం నేర్చిన ఈ కవి, రచయిత నిజాం ప్రభువును…

మొన్న విద్యుత్‌..‌ నిన్న డబుల్‌ ‌బెడ్‌రూమ్‌ ‌బిఆర్‌ఎస్‌ ‌వెంటపడిన రెండు జాతీయ పార్టీలు

తెలంగాణలో రాజకీయ పార్టీల మధ్య ఒక విధంగా యుద్ధ వాతావరణం చోటు చేసుకుంటుంది. మరో నాలుగు నెలల్లో ఎన్నికలు రానుండడంతో ఆయా పార్టీలు మాటల దాడులు తీవ్రతరం చేస్తున్నాయి. నిన్నటి వరకు కాంగ్రెస్‌ ‌పార్టీ విద్యుత్‌ ‌విషయాన్ని తీసుకుని పెద్ద రభస చేసింది. వ్యవసాయ రంగానికి 24 గంటల పాటు ఉచిత విద్యుత్‌ను అందిస్తున్నామంటూ రాష్ట్ర…

నగ్నంగా నడిచింది దేహం కాదు…..అది దేశం..

యుగాలు దాటొచ్చిన మనిషిని మృగాలుగా మార్చింది ఎవ్వడు ? పాలిచ్చిన అమ్మల రొమ్ములను బరి తెగించి ఊరేగించిన ఉన్మాదానికి ఊతమిచ్చింది ఎవ్వడు ? వేట కుక్కల్ని ఉసి గొల్పింది ఎవ్వడు ? విద్వేషాన్ని రక్త నాళాలలోకి ఎక్కించింది ఎవ్వడు? తల్లుల జననాంగాల మీద తాండవమాడిన గాడిద కొడుకులను కని పెంచింది ఎవ్వడు ? నెత్తురుని మరిగించింది…

తుర్రేబాజ్‌ ‌ఖాన్‌ ‌పోరాటం… నేటికీ స్ఫూర్తి దాయకం.

భారత ప్రథమ స్వతంత్ర సంగ్రామంగా పేరెన్నిక గన్న 1857 సిపాయిల తిరుగుబాటు ఉత్తర భారతావనిలో ప్రారంభం అయినా దాని ప్రభావం దక్షిణ భారతదేశానికీ విస్తరించింది. ఈ తిరుగు బాటుకు నిజాం పరిపాలనా ప్రాంతమైన హైదరాబాద్‌ ‌కు సంబంధాన్ని సూచించే చారిత్రక అంశమే తుర్రేబాజ్‌ ‌ఖాన్‌ ‌మార్గదర్శక జీవితం. ఆధునిక మారణ ఆయుధాలు కలిగి, అపారమైన సైనిక…