సైకిల్ అనగానే అందరికీ అందమైన అపురూపమైన ఎన్నో మధుర జ్ఞాపకాలు గుర్తుకొస్తాయి. చదువుకునే రోజుల్లో ఇంటి ముందు నాన్న సైకిల్ పెడితే దాన్ని తీసుకుని తొక్కుకుంటూ స్నేహితుల ఇంటికి చక్కర్లు కొట్టిన జ్ఞాపకాలు అందరి మనసులో పదిలంగా ఉండనే ఉంటాయి.సైకిల్ నేర్చుకోవడానికి పడిన కష్టాలు మోకాళ్లు చేతులకు దెబ్బలు తగిలించుకొని అమ్మానాన్నలతో తిట్లు తిన్న జ్ఞాపకాలు కోకొల్లలు. ఆ కాలంలో స్కూల్ కాలేజీలకు వెళ్లాలంటే సైకిలే మంచి వాహనం. సైకిల్ టైర్ గుండ్రంగా తిరుగుతూ పరిగెడుతుంటే పాంబండి అనేవారు ముసలివాళ్ళు. అలాంటి సైకిల్ పుట్టినరోజు నేడు.దాని చరిత్రను తెలుసుకుందాం మరి.
సైకిల్ ను ప్రత్యేకంగా ఒక్కరే కనిపెట్టారని చెప్పడం చాలా కష్టం. వివిధ సంవత్సరాల్లో వివిధ రకాలైన ఆకారాలతో సైకిల్ ను తయారు చేశారు. దానికి మార్పులు చేర్పులు అనేకం జరిగాయి. మొదటిసారిగా ఇటలీ దేశానికి చెందిన ఇంజనీరు జియోనావా ఫాంటానా నాలుగు చక్రాల తో సైకిల్ ను తయారు చేశారు. నడపడానికి సులభంగా ఉండడం కోసం ఇతని ఆవిష్కరణ ప్రపంచాన్ని ఆకర్షించ లేకపోయింది. కొన్ని సంవత్సరాల తర్వాత కాల్ ఫెరిక్ వాట్రియస్ రెండు చక్రాల తో పెడల్ లేకుండా తయారు చేశాడు. కాళ్లతో తోసుకుంటూ పోయే విధంగా ఉండేది. యూరప్ లో ఆసైకిల్ ని హాబీ హార్స్ అని పిలిచేవారు. ఆ తర్వాత మెక్ మిలన్ ఇనుము తో మొదటి చక్రానికి ఫిడెల్ అమర్చి, బ్యాలెన్స్ స్టీరింగ్ స్టీరింగ్ ను అమర్చాడు. దీంతో . సైకిల్ బరువు 26 కేజీల వరకు పెరిగింది.1870 నుండి సంవత్సరములు సైకిల్ కు రబ్బర్ టైర్లు పెట్టడం ప్రారంభించారు అమెరికాకు చెందిన పెన్నీ ప్యాట్నింగ్ రబ్బర్ టైర్లతో సైకిల్ రూపొందించాడు ముందు చక్రం పెద్దగా ఉండటంతో కొంచెం తొక్కితే చాలా దూరం ప్రయాణం చేసేది. కానీ బ్యాలెన్స్ ఆపలేక కింద పడి పోయే వారు.
యాక్సిడెంట్లు ఎక్కువగా జరిగేవి యాక్సిడెంట్లు ఎక్కువగా జరిగేవి. 1890లో జెకమ్ స్టార్లే సురక్షితమైన సౌకర్యవంతమైన సైకిల్ ను తయారు చేశాడు. ఫెడల్ ముందు చక్రానికి మార్చి నుండి వెనక చక్రానికి మార్చారు. సౌకర్యవంతంగా ఈజీ గా ఉన్నటువంటి సైకిల్ రూపొందించబడింది. ప్రపంచ వ్యాప్తంగా 1920 లో చిన్న పిల్లల కోసం సైకిల్ తయారు చేయడం ప్రారంభించారు. 1960 నుండి రేసింగ్ సైకిళ్లను కూడా ఆవిష్కరించారు. ఇప్పుడు రకరకాల సైకిల్ చిన్నలకు పెద్దలకు వ్యాయామం చేసుకోవడానికి రకరకాలుగా అందుబాటులోకి వచ్చాయి .గేర్ ఎలక్ట్రానిక్ బ్యాటరీ తో నడిచే సైకిల్ సైతం అందుబాటులో ఉన్నాయి. వాటికి ట్యాకర్లు కూడా ఏర్పాటు చేసి దొంగిలించబడినప్పుడు కనిపెట్టే సౌకర్యం కోసం అధునాతన పద్ధతులతో సైకిల్ ను తయారు చేస్తున్నారు.
పూర్వం కొన్ని సంవత్సరాల క్రితం సైకిల్ వాడకం ఎక్కువగా ఉండేది. ఇంటికి ఒక సైకిల్ తప్పకుండా ఉండేది. ఇప్పుడు వాటి స్థానంలో స్కూటర్ బైకులు కార్లు వచ్చాయి ఆటోలు వచ్చాయి కొంత కాలం సైకిల్ వాడకం తగ్గింది. మళ్లీ ఇప్పుడు ఆరోగ్యరీత్యా అందరూ సైకిల్ ను ఆదరిస్తున్నారు. మనిషి సంతోషంగా ఉండాలంటే శాంతం కావాలి.ఆరోగ్యంగా ఉండాలంటే వ్యాయామం కావాలి. అందుకే వ్యాయామ వస్తువుగా ఇప్పుడు సైకిల్ ఈ సమాజంలో చలామణి అవుతుంది.ప్రతిరోజు కనీసం ప్రతి రోజూ 30 నిమిషాల పాటు సైకిల్ తొక్కితే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. శరీరంలో చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించి మంచి కొలెస్ట్రాల్ ను పెంచుతుంది. గుండెకు మేలు చేస్తుంది, మానసిక ప్రశాంతత పెంచుతుంది. డిప్రెషన్ ను తగ్గిస్తుంది.
మానసికోల్లాసం ఇస్తుంది. మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది. జ్ఞాపకశక్తిని పెంచుతుంది మతిమరుపును తగ్గిస్తుంది. శరీర బరువును తగ్గిస్తుంది. ఉదరం క్రింది భాగాల కండరాలకు మేలు చేస్తుంది. రోగనిరోధకశక్తిని పెంచుతుంది. డయాబెటిస్ ఉన్నవారు సైకిల్ తొక్కితే షుగర్ లెవెల్స్ సైతం కంట్రోల్లో ఉంటాయి. బీపీని అదుపులో ఉంచుతుంది. క్యాన్సర్ ను కొంత వరకు తగ్గిస్తుంది. రక్తప్రసరణలో సాఫీగా జరిగి చర్మం అందంగా, కాంతివంతంగా కనిపిస్తుంది.
ఆరోగ్యమే కాకుండా ఆర్థిక లాభాలు కూడా ఎన్నో ఉన్నాయి. సైకిల్ వాడటం వలన పెట్రోల్ వాడకం తగ్గించి పర్యావరణాన్ని పరిరక్షించవచ్చు. డబ్బులు కూడా ఆదా అవుతాయి. హాస్పిటల్ ఖర్చులు కూడా తగ్గి ఆర్థిక పరిపుష్టి ఏర్పడుతుంది.చిన్న చిన్న పనులకు సైకిల్ వాడటం వల్ల ధ్వని కాలుష్యం ట్రాఫిక్ సమస్య పార్కింగ్ సమస్యను నుండి అధిగమించవచ్చు. ముఖ్యంగా రోడ్డు ప్రమాదాలు కొంత వరకు తగ్గించవచ్చు.ఈమధ్య మంతుడు సినిమా తో సైకిల్ యొక్క రేంజ్ ఒక లెవెల్ లో పెరిగిపోయింది. సైకిల్ పై రేసింగ్ లు కూడా జోరుగానే సాగుతున్నాయి. మన హైదరాబాద్ అబ్బాయి సాయి చైతన్య 23 సంవత్సరాలు 10 గంటల లోపు 225 కిలోమీటర్లు ప్రయాణించి ఇంతకుముందు ఉన్న రికార్డును బద్దలుకొట్టి సరికొత్త వరల్డ్ రికార్డు కూడా సొంతం చేసుకున్నాడు. ఈ విధంగా యువతలో కూడా సైకిల్ పైన మమకారం ఏర్పడింది.ఏది ఏమైనా ఇంకా మంచి మంచి అధునాతనమైన పద్ధతుల్లో సైకిల్ రావాలని కోరుకుందాం.ఎంతైనా ఓల్డ్ ఇస్ గోల్డ్ కదా మరి.
– కొమ్మాల సంధ్య, తెలుగు అధ్యాపకురాలు
సమ్మక్క సారక్క తాడ్వాయి, ములుగు జిల్లా
9154068272