Take a fresh look at your lifestyle.

25‌మంది ఎంపిలను ఇస్తే హోదా తెస్తానన్నాడు

  • విభజన సమస్యలు పరిష్కరిస్తానని చెప్పాడు
  • హా ఇచ్చిన జగన్‌ ఇప్పు‌డు ఎందుకు మాట్లాడరు
  • తెలంగాణ సిఎం కెసిఆర్‌తో కుమ్మక్కు రాజకీయాలు
  • ముస్లిం మైనార్టీలకు ఎన్నో పథకాలు అమలు చేశాం
  • యువగళం పాదయాత్రలో లోకేశ్‌ ‌మైనార్టీలతో భేటీ

తిరుపతి,మార్చి2 : తెలంగాణ సిఎం కేసీఆర్‌తో జగన్‌ ‌కుమ్మక్కయ్యారని.. అందుకే ఆంధ్రప్రదేశ్‌ ‌హక్కుల కోసం సిఎం జగన్‌ ‌కానీ, మంత్రులు, వైసిపి నేతలు తెలంగాణలో, ఢిల్లీలో నోరు మెదపడం లేదని టీడీపీ యువనేత నారా లోకేష్‌ ‌విమర్శించారు. మాకూ 25 మంది ఎంపీలను ఇవ్వండి, ప్రత్యేక హోదా మాత్రమే కాదు విభజన చట్టంలోని ప్రతి అంశం పైన పోరాడుతామన్న జగన్‌ ఇప్పు‌డు ఏం చేస్తున్నారని అన్నారు. ఎందుకు ప్రత్యేకమోదా, విభజన హాలపై పోరాడడం లేదన్నారు. టీడీపీ యువనేత నారా లోకేష్‌ ‌యువగళం పాదయాత్ర జిల్లాలో కొనసాగుతోంది. చంద్రగిరి నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తున్న లోకేశ్‌ ‌దామలచెరువులో ముస్లింలతో ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగామాట్లాడుతూ.. జగన్‌  25 ‌మంది ఎంపీలను ఇవ్వండి ప్రత్యేక హోదా తెస్తానన్నాడు. దీక్ష చేశారు. ధర్నా చేశారు. ఈరోజు ఆ ధర్నాలు ఏమైంది.

ఒక రోజైనా ప్రత్యేక హోదా కోసం మాట్లాడాడా? అని ప్రశ్నించారు. అయితే మాకూ 25 మంది ఎంపీలను ఇవ్వండి, ప్రత్యేక హోదా మాత్రమే కాదు విభజన చట్టంలోని ప్రతి అంశంపైన పోరాడుతామన్నారు.  అవసరమైతే న్యాయపోరాటం కూడా చేస్తామని లోకేష్‌ ‌హా ఇచ్చారు.  ఉర్దూ టీచర్‌ ‌పోస్టులు నుంచి హజ్‌ ‌యాత్రకు సహాయం వరకు మైనారిటీల కోసం తాము ఎన్నో చేశామని గుర్తుచేశారు. మేము చేసినవి ప్రచారం చేసుకోలేదు అదే మేం చేసిన తప్పని అన్నారు. ముస్లిముల కోసం టీడీపీ ఏం చేసింది..ఈ నాలుగేళ్లలో వైసీపీ  ఏం చేసిందనే విషయంపై ఉప ముఖ్యమంత్రితో చర్చకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు. ఎక్కడికి వస్తారో ఎప్పుడో చెప్తే తాను చర్చకు సిద్ధమని యువనేత సవాల్‌ ‌విసిరారు.అధికారంలోకి వచ్చిన ఏడాదిలోపు తాము ఇస్లామిక్‌ ‌బ్యాంకు ఏర్పాటు చేస్తామని తెలిపారు. కర్ణాటకలో డీకేటీ పట్టాలపై ఉన్న చట్టాన్ని అధ్యయనం చేసి ఇక్కడ కూడా డీకేటీపై మంచి చట్టాన్ని తీసుకొస్తా మన్నారు. ఫోన్లో బటన్‌ ‌నొక్కితే అన్ని వస్తువులు వస్తున్నాయని… అలాగే సంక్షేమ పథకాలు గాని ప్రభుత్వ స్పందన గాని ఫోన్‌ ‌నొక్కితే జరిగేలా చేస్తామని చెప్పారు. బిడ్డ పుట్టినప్పుడు బర్త్ ‌సర్టిఫికెట్‌ ఇచ్చిన వెంటనే క్యాస్ట్ ‌సర్టిఫికెట్‌ ‌కూడా ఆటోమేటిక్గా ఫోన్లో బటన్‌ ‌నొక్కితే వచ్చేలా ఏర్పాటు చేస్తామని హా ఇచ్చారు. ఉపాధి హా నిధులతో కబరిస్తాన్‌ల కాంపౌండ్‌ ‌వాల్‌లను నిర్మిస్తామన్నారు.

Leave a Reply