సిట్టింగ్ జడ్జితో విచారణకు..కెటిఆర్ రాజీనామాకు బండి సంజయ్ డిమాండ్
గన్ పార్క్ వద్ద రాష్ట్ర బిజెపి చీఫ్ దీక్ష…హైటెన్షన్ వాతావరణం
బండి సంజయ్, ఈటల అరెస్ట్
కాంగ్రెస్ ఆధ్వర్యంలో టీఎస్పీఎస్సీ ముట్టడికి పిలుపు
పెద్ద ఎత్తున కార్యకర్తల ర్యాలీ….అడ్డుకున్న పోలీసులు
: పేపర్ లీకేజీపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని, అలాగే మంత్రి కేటీఆర్ను బర్తరఫ్ చేయాలనీ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ డిమాండ్ చేశారు. శుక్రవారం పేపర్ లీకేజీ వ్యవహారాన్ని నిరసిస్తూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ దీక్షకు దిగారు. ఈ క్రమంలో ఆయన అమరవీరుల స్మారక స్థూపానికి నివాళులు అర్పించడానికి బీజేపీ కార్యాలయం నుంచి కాలినడకన బయలుదేగా ఆయనను పోలీసులు అడ్డుకున్నారు. బండి సంజయ్ దీక్ష నేపథ్యంలో గన్ పార్క్ వద్ద భారీగా పోలీసులు మోహరించారు. అయితే అమరవీరుల స్మారక స్థూపానికి నివాళులు అర్పించడానికి ఎలాంటి అనుమతులు అవసరం లేదని బండి సంజయ్ పోలీసులతో వాగ్వివాదానికి దిగారు. ఇక అక్కడి నుంచి గన్ పార్క్కు చేరుకున్న బండి సంజయ్ అధికార బీఆర్ఎస్పై మండిపడ్డారు. నిరుద్యోగుల జీవితాలను నాశనం చేస్తున్న కేసీఆర్ పాలన ‘‘ఇక సాలు దొర సెలవు దొర’’ అంటూ బీజేపీ కార్యకర్తలు నిరసన గళం వినిపించారు. ఈ క్రమంలో పోలీసులకు, బీజేపీ కార్యకర్తలకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. దీనితో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈటల రాజేందర్ మాట్లాడుతుండగానే పోలీసులు మైక్ కట్ చేశారు. టీఎస్పీఎస్సీ కార్యాలయం వైపు వెళ్లకుండా బండి సంజయ్, ఈటలను అడ్డుకున్నారు. దీంతో.. అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఆ ఇద్దరికి రక్షణగా కార్యకర్తలు, మహిళలు అక్కడికి చేరుకున్నారు. ఈ క్రమంలో పోలీసులు, కార్యకర్తల మధ్య తీవ్రస్థాయిలో పెనుగులాట చోటు చేసుకుంది. బండి సంజయ్ దీక్షను భగ్నం చేసేందుకు పోలీసులు ప్రయత్నించగా..పోలీసులు గో బ్యాక్..కేసీఆర్ డౌన్ డౌన్ అంటూ బీజేపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున నిరసనలు తెలిపారు. దీక్షా స్థలిని వదిలి వెళ్లాలని..ప్రజలు ట్రాఫిక్తో ఇబ్బంది పడుతున్నారని పోలీసులు చెప్పగా..తాము ప్రశాంతంగా దీక్ష చేస్తున్నామని బండి సంజయ్ చెప్పుకొచ్చారు. కార్యకర్తలను బలవంతంగా తరలిస్తే తీవ్ర పరిణామాలుంటాయని బండి హెచ్చరించారు. అయితే దీక్షలో పాల్గొన్న బండి సంజయ్ను, బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ సహా పలువురు నాయకులూ, కార్యకర్తలను పోలీసులు గన్ పార్క్ వద్ద అరెస్ట్ చేశారు.
కాంగ్రెస్ టిఎస్పిఎస్సి ముట్టడిని అడ్డుకున్న పోలీసులు
శుక్రవారం కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఛలో టీఎస్పీఎస్సీ ముట్టడికి పిలుపునిచ్చిన నేపథ్యంలో గాంధీభవన్ దగ్గర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పెద్ద ఎత్తున కాంగ్రెస్ కార్యకర్తలు గాంధీభవన్ నుండి ముట్టడికి వెళ్తుండగా పోలీసులు వారిని అడ్డుకున్నారు. అలాగే బారికేడ్ల్లు ఏర్పాటు చేసి వారిని అడ్డుకున్నారు. కాగా టీఎస్పీఎస్సీ కార్యాలయం వద్ద 144 సెక్షన్ అమలులో ఉన్న సంగతి తెలిసిందే. ఇక కొన్ని రోజులుగా పేపర్ లీకేజి వ్యవహారం రాష్ట్రంలో దుమారం రేపుతుంది. దీనితో ప్రతిపక్షాలు అధికార పార్టీ నిర్లక్ష్యంపై ముట్టడికి పిలుపునిస్తున్నాయి. శుక్రవారం ఉదయం షర్మిల, ఆర్ఎస్ ప్రవీణ్ కూడా టీఎస్పీఎస్సీ ముట్టడికి పిలుపునివ్వగా..వారిని పోలీసులు అరెస్ట్ చేశారు.
కాంగ్రెస్ టిఎస్పిఎస్సి ముట్టడిని అడ్డుకున్న పోలీసులుశుక్రవారం కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఛలో టీఎస్పీఎస్సీ ముట్టడికి పిలుపునిచ్చిన నేపథ్యంలో గాంధీభవన్ దగ్గర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పెద్ద ఎత్తున కాంగ్రెస్ కార్యకర్తలు గాంధీభవన్ నుండి ముట్టడికి వెళ్తుండగా పోలీసులు వారిని అడ్డుకున్నారు. అలాగే బారికేడ్ల్లు ఏర్పాటు చేసి వారిని అడ్డుకున్నారు. కాగా టీఎస్పీఎస్సీ కార్యాలయం వద్ద 144 సెక్షన్ అమలులో ఉన్న సంగతి తెలిసిందే. ఇక కొన్ని రోజులుగా పేపర్ లీకేజి వ్యవహారం రాష్ట్రంలో దుమారం రేపుతుంది. దీనితో ప్రతిపక్షాలు అధికార పార్టీ నిర్లక్ష్యంపై ముట్టడికి పిలుపునిస్తున్నాయి. శుక్రవారం ఉదయం షర్మిల, ఆర్ఎస్ ప్రవీణ్ కూడా టీఎస్పీఎస్సీ ముట్టడికి పిలుపునివ్వగా..వారిని పోలీసులు అరెస్ట్ చేశారు.




