ఆంధ్రపత్రిక అండదండలతో రజాకార్లతో పోరాడిన యం యస్ ఆచార్య

రజాకర్ల ఆగడాలు పెచ్చుపెరిగి వారు విచ్చల విడిగా స్వైర విహారం చేస్తున్న రోజులవి, చాలాకుటుంబాలు, పట్టణాలు, పల్లెలు విడిచి సరిహద్దు ప్రాంతాలకు వలస వెళ్తున్నారు. ఆచార్యగారి కుటుంబం కూడా గుంటూరు జిల్లాకు తరలి వెళ్లింది. కాని ఆచార్యగారు మాత్రం వరంగల్లోనే ఉండిపోయారు. ముస్తాలశంకరరావుతో కలిసి పల్లెర్ల చంద్రమౌళిగారింట్లో ఆయన అద్దెకుండేవారు. వార్తాపత్రిక లపంపిణీ, వార్తలసేకరణ వారి…









