రాహుల్‌ ‌గాంధీకి స్వాగతం…

  • రైతులకు తెలంగాణలో అమలవుతున్న పథకాలను స్టడీ చేసి… కాంగ్రెస్‌ ‌పాలిత రాష్ట్రాల్లో అమలు చేయండి
  • రాహుల్‌ ‌పర్యటన సందర్భంగా మంత్రి కెటిఆర్‌ ‌ట్వీట్‌
  • ‌పార్లమెంట్‌లో తెలంగాణ సమస్యలను ఎన్నిసార్లు ప్రస్తావించారు : ట్వీట్‌ ‌ద్వారా రాహుల్‌ ‌గాంధీకి కవిత ప్రశ్న

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, మే 6 : తెలంగాణకు వొస్తున్న రాహుల్‌ ‌గాంధీకి స్వాగతం పలుకుతున్నామని తన ట్వీట్‌ ‌ద్వారా కేటీఆర్‌ ‌తెలిపారు. రైతులకు తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలపై స్టడీ చేయాలని సూచించారు. కాంగ్రెస్‌ ‌పాలిత రాష్ట్రాల్లో తెలంగాణ పథకాలు అమలు చేయాలని కేటీఆర్‌ ‌సూచించారు. ఇక ట్విట్టర్‌ ‌వేదికగా కేంద్రంలోని ఎన్‌డీఏ ప్రభుత్వంపై, అంతకు ముందు పది సంవత్సరాలు పాలించిన ఎన్‌పిఏపై కెటిఆర్‌ ‌మరోసారి మండిపడ్డారు. ఎన్‌పీఏ((పనికిరాని ఆస్తి- నాన్‌ ‌పర్ఫార్మింగ్‌ అసెట్‌) ‌గవర్నమెంట్‌లో భారతదేశ ఎకాన నాశనమైందని ధ్వజమెత్తారు. ద్రవ్యోల్బణం 30 ఏండ్ల గరిష్ఠానికి వెళ్లింది. ఎల్‌పీజీ సిలిండర్‌ ‌ధర ప్రపంచంలోనే అత్యధికం. 45 ఏండ్లలో అత్యధికంగా నిరుద్యోగ రేటు పెంచారని మండిపడ్డారు. అలాంటి వారు తెలంగాణకు వొచ్చి తమకు నీతులు చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. రాహుల్‌ ‌గాంధీకి ఎమ్మెల్సీ కవిత కూడా తన ట్వీట్‌ ‌ద్వారా ప్రశ్నాస్త్రాలు సంధించారు. రు కానీ,  పార్టీ కానీ పార్లమెంటులో తెలంగాణ అంశాలు, హక్కులను ఎన్నిసార్లు ప్రస్తావించారో చెప్పాలని డిమాండ్‌ ‌చేశారు. రాష్ట్ర హక్కుల కోసం టీఆర్‌ఎస్‌ ‌పోరాడుతుంటే రాహుల్‌ ఎక్కడ ఉన్నారని ప్రశ్నించారు.

దేశవ్యాప్తంగా వరి కొనుగోలు విధానం ఒకేలా ఉండాలని తాము పోరాడుతున్నప్పుడు ఎక్కడికిపోయారని, తెలంగాణ ప్రాజెక్టులకు రావాల్సిన జాతీయ హోదా, రాష్ట్రానికి రావాల్సిన జీఎస్టీ బకాయిలు, నిధుల గురించి టీఆర్‌ఎస్‌ ‌పార్టీ పోరాటం చేస్తున్నప్పుడు, కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం తెలంగాణకు విద్యాసంస్థలు ఇవ్వకుండా మొండి చేయి చూపిస్తున్నప్పుడు ఎక్కడున్నారని ఎమ్మెల్సీ కవిత నిలదీశారు. ఈ మేరకు  రాహుల్‌ ‌గాంధీ పర్యటనపై ఎమ్మెల్సీ కవిత తన ట్వీట్‌ ‌ద్వారా.. గౌరవ రాహుల్‌ ‌గాంధీ, రు కానీ  పార్టీ కానీ ఎన్నిసార్లు పార్లమెంట్‌లో తెలంగాణ అంశాలను, హక్కులను ప్రస్తావించారో చెప్పండంటూ ప్రశ్నలు సంధించారు. సీఎం కేసీఆర్‌ ‌ప్రవేశపెట్టిన రైతుబంధు, రైతు బీమా, కల్యాణలక్ష్మి, ఆరోగ్యలక్ష్మి, ఆసరా వంటి పథకాలపై ఆరాతీసి అవి తెలంగాణ ముఖచిత్రాన్ని ఎలా మార్చాయో  తెలంగాణ కాంగ్రెస్‌ ‌నాయకులను అడిగి తెలుసుకోండి. సీఎం కేసీఆర్‌   ‌ప్రవేశపెట్టిన పథకాలను స్పూర్తిగా తీసుకుని 11 రాష్టాల్రు అమలు చేస్తున్నాయి. వాటి గురించి నేర్చుకుని అర్థం చేసుకోవడానికి కు కూడా తెలంగాణకు స్వాగతం అంటూ కవిత ట్వీట్‌ ‌చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page