NEWS

NEWS

గుల్జార్‌.. ఓ సంగీత సాహిత్య ప్రవాహం!

‘‘ఉదయపు పూజలో మీరు చెప్పే శ్లోకం మొదలు సైకిల్పై ఈలలు వేస్తూ వస్తున్న పాల వ్యాపారి, భిక్షాటన చేస్తూ ఫకీర్‌ పాడుతున్నప్పుడు , వంటగది చుట్టూ అమ్మ హమ్‌ చేసే వరకు సంగీతం మన మనసు లోపల ఖాళీలను సహజంగా నింపుతుందని,  అది మనకు ఎప్పుడూ ప్రియంగానే ఉంటుందని   సంగీతం గురించి….’’ మీరు మీ…

గుండెల్లోని భావాగ్ని…

నవ్యత వైపు వేసే ప్రతి అడుగూ ఎంతగానో ఆలోచింపజేస్తుంది. కాలానుగుణమైన మార్పులను స్వీకరించి ముందుకు సాగడం కవిత్వ లక్ష్యం, లక్షణం కావాలి. బలీయమైన భావనాశక్తితో వస్తువు, విషయ నిష్టత, శబ్ద శక్తి కలిగి రమణీయమైన శైలితో వెలువడే కవిత్వం కలకాలం నిలిచిపోతుంది. నవనవోన్మేషమైన తాత్త్విక సంయోజనా నిపుణతను కలిగిన కవి రమణీయాక్షర  పరిమళాలను అద్ది ఉదాత్తమైన…

మేడారం జాతర ఆత్మగౌరవ ప్రతీక

మాజీ సిఎం కెసిఆర్‌ శుభాకాంక్షలు భక్తులకు ఇబ్బందులు కలుగకుండా చూడాలని ప్రభుత్వానికి సూచన హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 22 : తెలంగాణ ఆత్మగౌరవ పోరాటానికి చారిత్రక ప్రతీకలుగా, ఇలవేల్పులుగా సబ్బండ వర్గాలచేత పూజలందుకుంటున్న మేడారం సమ్మక్క సారలమ్మ మహా జాతర సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్‌ అధినేత కె. చంద్రశేఖర్‌ రావు శుభాకాంక్షలు తెలిపారు. ఈ…

‘మేడారం’కు జాతీయ హోదా అంటూ ఏదీ ఉండదు

జాతీయ స్థాయి గుర్తింపునకు చర్యలు సారలమ్మను దర్శించుకున్న కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి మంత్రి వ్యాఖ్యలపై మండిపడ్డ కాంగ్రెస్‌, బిఆర్‌ఎస్‌ నేతలు ములుగు, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 22 : మేడారం జాతరను జాతీయ హోదా పండుగగా గుర్తించలేమంటూ కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. దీనికి జాతీయహోదా అంటూ ఏదీ లేదన్నారు. మేడారం జాతరపై కేంద్రానికి ఎలాంటి…

తాగు నీటి సరఫరాకే తొలి ప్రాధాన్యం…

వేసవిలో నీటి ఎద్దడి తలెత్తకుండా కార్యాచరణ ప్రణాళిక సాగర్‌ నుంచి ఏపీ సాగు నీటికి నీరు తరలించకుండా చర్యలు అవసరమైన తాగు నీటి విడుదలకు కేఆర్‌ఎంబీకి లేఖ నిరుపయోగంగా నీటి వనరుల పునరుద్ధరణకు చర్యలు పంచాయతీరాజ్‌, పట్టణాభివృద్ధి, పురపాలక, నీటిపారుదల శాఖలు కలిసి పని చేయాలి జీహెచ్‌ఎంసీ పరిధిలోనూ తాగునీటి సమస్య లేకుండా చర్యలు తాగు…

27 లేదా 29 నుంచి మరో రెండు గ్యారంటీల అమలు

గృహలక్ష్మి, గ్యాస్‌ సిలిండర్‌ పథకాల ప్రారంభం     విధి విధానాలపై కేబినేట్‌ సబ్‌ కమిటీతో సీఎం రేవంత్‌ రెడ్డి సమీక్ష  అర్హులందరికీ అందేలా పకడ్బందీ చర్యలకు అధికారులకు సిఎం ఆదేశం హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 22 : గృహలక్ష్మి, రూ.500లకు గ్యాస్‌ సిలిండర్‌ పథకాల అమలుకు వెంటనే సన్నాహాలు చేయాలని ముఖ్యమంత్రి ఏ.రేవంత్‌ రెడ్డి…

నేడు మేడారం జాతరకు సిఎం రేవంత్‌

భారీగా ఏర్పాట్లు  చేసిన అధికారులు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 22 : నేడు మేడారం జాతరకు ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి రానున్నారు. హైదరాబాద్‌ నుంచి హెలికాప్టర్‌లో ఆయన మేడారం జాతరకు చేరుకుంటారు. ముఖ్యమంత్రి రాక సంధర్భంగా అధికారులు ఇప్పటికే కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. సామాన్య భక్తులతో పాటు విఐపీలు కూడా జాతరకు రానున్నందున అధికారులు పెద్ద…

గొర్రెల పంపిణీలో కుంభకోణం

నలుగురు ఉద్యోగులను అరెస్ట్‌ చేసిన ఎసిబి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 22 : గొర్రెల పంపిణీ స్కామ్‌లో నలుగురు ప్రభుత్వ ఉద్యోగులను ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. వీరిలో కామారెడ్డి వెటర్నరీ ఆసుపత్రి అసిస్టెంట్‌ డైరెక్టర్‌ రవి, మేడ్చల్‌ పశుసంవర్థకశాఖ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ ఆదిత్య, రంగారెడ్డి జిల్లా భూగర్భ జల అధికారి రఘుపతిరెడ్డి, వయోజన విద్య…

కొలువుదీరిన వనదేవతలు

ఉద్విగ్నభరిత  క్షణాల మధ్య  చిలుకల గుట్ట నుంచి సమ్మక్కను తీసుకువచ్చిన పూజారులు అమ్మవారి రాకకు సూచనగా గన్‌తో గాలిలోకి కాల్పులు జరిపిన ములుగు ఎస్పీ శబరీష్‌ చిలుకల గుట్ట వద్ద అమ్మవారికి అధికారికంగా ఘనస్వాగతం పలికిన మంత్రి సీతక్క, అధికారులు జనసంద్రంగా మారిన జంపన్నవాగు, జాతర ప్రాంగణం గద్దెలపై కొలువుదీరిన సమ్మక్క, సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజులు…

కరెంట్ కట్ చేస్తే.. సస్పెండ్..

విద్యుత్​ అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యంపై సీఎం ఆగ్రహం ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చే కుట్రలను సహించేది లేదని హెచ్చరిక రాష్ట్రంలో ఎక్కడైనా అకారణంగా విద్యుత్ స‌ర‌ఫ‌రాకు అంతరాయం కలిగితే బాధ్యులైన అధికారులు, సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుంటామని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి హెచ్చరించారు. ఇప్పుడున్న అవసరాలకు సరిపడేంత విద్యుత్తును ప్రభుత్వం సరఫరా చేస్తోందని, ప్రభుత్వం తరఫున…