prajatantra_news

prajatantra_news

రేప‌టినుంచి ఆర్‌ఆర్‌బి పరీక్షలు

హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, ఫిబ్ర‌వ‌రి 10: దేశవ్యాప్తంగా ఉన్న రైల్వే రీజియన్లలో ఆర్‌ఆర్‌బీ సెక్షన్‌ ‌కంట్రోలర్‌ ‌పరీక్ష బుధవారం నుచి ప్రారంభంకానుంది. ఇందుకు సంబంధించి మాక్‌ ‌టెస్టులను రైల్వే రిక్రూట్‌మెంట్‌ ‌బోర్డు తాజాగా అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్ధులు డైరెక్ట్ ‌లింక్‌ ‌ద్వారా ఉచిత మాక్‌ ‌టెస్ట్‌లు రాయవచ్చు. అభ్యర్థులు ఆన్‌లైన్‌ ‌ద్వారా…

బైక్‌పై ప్రమాదకర విన్యాసాలు వ‌ద్దు

– యువతకు సీపీ సజ్జన్నార్‌ ‌హెచ్చరికలు హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, ఫిబ్ర‌వ‌రి 10: బైక్‌పై ప్రమాదకర విన్యాసాలు చేస్తున్న యువతకు హైదరాబాద్‌ ‌సీపీ వీసీ సజ్జనార్‌ ‌గట్టి వార్నింగ్‌ ఇచ్చారు. నగరంలో యువకులు బైక్‌పై చేస్తున్న ప్రమాదకర విన్యాసాలు సోషల్‌ ‌మీడియాలో వైరల్‌ అవుతున్న నేపథ్యంలో సీపీ సజ్జన్నార్‌ ‌’ఎక్స్’ ‌వేదికగా స్పందించారు. వాహనాలను బాధ్యతాయుతంగా నడపాలని సూచించారు. బైక్‌…

రాష్ట్రంలో రేపు మున్సిపల్ ఎన్నికలు

రాష్ట్రంలో నేడు మున్సిపల్ ఎన్నికల పోలింగ్ – 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లలో.. – బరిలో మొత్తం 12,930 మంది అభ్యర్థులు – భారీగా ఏర్పాట్లు చేసిన రాష్ట్ర ఎన్నికల సంఘం – అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసుల భద్రత – మక్తల్‌లో అభ్యర్థి ఆత్మహత్య.. 6వ వార్డు ఎన్నిక వాయిదా హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 10:…

మహదేవప్ప ఆత్మహత్యకు కాంగ్రెస్సే కార‌ణం

– మండిపడ్డ బీజేపీ – పార్లమెంటులో ప్రస్తావించిన కిషన్‌రెడ్డి, లక్క్ష్మణ్ – డీజీపీ ఆఫీస్ ముట్టడికి బీజేపీ శ్రేణుల యత్నం, ఉద్రిక్తత హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 10: నారాయణపేట జిల్లా మక్తల్ 6వ వార్డు నుంచి పోటీ చేస్తున్న ఎరుకలి మహదేవప్ప ఆత్మహత్యపై బీజేపీ భగ్గుమంది. ప్రత్యర్థుల వేధింపుల వల్లనే మహదేవప్ప ఆత్మహత్యకు పాల్పడ్డారని ఆరోపించింది.…

మహదేవప్ప ఆత్మహత్య అత్యంత బాధాకరం

– కాంగ్రెస్‌వి అహంకార రాజకీయాలకు బల‌య్యాడు – ఘటనకు కారణమైన మంత్రి శ్రీహరిని బర్తరఫ్ చేయాలి – పోలీసులు ఎఫ్‌ఐఆర్ మార్చేశారు – బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 10: మక్తల్‌లో తమ పార్టీ అభ్యర్థి ఆత్మహత్య ఘటనపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్ రావు స్పందించారు. మక్తల్ మున్సిపాలిటీలో పార్టీ…

మక్తల్‌లో బీజేపీ వార్డు సభ్యుడి ఆత్మహత్య

– ఆ వార్డులో ఎన్నిక వాయిదా మక్తల్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 10: నారాయణపేట జిల్లా మక్తల్ మున్సిపల్ ఎన్నికల్లో 6వ వార్డు నుంచి కౌన్సిలర్‌గా పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థి ఎరుకలి మహదేవప్ప (43) మంగళవారం తెల్లవారుజామున ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. 6వ వార్డు ఎస్టీలకు రిజర్వు కావడంతో ప్రధాన పార్టీలు ముగ్గురు సొంత అన్నదమ్ములనే…

డిజిటల్ క్రాప్ సర్వే ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలి

– సీఎస్ రామకృష్ణారావు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 9: రాష్ట్రంలో డిజిటల్ క్రాప్ సర్వే ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామక ష్ణారావు అధికారులను ఆదేశించారు. సోమవారం డాక్టర్ బిఆర్ అంబ్కేదర్ రాష్ట్ర సచివాలయంలో ఉన్నతస్థాయి సమీక్షాసమావేశం జరిగింది. కేంద్ర ప్రభుత్వ వ్యవసాయశాఖ సలహాదారుడు, అగ్రిస్టాక్ చీఫ్ నాలెడ్జ్…

సాగునీటి కోసం రోడ్డెక్కిన రైతులు

ఖమ్మం, ప్ర‌జాతంత్ర‌, ఫిబ్రవరి 9: జిల్లాలో సాగునీటి కోసం రైతన్నలు రోడ్డెక్కారు. కొణిజర్ల మండలం గుబ్బగుర్తి వద్ద రహదారిపై రాస్తారోకోకు దిగారు. సాగు నీరు లేకపోవడంతో పంటలు ఎండిపోతున్నాయని, వెంటనే నీటిని అందించి పంటలను కాపాడాలని డిమాండ్ చేశారు. నాగార్జునసాగర్ నుంచి అధికారులు నీళ్లు విడుదల చేయకపోవడంతో తమ మొక్కజొన్న పంటలు ఎండిపోతున్నాయని రైతన్నలు ఆందోళన…

ముగిసిన మున్సిపల్ ఎన్నికల ప్రచారం

– చెమటోడ్చిన పార్టీల నేతలు – సీఎం సహా మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేల ప్రచారం – బీజేపీ నుంచి రంగంలోకి దిగిన ఇద్దరు కేంద్ర మంత్రులు – బీఆర్ఎస్ లో అంతా తామే అయిన కేటీఆర్, హరీష్ రావు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 9: మున్సిపల్ ఎన్నికల ప్రచార పర్వంలో అన్ని పార్టీల నేతలు చెమటోర్చారు. చివరి…

పార్కు స్థలాన్ని కాపాడిన ‘హైడ్రా’

– కబ్జాకు గురైన 1600 గజాలు స్వాధీనం హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, ఫిబ్రవరి 9: హైదరాబాద్‌ ‌శివార్లలోని నార్సింగి ప్రాంతంలో ప్రభుత్వ భూముల ఆక్రమణదారులపై హైడ్రా అధికారులు మరోసారి ఉక్కుపాదం మోపారు. ఒక ప్రజాప్రతినిధి అండతో కబ్జాకు గురైన అత్యంత విలువైన పార్క్ ‌స్థలాన్ని అధికారులు విజయవంతంగా తిరిగి స్వాధీనం చేసుకున్నారు. ప్రజల సౌకర్యార్థం కేటాయించిన స్థలాలను…