prajatantra_news

prajatantra_news

హుజూర్‌నగర్, కోదాడ రహదారులకు మహర్దశ

– 49 కిమీ సింగిల్ రోడ్లు డబుల్‌గా – రూ.130 కోట్లకు ప్రభుత్వ ఆమోదం సూర్యాపేట,ప్రజాతంత్ర, మార్చి 6:  హుజూర్‌నగర్, కోదాడ నియోజకవర్గాల పరిధిలోని ఆర్‌అండ్‌బీ రహదారుల అభివృద్ధికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.  సింగిల్ లైన్‌గా ఉన్న సుమారు 49 కిలోమీటర్ల రహదారులను డబుల్ రోడ్లుగా అభివృద్ధి చేయడానికి మేజర్ డిస్ట్రిక్ట్ రోడ్ ప్లాన్…

తెలంగాణ సొమ్ముతో కేర‌ళ‌లో ప్ర‌చారం

– మ‌రోవైపు ఖ‌జానా ఖాళీ అంటూ దుష్ప్ర‌చారం – తెలంగాణ‌ను ఏటీఎంగా మార్చిన దుర్మార్గ‌పు స‌ర్కారు – కేర‌ళ పేప‌ర్‌కు ఫుల్‌పేజీ యాడ్‌ -హ‌రీష్‌రావు ఆగ్ర‌హం హైద‌రాబాద్, ప్ర‌జాతంత్ర‌, మార్చి 6:  ఇంట్లో ఈగల మోత.. వీధిలో పల్లకి మోత అన్నట్లుంది కాంగ్రెస్ ప్రభుత్వ తీరు అని బీఆర్ఎస్ నాయ‌కుడు హ‌రీష్‌రావు విమ‌ర్శించారు. శుక్ర‌వారం ఆయ‌న…

అమెరికా ఆస్తులపైనే మా దాడులు

– అరబ్ దేశాల్లో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు – ఇరాన్ విదేశాంగ సహాయ మంత్రి సయ్యద్ ఖతీబ్జాదే న్యూదిల్లీ, మార్చి 6 : పశ్చిమాసియాలోని అమెరికా ఆస్తులపై మాత్రమే తాము దాడులు చేస్తున్నామని ఇరాన్ విదేశాంగ సహాయ మంత్రి సయ్యద్ ఖతీబ్జాదే వెల్లడించారు. తమ దాడుల వల్ల పొరుగున ఉన్న అరబ్ దేశాల్లో ఎలాంటి…

‘ప్ర‌జాపాల‌న‌-ప్ర‌గ‌తి ప్ర‌ణాళిక’ ఆర్భాటమే

– అంతా డైవ‌ర్ష‌న్ ప్లాన్ డ్రామా – ప్ర‌జ‌ల ద‌ర‌ఖాస్తులు చెత్త‌బుట్ట‌ల్లోకి – రెండున్న‌రేళ్ల‌లో మీరు చేసిందేమిటి? – బీఆర్ఎస్ నేత హ‌రీష్‌రావు ప్ర‌శ్న‌ హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, మార్చి 6: కాంగ్రెస్ ప్రభుత్వం తలపెట్టిన ‘ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక’ 99 రోజుల యాక్షన్ ప్లాన్ కేవలం దండగ ప్రచార పర్వం తప్ప మరొకటి…

పశ్చిమాసియా యుద్దంలో బాలలు బలి

– 200 మంది చనిపోయినట్లు యూనిసెఫ్ ప్రకటన న్యూదిల్లీ, మార్చి 6 : అమెరికా- ఇజ్రాయెల్, ఇరాన్ దాడులతో పశ్చిమాసియా దద్దరిల్లుతోంది. యుద్ధం కారణంగా ఎంతోమంది ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. వారిలో చిన్నారులు కూడా ఉండటం ఆందోళన కలిగిస్తోంది. యుద్ధం మొదలైన నాటినుంచి దాదాపు 200 మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోయారని యునిసెఫ్ తాజాగా వెల్ల‌డించింది.…

ఎర్ర బంగారంతో ఎరుపెక్కిన ఏనుమాముల

– మార్కెట్లో ఎటు చూసినా మిర్చి బస్తాలే – ధరలు బాగుండడంతో రైతుల హర్షం వరంగల్, ప్రజాతంత్ర, మార్చి 6: వరంగల్ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్‌కు శుక్రవారం భారీగా మిర్చి తరలి వచ్చింది. సుమారు 35 నుంచి 40 వేల బస్తాల మిర్చి అమ్మకానికి రాగా ఈ సీజన్‌లో ఇదే అధికం. దీంతో యార్డులో ఎటు…

వాతావరణ శాఖ కార్యాలయానికి బాంబు బెదిరింపు

– తనిఖీలు చేపట్టి ఫేక్ కాల్‌గా గుర్తింపు హైదరాబాద్, మార్చి 6: విమానాశ్రయాలు, పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాలకు ఇటీవల బాంబు బెదిరింపులు రావడం పరిపాటిగా మారింది. తాజాగా బేగంపేటలో బాంబు బెదిరింపు కలకలం రేపింది. వాతావరణ శాఖ కార్యాలయానికి గుర్తుతెలియని వ్యక్తుల నుంచి బాంబు బెదిరింపు రావడంతో సిబ్బంది, ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. పోలీసులు…

అసంపూర్తిగా అంబర్‌పేట ఫ్లై ఓవర్ సర్వీస్ రోడ్డు

– వెంటనే పూర్తి చేసేలా చర్యలు తీసుకోండి – సీఎం రేవంత్ రెడ్డికి కిషన్ రెడ్డి లేఖ హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 6: అంబర్‌పేట ఫ్లైఓవర్ కింద ఉన్న సర్వీస్ రోడ్డు నిర్మాణంలో ఎదురవుతున్న సమస్యల పరిష్కారానికి సహకరించాలని కోరుతూ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి శుక్రవారం లేఖ రాశారు. హైదరాబాద్ నగరంలో…

తగ్గేదే లేదంటున్న ఇరాన్‌

– ఇ‌జ్రాయిల్‌, అమెరికాలకు దీటుగా జవాబు – మిస్సైళ్లు, డ్రోన్‌లతో విరుచుకు పడుతున్న ఇరాన్‌ -‌ చైనా సహకారంతోనే అంటూ..అంతర్జాతీయ కథనాలు టెహ్రాన్‌,‌ మార్చి 5: ఇరాన్‌పై ఇజ్రాయెల్‌, అమెరికా సంయుక్త దాడుల నేపథ్యంలో ఇరాన్‌ ఇటీవల దీటుగా బదులిస్తోంది. దాడుల్లో ఎక్కడా తగ్గడం లేదు. తమ సుప్రీం నేత అయతుల్లా అలీ ఖమేనీ మృతి…

హైదరాబాద్‌లో మరో రియల్‌ ‌మోసం

– ఫ్లాట్ల పేరుతో జనానికి కుచ్చుటోపీ హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, మార్చి 5: హైదరాబాద్‌ ‌లో మరో రియల్‌ ఎస్టేట్‌ ‌మోసం వెలుగులోకి వచ్చింది. అపార్ట్‌మెంట్ల నిర్మాణం పేరుతో వందల కోట్ల రూపాయలకు త్రిపురా కన్‌‌స్ట్రక్షన్‌ కుచ్చుటోపీ పెట్టింది. ‌దీంతో పోలీసులు ఆ సంస్థ మేనేజింగ్‌ ‌డైరెక్టర్‌ ‌పసుపులేటి సుధాకర్‌, అతని భార్యను అరెస్ట్ ‌చేశారు. మరోవైపు…