prajatantra_news

prajatantra_news

ముగిసిన శుభాంశు శుక్లా రోదసీ యాత్ర

– క్షేమంగా భూమ్మీదకు చేరిక – ప్రధాని మోదీ తదితరుల శుభాకాంక్షలు కాలిఫోర్నియా, జూలై 15: భారత వ్యోమగామి శుభాంశు శుక్లా రోదసీ యాత్ర ముసిగింది. ఆయన తిరగి భూమ్మీదకు క్షేమంగా చేరుకున్నారు. యాక్సియం-4 మిషన్‌లో భాగంగా అంతరిక్ష పరిశోధన కేంద్రం ఐఎస్‌ఎస్‌కి వెళ్లిన ఆయన అంతరిక్షంలో 18 రోజులు గడిపారు. మానవాళికి ఉపయోగపడే ప్రయోగాలు…

గవర్నర్‌కు చేరిన ఆర్డినెన్స్ ‌ముసాయిదా

~ స్థానిక సంస్థల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్లు హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,జూలై15: స్థానిక సంస్థల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్ల కోసం రూపొందించిన ఆర్డినెన్స్ ‌ముసాయి దా రాజ్‌భవన్‌కు చేరింది. ఇటీవలే కేబినేట్‌ ఆమోదించిన రిజర్వేషన్‌ ‌బిల్లుకు ఆర్డినెన్స్ ‌తేవాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ క్ర మంలో పంచాయతీరాజ్‌ ‌చట్టంలో సవరణల ఆమోదం కోసం రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్‌కు పంపించింది.…

సీఎం ప్రజావాణిలో 296 దరఖాస్తులు

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 15: మహాత్మా జ్యోతిబా పూలే ప్రజాభవన్‌లో మంగళవారం నిర్వహించిన సీఎం ప్రజావాణి కార్యక్రమంలో మొత్తం 296 దరఖాస్తులు అందాయి. పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖకు సంబంధించి 60, రెవెన్యూ శాఖకు సంబంధించి 63, విద్యుత్‌ శాఖకు 22, పౌర సరఫరాల శాఖకు 7, ఇందిరమ్మ ఇండ్ల కోసం 57 దరఖాస్తులు వచ్చాయి. ఇతర…

19న చీఫ్‌ జస్టిస్‌గా ఏకే సింగ్‌ ప్రమాణస్వీకారం

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 15: తెలంగాణ హైకోర్టు నూతన ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ అపరేశ్‌ కుమార్‌ సింగ్‌ (ఏకే సింగ్‌) ఈనెల 19న ప్రమాణస్వీకారం చేయనున్నారు. రాజ్‌భవన్‌లో మధ్యాహ్నం 12.30 గంటలకు గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ జస్టిస్‌ ఏకే సింగ్‌తో ప్రమాణస్వీకారం చేయించనున్నారు. కార్యక్రమానికి హైకోర్టు న్యాయమూర్తులు, శాసనమండలి చైర్మన్‌, శాసనసభ స్పీకర్‌, ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి,…

బీఆర్‌ఎస్‌ మాజీ ఎమ్మెల్యే షకీల్‌కు ఎదురుదెబ్బ

– పంజాగుట్ట రోడ్డు ప్రమాదంపై పిటిషన్‌ డిస్మిస్‌ – తీర్పు వెలువరించిన హైకోర్టు హైదరాబాద్ , ప్రజాతంత్ర, జూలై 15: రోడ్డు ప్రమాద కేసు నుంచి తన కొడుకును తప్పించేందుకు బీఆర్‌ఎస్‌ బోధన్‌ మాజీ ఎమ్మెల్యే షకీల్‌ అమీర్‌ చేసిన ప్రయత్నాలు హైకోర్టులో బెడిసికొట్టాయి. రోడ్డు ప్రమాదం కేసు నుంచి కుమారుడు రాహిల్‌ అమీర్‌ను తప్పించడానికి…

తెలంగాణ ఆర్టీసీకి ఊర‌ట‌

– ఈపీఎఫ్‌ నోటీసుపై స్టే విధించిన హైకోర్టు హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, జూలై 15: ఆర్టీసీ కార్మికులకు చెల్లించాల్సిన ఉద్యోగుల బీమా పథకం కింద బకాయి రూ.131.76 కోట్లు చెల్లించాలని ప్రాంతీయ పీఎఫ్‌ కమిషనర్‌ జారీ చేసిన నోటీసు అమలును నిలిపివేస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. నోటీసులో ఏపీఎస్‌ఆర్టీసీ అని పేర్కొనడాన్ని తప్పుపట్టింది.  టీజీ, ఏపీ బకాయిల…

బండి సంజయ్‌పై కేసు కొట్టివేత

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 15: అసెంబ్లీ ఎన్నికల సమయంలో బీజేపీ నేత, ప్రస్తుత కేంద్ర మంత్రి బండి సంజయ్‌పై కరీంనగర్‌ పోలీసులు నమోదు చేసిన కేసును హైకోర్టు కొట్టివేస్తూ తీర్పు చెప్పింది. 2023 నవంబర్‌ 30న మీడియా సమావేశంలో బండి సంజయ్‌ మాట్లాడుతూ ఆనాటి సీఎం కేసీఆర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ కరీంనగర్‌ పోలీసులు కేసు…

ఆడబిడ్డల ఆనందమే తెలంగాణ సౌభాగ్యం

– కామారెడ్డిలో ధూం ధాంగా ఇందిరా మహిళా శక్తి సంబురాలు – రూ.20.56 కోట్ల వడ్డీ లేని రుణాల చెక్కు అందచేత – ఇందిరా మహిళా శక్తిని చాటేలా దేవతల వేషధారణలో మహిళలు – దేశానికి స్పూర్తిగా ఇందిరా మహిళా శక్తి విజయాలు – పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ది, మహిళా శిశు సంక్షేమ శాఖల మంత్రి సీతక్క…

త్వరగా గృహ ప్రవేశాలు జరుపుకోవాలి

యాదాద్రి కలెక్టర్‌ హనుమంతరావు యాదాద్రి భువనగిరి, ప్రజాతంత్ర, జులై 15: ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు ఇళ్ల నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేసుకుని గృహ ప్రవేశాలు చేపట్టాలని జిల్లా కలెక్టర్‌ హనుమంత రావు అన్నారు. రాజాపేట మండలం బూరుగుపల్లి గ్రామంలో నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇండ్ల పనులను ఆయన మంగళవారం పరిశీలించి లబ్ధిదారులతో మాట్లాడారు. గోపాల్‌…

ఐటీ మంత్రితో ఫ్రాన్సు కాన్సుల్‌ జనరల్‌ భేటీ

హైదరాబాద్‌, బెంగళూరులోని ఫ్రాన్స్‌ కాన్సుల్‌ జనరల్‌, అడ్మినిస్ట్రేటర్‌ ఆఫ్‌ ది స్టేట్‌ మార్క్‌ లామీ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబును సచివాలయంలో మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. తెలంగాణ-ఫ్రాన్స్‌ మధ్య ద్వైపాక్షిక సంబంధాల బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై వీరిద్దరూ చర్చించారు. అలాగే ఇరుపక్షాల మధ్య సహకారాన్ని పెంపొందించడం, వివిధ రంగాల్లో భాగస్వామ్య అవకాశాలపై…