prajatantra_news

prajatantra_news

కాశ్మీర్‌తో కలిపి భారత్ మ్యాప్

– ప్రాధేయ‌ప‌డిన పాక్‌.. తొలగించిన అమెరికా ఇస్లామాబాద్, ఫిబ్రవరి 13: భారత్‌తో ట్రేడ్ డీల్‌ కుదిరిన వేళ అమెరికా వాణిజ్య ప్రతినిధి విడుదల చేసిన భారత్ మ్యాప్‌పై పాకిస్థాన్ గగ్గోలు పెట్టింది. దాయాది పేర్కొంటున్నట్టు కాకుండా భారత్ మ్యాప్ ఉన్నది ఉన్నట్టుగా(కాశ్మీర్‌తో కలిపి) అమెరికా షేర్ చేసింది. అగ్రరాజ్య అధికారులకు పాకిస్థాన్ పాల‌కులు నచ్చజెప్పి ఆ…

రష్యా నుంచి 288 ఎస్-400 క్షిపణుల కొనుగోలు

– రూ.10,000 కోట్ల ఒప్పందానికి గ్రీన్ సిగ్నల్ – మరింత పటిష్టం కానున్న భారత్ రక్షణ రంగం న్యూదిల్లీ, ఫిబ్రవరి 13: భారత రక్షణరంగ పటిష్టత దిశగా మరో కీలక ముందడుగు పడింది. రష్యా నుంచి 288 ఎస్-400 క్షిపణుల కొనుగోలుకు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ నేతృత్వంలో డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ సుమారు రూ.10వేల…

నల్గొండ డీఎస్పీని సస్పెండ్ చేయాలి

-డీజీపీ శివధర్‌రెడ్డికి బీజేపీ ఫిర్యాదు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 13: నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్‌లో 10వ వార్డులో జరిగిన ఎన్నికల అక్రమాల గురించి డీఎస్పీ శివరామిరెడ్డికి ఫిర్యాదు చేసేందుకు బీజేపీ జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్‌రెడ్డి వెళ్లినప్పుడు ఆయన రౌడీలా ప్రవర్తిస్తూ వీధిలో దాడి చేయడం, దుర్భాషలాడి కొట్టడం చేశారని బీజేపీ నాయకులు ఆరోపించారు. ఈ…

పంచాయతీ కార్యదర్శులకు ఊరట

– అంతర్ జిల్లా డెప్యుటేషన్‌కు అనుమతులు – మంత్రి సీతక్క చొరవ ఫ‌లితం హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 13: పంచాయతీ కార్యదర్శుల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. గత ప్రభుత్వం జారీ చేసిన జీవో నెం.317 కారణంగా స్థానికత కోల్పోయి దూర ప్రాంతాల్లో విధులు నిర్వర్తిస్తున్న 223మంది పంచాయతీ కార్యదర్శులకు రెండేళ్లపాటు…

కళ్ల ముందు కనిపించే మార్పు చూపిస్తా

ప్రియమైన మంథని మున్సిపాలిటీ ఓటర్లకు నమస్కారం.. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మంథనిలో అఖండ విజయాన్ని అందించి, నాపై నమ్మకం ఉంచిన మీ అందరికీ పేరుపేరునా హృదయపూర్వక ధన్యవాదాలు. నాపై మీరు ఉంచిన నమ్మకానికి కృతజ్ఞతలు. అభివృద్ధి అంటే కేవలం మాటల్లో కాదు.. మీ కళ్ల ముందు కనిపించే మార్పు చూపిస్తాను అని ఈ సందర్భంగా…

ఫలించిన భ‌ట్టి చాణ‌క్యం

– మ‌ధిర‌లో కాంగ్రెస్‌కు తిరుగులేని విజ‌యం – 21 వార్డుల్లో కాంగ్రెస్ కూటమి విజయం మధిర/ ఖమ్మం, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 13 : పట్టు వదలని విక్రమార్కుడు రాష్ట్ర డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అని మరోమారు రుజువైంది.  మధిర మున్సిపాలిటీని 22 స్థానాలకుగాను 21వార్డుల్లో కాంగ్రెస్ కూటమి ఏకపక్షంగా గెలుచుకొని విజయ దుందుభి మోగించింది.…

విద్యార్థుల విద్య, వైద్య సదుపాయాల్లో రాజీ లేదు

– మంత్రి అడ్లూరి హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 12: ఎస్సీ, గిరిజన వసతి గృహాల విద్యార్థుల విద్య, వైద్యం, మౌలిక సదుపాయలలో రాజీ పడేదే లేదని ఎస్సీ అభివృద్ధి, గిరిజన సంక్షేమం, దివ్యాంగులు వయోవృద్ధులు ట్రాన్స్ జెండర్‌ల సాధికారత శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ స్పష్టం చేశారు. సెక్రటేరియట్‌లో ఎస్పీ అభివృద్ధి, గిరిజన సంక్షేమ తదితర…

18 లక్షల మెట్రిక్ టన్నుల అదనపు ధాన్యం తీసుకోండి

– యాసంగి ధాన్యం సేకరణ గడువు రెండు నెలలు పొడిగించండి – బాయిల్డ్ రైస్‌లో అయిదు శాతం నూకకు అనుమతించండి – 2014-15 బకాయిలు రూ.1,468.94 కోట్లు విడుదల చేయండి – కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషికి సీఎం రేవంత్, మంత్రి ఉత్తమ్ వినతి దిల్లీ, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 12: వానాకాలం పంటకు (2025-26 సీజన్)…

రైతుల ప్రయోజనాలపై మోదీ అబద్దాలు

– వాణిజ్య ఒప్పందంపై పెద్ద ఎత్తున నిరసనలు – భారతీయ కిసాన్‌ ‌యూనియన్‌ ‌నేత రాకేశ్‌ ‌టికాయత్‌ ‌న్యూదిల్లీ, ఫిబ్రవరి 12: భారత్‌-అమెరికా మధ్య కుదిరిన వాణిజ్య ఒప్పందానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా అన్ని గ్రామాలలో పెద్ద ఎత్తున నిరసనలు తెలుపుతామని భారతీయ కిసాన్‌ ‌యూనియన్‌(బికెయు) ప్రకటించింది. ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ‌ట్రంప్‌…

రాహుల్‌ ‌గాంధీ సభ్యత్వం రద్దు చేయాలి

– లోక్‌సభలో బీజేపీ ఎంపి నిషికాంత్‌ ‌దూబె తీర్మానం న్యూదిల్లీ, ఫిబ్రవరి 12: కాంగ్రెస్‌ ‌నేత, లోక్‌సభ ప్రతిపక్షనేత రాహుల్‌గాంధీ సభ్యత్వాన్ని రద్దు చేయాలని బిజెపి ఎంపి నిషికాంత్‌ ‌దూబె గురువారం లోక్‌సభలో తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. తన వ్యాఖ్యలతో ఆయన దేశాన్ని తప్పుదోవ పట్టించారని ఆరోపిస్తూ ఈ ‌తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. రాహుల్‌ ‌పార్లమెంటరీ సభ్యత్వాన్ని రద్దు…