ఆగమవుతున్న అన్నదాత.. ఆదుకోలేకపోతున్న ప్రభుత్వం

యాసంగి పంటను అమ్ముకోవడంలో అన్నదాతలు ఆగమాగమవుతున్నారు. వర్షాకాలం పంటకు సిద్దం కావాల్సిఉండగా ఇంకా కొనుగోలు కేంద్రాలవద్దనే వారి కాలం గడిచిపోతున్నది. వరికోతలు పూర్తిఅయి నెలలు కావస్తున్నా ఎక్కడ వేసిన కుప్పులు అక్కడే ఉంటున్నాయి. తమ ధాన్యం ఎప్పుడు కొనుగోలు అవుతుందో తెలియని పరిస్థితిలో వారు కొట్టుమిట్టాడుతున్నారు. ఇది ఏ ఒక్క ప్రాంతానికో జిల్లాకు పరిమితమైన సమస్యకాదు.…

