Category శీర్షికలు

‌తప్పుడు అఫిడవిట్ల కేసులో మంత్రులు, ఎమ్మెల్యే లు..

శాసనసభ ఎన్నికలు సమీపిస్తుండ•ంతో రాష్ట్రంలో ఒకపక్క రాజకీయ వేడి రాచుకుంటుంటే అధికార పార్టీలో మాత్రం ఆందోళన కొనసాగుతున్నది. గత ఎన్నికల్లో గెలిచిన ఎమ్మెల్యే లలో  దాదాపు ఇరవైఐదు  మందిపైన కేసులుండడమే ఈ ఆందోళనకు కారణమైంది. గత ఎన్నికల సమయంలో ఎలక్షన్‌ ‌కమిషన్‌• ‌కు సమర్పించిన ధృవపత్రాలు సరిగాలేవని, లెక్కింపులో లోపాలున్నాయని, తమపై ఉన్న కేసులు, ఆస్తుల…

ప్రజల భాగసామ్యమంటె గిదేనా!

బళ్ళు శెరువులాయె,బల్లలు నీల్ల మీద తేలుడాయె!  యే సౌలతుల్లేక బడిపోరల్లకు తిప్పలై సదువు సట్టుబండలాయె! అయితె అయింది గని గీ ము చ్చటబయటికి తెల్వనియ్యకుండ్రి. మీడియా,విద్యార్థి సంఘాలు ఎన్జీవోలను బళ్ళెకు రానీయకుండ్రి! ఎంత           తిప్పలయినా,సౌలతుల్లేకున్నా మీ సావు మీరు సావుండ్రి గని బయిటోళ్ళకు గీ ముచ్చట యెరుకైతె లోకవంత యెరికైతది!…

స్వరాష్ట్రంలో జర్నలిస్టులపై దాడులా?

ప్రభుత్వ కార్య క్రమాల అమలు  ప్రజాబి •ప్రాయాన్ని సేకరి ంచే క్ర మంలో  సామా జిక రాజ కీయ ఆర్థిక చారి త్రక సాం స్కృతిక అంశాల పైన  సమాజంలో జరుగుతున్న చర్చను ఎక్కడి కక్కడ ఎప్పటికప్పుడు  విస్తృత పరిచే విషయంలో   పత్రికలు… ఆ పత్రికలకు  ప్రతి నిధులుగా వ్యవహ రిస్తున్నటువంటి జర్నలిస్టులు  క్రియాశీలక…

లక్షల కోట్ల రుణమాఫీ ఎవరి కోసం?

మోదీ ప్రభుత్వ హయాంలో పెరుగుతున్న రుణాల మాఫీ, నోట్ల రద్దు, ఆధార్‌ అనుసంధానం తప్పనిసరి వంటి నోటిఫికేషన్‌ల ద్వారా సామాన్యులు తమ సొంత డబ్బును ఉపయోగించుకోకుండా అడ్డుకుంటున్నారు, అయితే బడా పారిశ్రామికవేత్తలకు రుణమాఫీ వల్ల ప్రయోజనం చేకూరుతుంది.  మార్చి 2023తో ముగిసిన సంవత్సరంలో బ్యాంకులు రూ. 2.09 లక్షల కోట్లకు పైగా (సుమారు  యుఎస్‌  ‌వి…

కాలంతో సంభాషించిన కవి కాలమ్స్

‌కోడం కుమారస్వామి, తెలుగు అధ్యాపకులు, ఎల్‌.‌బి. బి.ఇడి. కళాశాల, వరంగల్‌, 9848362803 ‌రచయితలు రాజ్యం చేతిలో బందీలయినపుడు ఆ నిర్భంధ పరిస్థితుల్లో నిరీక్షణ, మానవీయ సంబంధ బాంధవ్యాలు, నిరాశ, నిస్పృహలను ఏదో రూపంలో వ్యక్తీకరిస్తారు. జైలులో ఖైదీల ఆరాటాలు, ఆవేదనలు, ఉద్వేగాలను ‘ఆంధప్రభ’ పత్రికకు ఒక కాలమ్‌గా రాయడం కవి వరవరరావు గారికి పరీక్షలాంటిదే. బయటి…

సంక్షేమానికి చిరునామాగా తెలంగాణ

2014లో ఆసరా పెన్షన్‌ ‌లబ్దిదారులు 28,47,855 మాత్రమే 2023 నాటికి సంఖ్య 43,81,338కు పెంచిన రాష్ట్ర ప్రభుత్వం. 2014లో ఆసరా కింద నెలకు ఇచ్చిన పెన్షన్‌ ‌మొత్తం రూ.67 .47 కోట్లు నేడు నెలకు రూ.976.42 కోట్ల ఆసరా దివ్యాంగుల పెన్షన్‌ ‌రూ.3016 నుండి రూ.4016 లకు పెంపు 5 లక్షల 11 వేల 656…

మతమౌఢ్యం ఫలితమే-మణిపూర్ మంటలు

మణిపూర్ లో జరిగిన సంఘటన మానవత్వానికి మాయని మచ్చ.సంఘటన  జరిగి 77 రోజులు గడచిన,సంఘటన సోషల్ మీడియాలో వైరల్ అయి బయటి ప్రపంచానికి తెలిసేంత  వరకు రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ గా స్పందించలేదంటే,. సుప్రీంకోర్టు కేంద్రాన్ని “మీరు చర్యలు తీసుకుంటారా? లేక మేము తీసుకోవాలా” అని హెచ్చరిస్తే గానీ కేంద్రం స్పందించలేదంటే..  కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ఎంత ఉదాసీనంగ…

పథకాలు ప్రకటించటంలో ఉన్న ఆరాటం అమలులో ఏది..?

ఇటీవల బిఆర్ఎస్ ప్రభుత్వం పెద్ద ఎత్తున ఆర్భాటంగా అనేక కొత్త పథకాలకు రూపకల్పన చేస్తూ.. ఆగ మేఘాల మీద ప్రకటిస్తున్నారు. గత ఏడాది దళిత బంధు పథకం ప్రకటించి, లక్షలో ఒక్కరి, ఇద్దరికి ఇచ్చి, దాని ఉసే మరిచారు. గత నెల రోజుల క్రితం అతి గొప్పగా బిసి కుల వృత్తులకు రూ.లక్ష రూపాయల ఆర్థిక సహాయం పథకానీ ప్రకటించారు. ఇదే తరహాలో రెండు రోజుల క్రితం మైనార్టీల కోసం మైనార్టీ బంధు పథకాని కేసీఆర్ పునాదులు వేశాడు. కానీ సంక్షేమ పథకాలు ప్రకటించిన అంత వేగంగా, ఆ పథకాల అమలు లేకపోవడం చూస్తుంటే, నిజంగా ఈ ప్రభుత్వానికి ఆ పథకాలు అమలు చేయాలన్న చిత్త శుద్ధి ఉందా..? అన్న సందేహం కలుగుతుంది. సీఎం కేసీఆర్ దళిత బంధు పథకాన్ని అతి గొప్పగా ప్రకటిస్తూ.. దళితుల్లో ఎలాంటి తారతమ్యాలకు తావు లేకుండా ప్రజా ప్రతినిధి అయిన, ప్రభుత్వ ఉద్యోగైనా, వ్యాపారస్తుడైనా, భూమి ఉన్నా సరే, ప్రతి దళితునికి రూ.10 లక్షల నగదు బంధు ఇస్తానని ప్రకటించారు. అన్న విధంగానే కోటికో నూటికో ఒకరి, ఇద్దరికి తమకు అనుకూలంగా ఉన్నవారికి ఇచ్చి ఎనలేని ప్రచారం చేసుకుంటున్నారు. అదే విధంగా ఆగ మేఘాల మీద బీసీ కుల వృత్తుల వారికి రూ.లక్ష రూపాయల బంధు ప్రకటించినట్లుగానే, గత రెండు రోజుల క్రితం మైనార్టీలకు మైనార్టీ బంధును కూడా ఇస్తానన్న ప్రకటన రానే వచ్చింది. తొమ్మిదేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ కు ఇప్పుడే దళితులు, గిరిజనులు, బిసి, మైనార్టీలు గుర్తుకు రావడంపై  అనేక సందేశాలు కలుగుతున్నాయి. ఏ ప్రభుత్వమైనా సమాజంలో నెలకొన్న అసమానతలను రూపు మాపడానికి సంక్షేమ పథకాలను అమలు చేస్తుంటాయి. కానీ అందుకు భిన్నంగా కేసీఆర్ ఆగ మేఘాల మీద ప్రకటిస్తున్న పథకాలను చూస్తుంటే, కేవలం ఓట్ల కోసమే సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టినట్లుగా కనిపిస్తుంది. నిజానికి దళితుల్లో నూటికి 90 శాతంకు పైగా కడు బీదరికంలోనే ఉన్నారు. వారిని బీదరికం నుంచి బైట పడేయటానికి దళిత బంధు తేవడం హర్షణీయమే, కానీ అందుకు భిన్నంగా కేసీఆర్ ప్రకటించిన దళిత బంధు పథకాన్ని చూస్తుంటేనే అనేక సందేహాలు కలుగుతున్నాయి. ఏ పథకమైన ముందుగా ఎలాంటి అసరా లేని వారికి ఇచ్చి ప్రోత్సహిస్తారు. అందుకు భిన్నంగా దళిత బంధు ప్రభుత్వ ఉద్యోగస్తులు, తమ కార్యకర్తలు, నాయకులకు ఇచ్చుకున్నారు. అంటే ప్రభుత్వానికి నిజంగా దళితులపై ప్రేమతో పెట్టిన పథకం కాదన్న మాట.! ఓట్ల కోసం పెట్టిన పథకం అన్న మాట.! ప్రతి దళితుడికి ఇవ్వడంలో ఎవరికి ఎలాంటి అపోహలు, సందేహాలు లేవు కానీ, ముందుగా కడు బీదరికంలో ఉండి, ఎలాంటి ఆసరా లేని వారికి ఇచ్చి ప్రోత్సహించాలి. అందరికి ఇస్తాను అని అనడంలోనే కేసీఆర్ చిత్త శుద్ధి ఏమిటో అర్థం అవుతుంది. అంటే ఒక్కరి, ఇద్దరికి రూ.10 లక్షలు ఇచ్చి, యావత్ దళిత సమాజాన్ని మోసం చేయలని కేసీఆర్ కుట్ర పన్నినట్లుగా ఉంది. ఇదే తరహాలో బిసి కుల వృతి దారులకు, మైనార్టీలకు రూ.లక్ష రూపాయల పథకం ఊరికి ఒక్కరు, ఇద్దరికి ఇచ్చి లబ్ధి పొందాలని చూస్తున్నట్లు ఉంది. గత ఎన్నికలలో అధికారంలోకి రావడానికి కేసీఆర్ ఇంటికో ఉద్యోగం, దళితులకు మూడు ఎకరాల భూమి, డబల్ బెడ్ రూమ్ ఇళ్లు, నిరుద్యోగ భృతి వంటి అనేక పథకాలు ప్రకటించి, నేడు వాటి ఊసే ఎత్తడం లేదు. డబుల్ బెడ్ రూం, దళితులకు మూడు ఎకరాల భూమి, ఇంటికో ఉద్యోగం, నిరుద్యోగ భృతి జాబితాలో  దళిత, బిసి, మైనార్టీ బంధు పథకాలు చేరుతాయన్న సందేశం కలుగుతుంది. బిసి బంధు ప్రకటించిన నెల రోజుల తరువాత విధి విధానాలు ప్రకటించి, దరఖాస్తు చేసుకోవడానికి కేవలం పది రోజుల గడువు ఇవ్వడం ఏమిటి..? అంటే ఎవరు కూడా దరఖాస్తు చేసుకునేందుకు వీలు ఉండకూడదని అనుకున్నారేమో..? అందుకే దరఖాస్తు చేసుకోవడానికి కేవలం పది రోజు గడువు ఇచ్చినట్లు ఉన్నారు. ప్రభుత్వం సూచించిన విధంగా ప్రతి దరఖాస్తుదారుడు కుల, ఆదాయ, ధృవ పత్రాలతో పాటు  రేషన్ కార్డు జత చేయాల్సి ఉంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత కొత్త రేషన్ కార్డుల జారీ లేనే లేదు. ప్రభుత్వ నియమ నిబంధనల మేరకు కుల ధృవీకరణ పత్రం జారికి ఒక నెల గడువు, ఆదాయ ధృవీకరణ పత్రాల జారికి వారం రోజుల గడువు ఉంటుంది. ప్రభుత్వం ఇచ్చిన పది రోజుల గడువులో బిసి కుల వృత్తి దారులు ఎలా దరఖాస్తు చేసుకుంటారు. బిసి కుల వృత్తులు చేసుకునే వారిలో, మైనార్టీలలో అత్యధికులు నిరక్షరాశులు ఉంటారు. ప్రభుత్వం సూచించిన విధంగా వారం రోజులో ధృవ పత్రాలను పొంది, ఎలా దరఖాస్తు చేసుకుంటారు. దీనిని బట్టి చూస్తే ప్రభుత్వానికి బిసి కులాలను మోసం చేయడం కోసమే, బిసి బంధు తెచ్చినట్లు కనిపిస్తుంది. బిసి బంధు ప్రకటనతో లక్షలాది మంది వారం రోజుల పాటు ఏంఅర్ఓ కార్యాలయాల చుట్టూ చెప్పులు అరిగేలా తిరిగిన చాలా మంది కుల, ఆదాయ ధృవ పత్రాలు సాధించలేక పోయారు. ఇదే అదునుగా ఏంఅర్ఓ కార్యాలయ సిబ్బంది, మీ సేవ నిర్వాహకులు అందిన కాడికి దండుకొని కావలసిన వారికి ధృవ పత్రాలు జారీ చేశారు. ప్రభుత్వం ఏదైనా ఒక పథకం ప్రకటిస్తే, అర్హులైన ప్రతి ఒక్కరికి పథకం అందేలా విధి విధానాలను రూపకల్పన చేస్తాయి. కానీ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన పథకాలలో చిత్త శుద్ధి లేనట్లు కనిపిస్తుంది. దరఖాస్తు చేసుకోవడానికే సమయం ఇవ్వని ప్రభుత్వం అర్హులైన బిసి కులాలకు రూ.లక్ష రూపాయలు ఎలా ఇస్తుందని నమ్మాలి. దళిత బంధు, బిసి కుల వృత్తులకు ఇచ్చే రూ.లక్ష రూపాయల సహాయం పథకం  మాదిరిగానే మైనార్టీ బంధు పథకం కూడా ప్రకటనలకే పరిమితం కానున్నట్లు ఉంది. దీనిని బట్టి చూస్తే, కేసీఆర్ మరోసారి ఓట్ల కోసం ఆగ మేఘాల మీద తీసుకువచ్చిన పథకాలు తప్ప, ప్రజల సంక్షేమం కోసం కాదన్న సంగతి తేటతెల్లం అవుతున్నది.    బొల్లంపల్లి ఆంజనేయులు 9000099152

ఒకరోజు వ్యవధిలో రాష్ట్రానికి ఇద్దరు అగ్రనేతలు

– మండువ రవీందర్‌రావు ఒకరోజు తేడాతో రెండు పార్టీలకు చెందిన ఇద్దరు జాతీయస్థాయి  అగ్రనేతలు రాష్ట్రంలో పర్యటించనున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో ఎన్నికల వాతావరణం తలపిస్తుండగా, వీరిరాకతో వాతావరణం మరింత హోరెత్తే అవకాశముంది. దేశంలోని  రాజకీయ పార్టీలన్నీ కలిసి  తాజాగా  రెండు కూటములుగా విభజించబడ్డాయి. బిఆర్‌ఎస్‌, ‌వైఎస్‌ఆర్‌సిపి లాంటి ఒకటిరెండు పార్టీలు ఏ కూటమికి చెందనివిగా ఉన్నప్పటికీ…