prajatantra_news

prajatantra_news

సీసీఐ, ఎస్‌ఐఐఎల్‌ పునరుద్ధరణకు చొరవ చూపండి

కేంద్ర మంత్రికి రాష్ట్ర ఐటీ మంత్రి శ్రీధర్‌బాబు విజ్ఞప్తి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 9: తెలంగాణలో మూతపడిన రెండు కేంద్ర ప్రభుత్వరంగ సంస్థల పునరుద్ధరణకు చొరవ చూపాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు కేంద్ర భారీ పరిశ్రమలు, ఉక్కు శాఖ మంత్రి హెచ్‌.డి.కుమారస్వామికి విజ్ఞప్తి చేశారు. దిల్లీలో కేంద్ర మంత్రిని బుధవారం…

కల్తీకల్లు ఘటనలో మరొకరు మృతి

మృతుల కుటుంబాలకు కోటి పరిహారం ఇవ్వాలన్న ఎంపీ ఈటల హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూలై 9: కల్తీ కల్లు కేసులో ఐదుగురు నిర్వాహకులను బాలానగర్‌ ఎక్సైజ్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కల్లు కాంపౌండ్లు నిర్వహిస్తున్న నగేశ్‌ గౌడ్‌, బి.శ్రీనివాస్‌ గౌడ్‌, టి. శ్రీనివాస్‌ గౌడ్‌, టి.కుమార్‌ గౌడ్‌, తీగల రమేశ్‌పై కేసు నమోదు చేసి విచారిస్తున్నారు. నిర్వాహకులకు…

త్వరితగతిన ఇండ్లు పూర్తిచేయాలి

యాదాద్రి జిల్లా కలెక్టర్‌ హనుమంతరావు యాదాద్రి భువనగిరి, ప్రజాతంత్ర, జులై 9: ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు త్వరితగతిన వాటి నిర్మాణాలు పూర్తి చేసుకోవాలని, ఇళ్లు పూర్తి అయిన లబ్ధిదారులకు విడతల వారీగా రూ.5 లక్షలు లబ్ధిదారుల ఖాతాల్లో ప్రతి సోమవారం జమ చేయనున్నట్లు యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్‌ హనుమంతరావు అన్నారు. వలిగొండ మండలంలోని నాతాళ్లగూడెం…

లక్ష్య సాధనకు పేదరికం అడ్డుకాదు

– మంత్రి దనసరి అనసూయ సీతక్క ములుగు, ప్రజాతంత్ర, జులై 9: విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను ఎంచుకోవాలని పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా, శిశు సంక్షేమ శాఖల మంత్రి దనసరి అనసూయ సీతక్క అన్నారు. ములుగు జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్‌ బాలికల ఉన్నత పాఠశాలలో ఇన్ఫోసిస్‌ సంస్థ ఏర్పాటు చేసిన కంప్యూటర్ల…

మోదీ స్ఫూర్తితో సమాజ సేవ

కేంద్ర మంత్రి బండి సంజయ్‌ పుట్టిన రోజు సందర్భంగా విద్యార్థులకు సైకిళ్ల పంపిణీ కరీంనగర్‌, ప్రజాతంత్ర, జులై 9: ప్రజలకు నిరంతరం అండగా ఉంటూ సమాజానికి సేవ చేయాలని మాలో స్పూర్తినింపిన నాయకుడు ప్రియతమ ప్రధాని నరేంద్రమోదీ అని, ఆయన బాటలో నడుస్తూ సమాజ సేవలో పాలుపంచుకుంటున్నానని కేంద్ర మంత్రి బండి సంజయ్‌ కుమార్‌ అన్నారు.…

కంపెనీల మోసాల నుంచి రైతులను రక్షించాం

రైతు కమిషన్‌ చైర్మన్‌ కోదండరెడ్డి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 9: గత పదేళ్ల కాలంలో రైతులు అనేక ఇబ్బందులు పడ్డారని, సీఎంగా రేవంత్‌ రెడ్డి బాధ్యతలు తీసుకున్న తర్వాత వ్యవసాయం, రైతు సంక్షేమం కోసం రాష్ట్ర రౖౖెతు కమిషన్‌ ఏర్పాటు చేశారని, ములుగులో మల్లీ నేషనల్‌ కంపెనీల మోసాల నుంచి రైతులను రక్షించామని రైతు కమిషన్‌…

సీతక్కకు సీఎం, స్పీకర్‌ జన్మదిన శుభాకాంక్షలు

ములుగు, ప్రజాతంత్ర, జులై 9: మహిళాశిశు సంక్షేమ శాఖ, పంచాయతీరాజ్‌ గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి దనసరి అనసూయ సీతక్కకు పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి, అసెంబ్లీ స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌ కుమార్‌లు మంత్రి సీతక్కకు ఫోన్‌ చేసి ఆమె జన్మదినం సందర్భంగా ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు. ప్రజాసేవలో కొనసాగుతూ రాష్ట్ర అభివృద్ధిలో…

అందరికీ రోల్‌మోడల్‌గా నిలవాలి

ఏఎంవీఐల పాసింగ్‌ ఔట్‌ పెరేడ్‌లో మంత్రి పొన్నం హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 9: తెలంగాణ పోలీస్‌ అకాడమీలో శిక్షణ పొందిన 96మంది అసిస్టెంట్‌ మోటార్‌ వెహికల్‌ ఇన్‌స్పెక్టర్స్‌ (ఏఎంవీఐ) పాసింగ్‌ ఔట్‌ పెరేడ్‌ బుధవారం జరిగింది. ముఖ్య అతిథిగా రవాణా, బీసీ సంక్షేమ శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్‌ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏఎంవీఐ నుంచి…

సీఎఫ్‌వోల పాత్ర కీలకం

సీఐఐ సదస్సులో డిప్యూటీ సీఎం భట్టి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 9: తెలంగాణ రాష్ట్రం శరవేగంగా అభివృద్ధి చెందుతోందని, ఆధునికత, అభ్యుదయానికి కేంద్రమని, సామాజిక న్యాయం, సమానత్వం, సమగ్రతలు రాష్ట్ర విధానాలని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. కాన్ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియన్‌ ఇండస్ట్రీ (సీఐఐ) బుధవారం సోమాజిగూడలో నిర్వహించిన చీఫ్‌ ఫైనాన్షియల్‌ ఆఫీసర్ల(సీఎఫ్‌వో)…

నదిపై కుప్పకూలిన బ్రిడ్జి: 9మంది మృతి

గుజరాత్‌ వడోదరా జిల్లాలో ఘటన గుజరాత్‌: వడోదర జిల్లాలోని మహిసాగర్‌ నదిపై ఉన్న గంభీరా వంతెన ఒక్కసారిగా కుప్పకూలిన ప్రమాదం బుధవారం ఉదయం జరిగింది. ఈ ఘటనలో బ్రిడ్జిపై ప్రయాణిస్తున్న నాలుగు వాహనాలు నదిలో పడిపోగా తొమ్మిదిమంది ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందిన వెంటనే అక్కడికి చేరుకున్న అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. ఇప్పటివరకు రెండు…