నవభారతం: తదుపరి 10 సంవత్సరాలు – సాంకేతిక దశాబ్ది- ‘టెకేడ్‌’ ‌గా పరివర్తన

“మనం నేడు కొన్ని ఆసక్తికరమైన పరిస్థితుల మధ్య జీవిస్తున్నాం. కోవిడ్‌ ‌తర్వాత మరియు ఇటీవలి రష్యా-ఉక్రెయిన్‌ ‌యుద్ధం… ఈ నేపథ్యంలో మన చుట్టూ ఉన్న ప్రపంచం సాంకేతిక మార్పులకు మార్గాలను వెతుకుతోంది. కోవిడ్‌ అనంతర అభివృద్ధి చెందుతున్న భారతదేశం మరింత ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్తోంది. కోట్లాది మంది భారతీయ యువకుల శక్తి మరియు అభిరుచి ద్వారా దాని కొత్త ఆశయాలతో ముందుకు వెళ్తోంది.”

మానవజాతి చరిత్రలో ఎన్నడూ లేనంత భయంకరమైన మహమ్మారి నుండి ప్రపంచం నెమ్మదిగా బయటపడుతోంది. ఇది ప్రపంచవ్యాప్తంగా జీవితాలను, జీవనోపాధిని • ఆర్థిక వ్యవస్థలను విస్తృతంగా దెబ్బతీసింది. ప్రపంచ జనాభాలో దాదాపు 1/6 వ వంతు ఉన్న భారతదేశం కూడా గత 24 నెలల్లో అపారమైన సవాళ్లను ఎదుర్కొంది. ఒక మనిషి సామర్థ్యాలను లెక్క కట్టాలంటే సౌకర్యవంతం, అనువైన పరిస్థితుల్లో ఎలా ఉన్నాడు అని కాకుండా, సవాళ్లు, వివాదాల నడుమ తాను ఎలా పయనం సాగించాడన్నది ముఖ్యం. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలో భారత్‌ … ‌మహమ్మారి సమయంలో కూడా కోవిడ్‌ ‌నిర్వహణ చర్యల ద్వారా ఎలా కిందపడి  వేగంతో పైకి వచ్చిందో ప్రపంచమంతా గుర్తించింది. ప్రశంసలు కురిపించింది. మన ప్రధానమంత్రి ముందుండి నడిపించారు, ముందు వరుస యోధులతో దృఢంగా నిలబడ్డారు.. భారత్‌ ‌లోనే వ్యాక్సిన్‌లను అభివృద్ధి చేయడంలో శాస్త్రవేత్తలను ప్రోత్సహించారు. ఈ దేశానికి ఆత్మనిర్భర్‌ ‌భారత్‌ ‌లేదా స్వయం సమృద్ధి ద్వారా కొత్త దృష్టి కోణాన్ని, కొత్త ఆర్థిక ఆలోచనను అందించారు . సరిహద్దుల్లో చైనా చేసిన బెదిరింపులు మరియు యుద్ధ కవ్వింపులకు కూడా ఒక  సంకల్పం మరియు విశ్వాసంతో ప్రతిస్పందించింది భారత్‌. ఇది స్వాతంత్య్ర శతాబ్ది దినోత్సవ వేడుకల దిశగా రాబోయే 25 సంవత్సరాల కోసం అమృత్‌కాల్‌ – ‌భారతదేశ ప్రయాణానికి మార్గం సుగమం చేస్తుంది.

మహమ్మారికి ముందు సంవత్సరాలలో ప్రభుత్వం  సంస్కరణలు మరియు విధానాల కారణంగా మళ్ళీ స్థిర చిత్తంతో పుంజుకోవడం చిన్న విషయం కాదు. డిజిటల్‌ ఇం‌డియా, ఆర్థిక రంగాన్ని ప్రక్షాళించడం మొదలైన కార్యక్రమాలు.. భారతదేశం స్థితిస్థాపక ప్రతిస్పందనను నిర్ధారించడంలో పెద్ద కారకాలు. మహమ్మారి సమయంలో  ప్రకటించిన సంస్కరణలు, బాగా క్రమాంకనం చేయబడిన ఉద్దీపన ప్యాకేజీల ఫలితంగా, భారతదేశం ఇప్పుడు ప్రపంచంలోనే అత్యంత వేగంగా పుంజుకుంటున్న ఆర్థిక వ్యవస్థగా అవతరించింది, అత్యధిక ఎఫ్‌ ‌డి ఐ లను రాబట్టింది. వస్తువులు, సరుకుల ఎగుమతుల్లో కొత్త రికార్డులను నెలకొల్పింది. 88 యునికార్న్‌లతో సహా 60,000 నమోదిత స్టార్టప్‌లతో అత్యంత శక్తివంతమైన మరియు వేగంగా అభివృద్ధి చెందుతున్న స్టార్టప్‌ ‌పర్యావరణ వ్యవస్థలో భారతదేశం కూడా ఒకటి. 2021 సంవత్సరంలోనే, భారతదేశం 42 యునికార్న్‌లను సృష్టించింది మరియు 2022లో ఆ ట్రెండ్‌ ‌కొనసాగుతుంది. భారత్‌ ‌లేచిన కెరటం అని  ప్రపంచం ఇప్పుడు కొనియాడుతుందంటే, సాంకేతిక రంగంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం చేసిన ముందస్తు పెట్టుబడులే ఎక్కువగా కారణం.

ప్రధానమంత్రి మూడు స్పష్టమైన లక్ష్యాలతో 2015లో డిజిటల్‌ ఇం‌డియా కార్యక్రమాన్ని ప్రారంభించారు:

  •  పౌరుల జీవితాలను మెరుగుపర్చడం.
  • ఆర్థిక అవకాశాలను విస్తరించడం
  • నిర్దిష్ట సాంకేతికతలలో వ్యూహాత్మక సామర్థ్యాలను సృష్టించడం

భారతదేశం సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడంలో కేవలం ఆర్‌•డి, టెక్‌ ‌డెవలప్‌మెంట్‌ • ఇన్నోవేషన్‌ల సంప్రదాయ రంగాలలోనే కాకుండా, పౌరుల జీవితాలను సాధికారత మరియు పరివర్తనకు సాంకేతికతను ఉపయోగించడంలో ప్రపంచంలోని ప్రముఖ దేశాలలో ఒకటిగా అవతరించింది. ప్రపంచంలోనే అతిపెద్ద డిజిటల్‌ ‌గుర్తింపు కార్యక్రమం – ఆధార్‌ (132 ‌కోట్ల మంది నమోదు), ప్రపంచంలోనే అతిపెద్ద టెక్నాలజీతో నడిచే కోవిడ్‌ ‌వ్యాక్సినేషన్‌ ‌ప్రోగ్రామ్‌ (180 ‌కోట్లకు వాక్సిన్‌ ‌డోసులు), ప్రపంచంలోనే అతిపెద్ద డైరెక్ట్ ‌బెనిఫిట్‌ ‌ట్రాన్స్‌ఫర్‌ (‌డీబీటీ) ప్రోగ్రామ్‌, ‌డిజిటల్‌ ‌చెల్లింపులలో గ్లోబల్‌ ‌లీడర్‌గా ఉండటం (2022 ఆర్థిక సంవత్సరంలో రూ. 76 లక్షల కోట్లు) • ఫిన్‌టెక్‌ ‌టెక్నాలజీ వంటి చర్యలు ఒక కొత్త ఒరవడి సృష్టించాయి. .

కోవిడ్‌ అనంతర పరిస్థుతుల లో భారత్‌ ‌తీసుకుంటున్న చర్యలు 1 ట్రిలియన్‌ ‌డాలర్ల డిజిటల్‌ ఎకానమీని అభివృద్ధి చేయడం దిశగా సాగుతున్నాయి. ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోవడానికి, డిజిటల్‌ ఇం‌డియా ప్రోగ్రామ్‌కు మరింత ప్రోత్సాహాన్ని అందించడానికి, ఎలక్ట్రానిక్స్ ‌మరియు ఐటీ మంత్రిత్వ శాఖ స్పష్టంగా నిర్వచించబడిన ఆరు లక్ష్యాలతో విస్తృతమైన 1000 రోజుల విజన్‌ ‌ప్లాన్‌ను రూపొందించింది.   ప్రధాని నరేంద్రమోడీ రాబోయే సంవత్సరాలను ఇండియాస్‌ ‌టెకెడ్‌ (‌భారత సాంకేతిక దశాబ్ది) గా భారత్‌ ‌భవిష్యత్‌ ‌ను సరైన రీతిలో అభివర్ణించారు. . ప్రభుత్వం మరియు పాలనలో సాంకేతికతను తిరిగి ఊహించుకోవడానికి ఇది సరైన సమయం. పబ్లిక్‌ ‌సర్వీస్‌ ‌డెలివరీని కొత్త స్థాయికి తీసుకువెళ్లడానికి ప్రభుత్వం త్వరలో తదుపరి డిజిటలైజేషన్‌ ఆఫ్‌ ‌గవర్నెన్స్‌ని అమలు చేయబోతోంది. ప్లాట్‌ఫారమ్‌ ‌స్థాయి కార్యక్రమాలు పెద్ద ప్రభావాన్ని అందించాయి, ‘‘డిజిటల్‌ ‌గవర్నమెంట్‌’’ ‌విధానాన్ని అవలంబించాల్సిన సమయం ఆసన్నమైంది, ఇది ప్రభుత్వాన్ని మరింత సమర్థవంతంగా చేస్తుంది, పేపర్లు మరియు ఫైల్‌లను తగ్గిస్తుంది, పాలనను మరింత ప్రతిస్పందించేలా చేస్తుంది మరియు ప్రభుత్వంతో పౌరుల సంబంధం ఇంకా మెరుగుపడుతుంది.

మన డిజిటల్‌ ఎకానమీ విస్తరణ…
పెద్ద టెక్‌ ‌కంపెనీలు, మన స్టార్టప్‌ ఇన్నోవేషన్‌ ఎకో-సిస్టమ్‌ ఇం‌టర్నెట్‌, ‌కన్స్యూమర్‌ ‌టెక్‌ ‌చుట్టూ అవకాశాలను పెంచుతోంది.  మరియు డేటా, బ్లాక్‌చెయిన్‌, ‌కృత్రిమ మేథ (ఏఐ), ఎలక్ట్రానిక్స్ ‌డిజైన్‌, ‌సెమీకండక్టర్‌, ‌సూపర్‌ ‌కంప్యూటింగ్‌ ‌మొదలైన అనేక కొత్త రంగాలలో అభివృద్ధి చెందుతోంది. ప్రధాని మోదీ నేతృత్వంలో భారతదేశం ప్రపంచంలో మొబైల్‌ ‌ఫోన్ల రంగంలో రెండో అతిపెద్ద తయారీదారుగా అవతరించింది. కోవిడ్‌ అనంతర ప్రపంచ క్రమం ఎలక్ట్రానిక్స్‌లో కొత్త విశ్వసనీయ విలువ సమాహారాన్ని కోరుతున్నందున భారతదేశం ఎలక్ట్రానిక్స్ ‌మరియు సెమీకండక్టర్‌ ‌తయారీలో పెద్ద లక్ష్యాలను నిర్దేశించుకుంది. 2025-26 నాటికి ఎలక్ట్రానిక్స్ ‌తయారీని 75 బిలియన్‌ ‌డాలర్ల నుండి 300 బిలియన్‌ ‌డాలర్లకు విస్తరించడానికి, ఎలక్ట్రానిక్స్ ‌తయారీని పెంచడానికి విస్తృత మరియు లోతైన వ్యూహంతో ప్రభుత్వం తన ఎలక్ట్రానిక్స్ ‌లక్ష్యాలను పునర్నిర్మించింది. అదనంగా, భారతదేశంలో సిమికండక్టర్‌ ‌పర్యావరణ వ్యవస్థను నిర్మించడానికి ప్రధాని మోదీ 76,000 కోట్ల రూపాయల ప్యాకేజీని మంజూరు చేశారు. భారతదేశానికి ఇవి పెద్ద అవకాశాలు, వీటిని పటిష్టంగా అమలు చేస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వాలు దీనిని కొనసాగించడానికి భాగస్వామ్యం అవుతున్నాయి.

రాబోయే దశాబ్దంలో, దేశాల పోటీతత్వ ప్రయోజనం సాంకేతిక నైపుణ్యం, భవిష్యత్తు సాంకేతికతలను అభివృద్ధి చేసే మరియు అమలు చేసే వేగంపై ఆధారపడి ఉంటుంది. భారతదేశం అగ్రభాగాన ఉండాలని ఆకాక్షించే వ్యూహాత్మక సాంకేతిక రంగాలలో బ్లాక్‌చెయిన్‌, ఏఐ, ‌సైబర్‌సెక్యూరిటీ, వెబ్‌3.0 (‌బ్లాక్‌చెయిన్‌), ‌సెమీకండక్టర్స్, ‌నెక్సట్ ‌జెన్‌ ఎలక్ట్రానిక్స్ ‌సిస్టమ్స్, ‌సూపర్‌కంప్యూటింగ్‌, ‌క్వాంటం కంప్యూటింగ్‌ ‌మొదలైనవి ఉన్నాయి.
మనం నేడు కొన్ని ఆసక్తికరమైన పరిస్థితుల మధ్య జీవిస్తున్నాం. కోవిడ్‌ ‌తర్వాత మరియు ఇటీవలి రష్యా-ఉక్రెయిన్‌ ‌యుద్ధం… ఈ నేపథ్యంలో మన చుట్టూ ఉన్న ప్రపంచం సాంకేతిక మార్పులకు మార్గాలను వెతుకుతోంది. కోవిడ్‌ అనంతర అభివృద్ధి చెందుతున్న భారతదేశం మరింత ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్తోంది. కోట్లాది మంది భారతీయ యువకుల శక్తి మరియు అభిరుచి ద్వారా దాని కొత్త ఆశయాలతో ముందుకు వెళ్తోంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ దార్శనికత భారతీయ యువతకు ఈ ఉజ్వల భవిష్యత్‌ ‌కలిపించేలా అవకాశాలను కలిపిస్తోంది. భారతదేశం గ్లోబల్‌ ‌టెక్నాలజీ మరియు ట్రేడ్‌ ‌పవర్‌గా ఉద్భవించాల్సిన సమయం ఇది – ప్రపంచానికి గ్లోబల్‌ ‌స్టాండర్డ్ ‌డిజిటల్‌ ఉత్పత్తులు మరియు సేవలను అందించే న్యూఇండియా. భారతీయ ప్రజాస్వామ్యం మరియు పాలనను ప్రపంచంలో అత్యుత్తమంగా మార్చడానికి సాంకేతికతను వినియోగించుకుని దూసుకుపోయే తరుణమిది..

image.png
రాజీవ్‌ ‌చంద్రశేఖర్‌
(‌కేంద్ర ఎలక్ట్రానిక్స్ • ఐటీ, స్కిల్‌ ‌డెవలప్‌మెంట్‌ • ఎం‌టర్‌‌ప్రెన్యూర్‌షిప్‌ ‌సహాయ మంత్రి, భారత ప్రభుత్వం).

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page