కోవిడ్‌ ఆం‌క్షలతో.. ఏ మత్స్య కారుడు నష్టపోలేదు..!

  • పశువులకు ఆన్‌ ‌సైట్‌ ‌ట్రీట్మెంట్‌ ‌కోసం 100 మొబైల్‌ ‌వెటర్నరీ యూనిట్స్
  • 3,030 ‌రోడ్డు పనులకు సంబంధించి 11,559 కి.మీ పూర్తి
  • లోక్‌ ‌సభ ప్రశ్నోత్తరాల సమయంలో కేంద్ర మంత్రుల సమాధానం

న్యూ దిల్లీ, ప్రజాతంత్ర, మార్చి 29 : కోవిడ్‌ ఆం‌క్షల వలన తెలంగాణలో ఏ మత్స్య కారుడు నష్టపోలేదని తెలంగాణ ప్రభుత్వం తన రిపోర్ట్ ‌ద్వారా చెప్పిందని కేంద్ర పశు సంవర్థక శాఖ మంత్రి పురుషోత్తం రూపాల వెల్లడించారు. కోవిడ్‌ ‌సంక్షోభ సమయంలో దేశంలో చేపలను సరఫరా చేయని కారణంగా మత్స్యకారులకు ఎలాంటి నష్టం జరగలేదని రాష్ట్ర ప్రభుత్వ నివేదిక తెలుపుతున్నదని అన్నారు. అయితే, అంతర్జాతీయ విమాన సర్వీసులు రద్దు వలన విదేశాలకు చేసే చేపల ఎగుమతులు స్వల్పంగా తగ్గినట్లు నివేదికలో ఉందని కాంగ్రెస్‌ ఎం‌పి రేవంత్‌ ‌రెడ్డి ప్రశ్నకు కేంద్ర మంత్రి రాతపూర్వక సమాధానం ఇచ్చారు. ఇదే సందర్భంలో కేంద్ర ప్రభుత్వం మత్స్యకారులకు ఎలాంటి నష్టం వాటిల్ల కుండా అన్ని చర్యలు చేపట్టిందని గుర్తు చేశారు. ప్రధాని ప్రకటించిన ఆత్మ నిర్బర్‌ ‌ప్యాకేజ్‌లో ప్రధాని మంత్రి మత్య్స సంపద యోజన కూడా ఉందని తెలిపారు.  తెలంగాణలో పశువులకు ఆన్‌ ‌సైట్‌ ‌ట్రీట్మెంట్‌ ‌కోసం 2021-22 గానూ 100 మొబైల్‌ ‌వెటర్నరీ యూనిట్స్(ఎం‌వియూ) ను మంజూరు చేసినట్లు కేంద్ర మంత్రి రూపాలా తెలిపారు.

ఇందుకోసం 1600 లక్షల రూపాయలను రిలీజ్‌ ‌చేసినట్లు ఎంపి కొత్త ప్రభాకర్‌ ‌రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. దేశ వ్యాప్తంగా 33 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో 4,332 యూనిట్ల కోసం 681.57 కోట్ల రూపాయలను విడుదల చేసినట్లు వెల్లడించారు. ఈ ఎంవియూల ద్వారా ఆన్‌సైట్‌లో అత్యవసర చికిత్స, మైనర్‌ ‌సర్జరీలు, జంతువుల క్షేత్ర పరిస్థితులలో రోగనిర్ధారణ, నమూనా సేకరణ కోసం అవసరమైన ప్రాథమిక సౌకర్యాలు ఉంటాయని తెలిపారు. అలాగే, ప్రతి యూనిట్‌లో ఒక పశువైద్యుడు, ఒక పారా-పశువైద్యుడు, ఒక డ్రైవర్‌-‌కమ్‌ అటెండర్‌ ఉం‌టారని పేర్కొన్నారు. తెలంగాణలో ప్రధాన మంత్రి గ్రామీణ్‌ ‌సడక్‌ ‌యోజన(పిఎంజిఎస్‌వై-1,2,3), లెఫ్‌ ‌వింగ్‌ ‌తీవ్రవాద ప్రభావిత పాంత్రాల్లో(ఆర్సిపిఎల్‌డబ్ల్యూఈఏ) కలిపి 3,030 రోడ్డు పనులకు సంబంధించి 11,559 కిమీ పూర్తి చేసినట్లు కేంద్ర గ్రామీణాభివఈద్ధి శాఖ సహాయ మంత్రి సాధ్వీ నిరంజన్‌ ‌జ్యోతి తెలిపారు. పిఎంజిఎస్‌వై, ఆర్సిపిఎల్‌ ‌డబ్ల్యూఈఏ కలిపి రాష్ట్రంలో  మొత్తం 3,453 రోడ్డు పనుల్లో 14,230 కిమీ నిర్మాణ పనుల్ని మంజూరు చేసినట్లు తెలిపారు.

ఇందులో ప్రస్తుతం 423 రోడ్డు పనుల్లో 2,402 కి.మీ పెండింగ్‌లో ఉన్నట్లు కేంద్ర మంత్రి తెలిపారు. అయితే, రోడ్ల నిర్మాణం, నిర్వహణ బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదేనని అన్నారు. ఈ అంశం మీద టీఆర్‌ఎస్‌ ఎం‌పీలు రంజిత్‌ ‌రెడ్డి, పసునూరి దయాకర్‌, ‌మాలోతు కవిత, వెంకటేశ్‌ ‌నేత అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి రాతపూర్వక సమాధానం ఇచ్చారు. పిఎంజిఎస్‌వై- 1,2,3) పూర్తి చేయడానికి సెప్టెంబర్‌ 2022, ఆర్సిపిఎల్‌ ‌డబ్ల్యూఈఏ కోసం మార్చి 2023 వరకు మంత్రిత్వ శాఖ గడువు ఇచ్చిందని పేర్కొన్నారు. అలాగే, పిఎంజిఎస్‌వై అమలు కోసం మార్చి 2025 వరకు సమయం ఉందని తెలిపారు. అయితే, భారీ వర్షాల కారణంగా దెబ్బతిన్న రోడ్ల ప్రత్యేక మరమ్మతులు, పునర్నిర్మాణం కోసం పిఎంజిఎస్‌వై కింద ఎటువంటి నిబంధన లేదని స్పష్టం చేశారు. అలాంటి మరమ్మతుల కోసం రాష్ట్రం తన నిధులను ఉపయోగించవచ్చని సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page