ఉగాది పండుగ ప్రాధాన్యత, విశిష్టత

శ్రీ శుభకృత్‌ ‌నామ సంవత్సర ఉగాది
యుగానికి ఆది ఉగాది. ప్రకృతిలో మార్పు కారణంగా వచ్చే  తొలి పండుగ. తెలుగు వారంతా గొప్పగా జరుపుకునే పండుగ. మనస్సు అన్ని కర్మలకు మూలమని గ్రహించిన తెలుగువారు ఆ మనసుకు అదిపతి అయిన చాంద్రమానాన్ని ప్రమాణంగా స్వీకరించి దాని ఆధారంగా ఈ పండుగను జరుపుకోవడం ఆనవాయితి.
ఈ సారి శుభకృత్‌ ‌నామ సంవత్సరం.తెల్లవారక ముందే ఇల్లు మొత్తం శుభ్రం చేసుకుని. గడపకు పసుపు కుంకుమ, గుమ్మానికి మామిడి తోరణాలు, పూజా మందిరాన్ని రంగవల్లికలతో అలంకరించుకోవాలి. ఉగాది రోజున తెల్లవారు ఆరు గంటల నుంచి తొమ్మిది గంటల లోపు పూజ చేయడం మంచిది. ఉగాది మనకు సంవత్సరాది.

ఈ రోజున బ్రాహ్మ ముహూర్తాన మేల్కొని, అభ్యంగన స్నానం చేసి. కొత్త బట్టలు కట్టుకుని దేవాలయానకి వెళ్లి దర్శనం చేసుకోవాలి. ఉగాది గొప్పతనం అంతా ఉగాది పచ్చడిలోనే ఉంటుంది.షడ్రుచుల సమ్మేళనం ఉగాది అన్నది ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. ఉగాదినాడు షడ్రుచుల సమ్మేళనంతో తయారుచేసే శ్రేష్టమైన పదార్ధమే ఉగాది పచ్చడి. ఆధ్యాత్మిక పరంగా ఈ పచ్చడికి ఎంత ప్రాముఖ్యత ఉందో%••% ఆహార, ఆరోగ్యం పరంగాను అంతే ఉన్నత స్థానాన్ని కలిగి ఉంది. ఈ పచ్చడి సేవించడం ద్వారా దివ్యమైన ఆరోగ్యం కలుగుతుందని వైద్యనిపుణులు కూడా చెపుతున్న మాట యధార్థము.  వేపపూవు పచ్చడి తినడం  ఈ పండుగ విశిష్టత. ఋతు సంబంధ పండుగ ఉగాది కావడం వల్ల తప్పనిసరిగా వేపపూవు పచ్చడి తినాలి.ఫాల్గుణ శుద్ధ పూర్ణిమ తెల్లవారి మామిడి పువ్వును తినాలని, ఉగాది నాడు వేపపూవు తినాలని చెప్పడం వల్ల ఆరోజున ఉగాది పచ్చడి షడ్రుచులతో తయారు చేసి తినడం ఆనవాయితీ.కొత్తసహస్రాబ్ధికి ప్రారంభ శుభ సూచకంగా భావించే ఈ రోజు నుంచి సంవత్సరం పొడుగునా ఎదురయ్యే మంచి చెడులను, కష్టసుఖాలను, ఆనందవిషాదాలను సంయమనంతో, సానుకూలంగా స్వీకరించాలన్న సందేశమే ఉగాది పచ్చడిలోని ఆంతర్యం.

తీపి సుఖసంతోషాలను, తీపి బాధలను, ఒగరు బంధాలను ఇలా ప్రతి ఒక్క పదార్థం శరీరానికి ప్రకృతికి మధ్య బంధాన్ని తెలియజేస్తుంది. పుణ్యక్షేత్రాన్ని దర్శించుకోవడం వల్ల ఏడాదంతా శుభాలు కలుగుతాయి.ఈ ఉగాదికి తప్పని సరిగా ఆలయాల్లో పంచాంగ శ్రవణం వినాలి. దీని ద్వారా మంచి చెడులను తెలుసుకునే వీలుంటుంది. ఉగాది పండుగ రోజున ఆలయాల్లో వసంతనవరాత్రి ఉత్సవాలు జరిపించడం ద్వారా అష్టైశ్వర్యాలు చేకూరుతాయంట. తాహతను బట్టి ఉత్సవాలు జరిపించడం పూజలు చేయించుకోవడం శుభాలను కల్గిస్తుంది. ఈ రోజున పూజ చేసేటప్పుడు పంచహారతి ఇవ్వాలని శాస్త్రం చెపుతోంది. ఈ ఉగాది పండుగ నాడు శ్రీరాముడిని స్మరిస్తే శుభఫలితాలుంటాయి. ఉదయం పూజ సమయంలో శ్రీరామ నామం పఠిచడం మంచి ఫలితాలనిస్తుంది. వీలైతే శ్రీరామ నామాన్ని 108 సార్లు జపిస్తే సత్పలితాలు చేకూరుతాయి.శ్రీ శుభకృత్‌ ‌నామ సంవత్సర ఉగాది ఈ సారి.కరొన నిబంధనలు పాటిస్తూ ఉగాది పండుగను జరుపుకుంధాం.ఈ ఉగాది నుండి అయిన కరొన నుండి మనలను విడిచి పెట్టి పోవాలని కోరుకుంధాం.ఉగాది రోజు కుటుంబ సభ్యుల తో ఆనందం గా గడుపుతాం.ఉగాది పచ్చడని స్వీకరించి,బక్షాలు తిని,కవి సమ్మేళనాలు,పంచాంగం శ్రవణాలు టి.వి లలో,జూం మీటింగ్‌ ‌ద్వార విని మానసిక ఆనందం పొంది ఈ పండగ ప్రాధాన్యత ని నలుగురి కి తె  లుపుధాం.
(ఏప్రిల్‌ 2 ‌న శ్రీ శుభకృత్‌ ‌నామ సంవత్సర ఉగాది పండగ సందర్భంగా)    
– కామిడి సతీశ్‌ ‌రెడ్డి,జడలపేట,జయశంకర్‌ ‌భూపాలపల్లి జిల్లా  9848445134.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page