- సీసీఎంబీ మాజీ డైరెక్టర్, ప్రొఫెసర్ సిహెచ్ మోహన్ రావు
- కేయూలో ఘనంగా ముగిసిన జాతీయ సైన్స్ కాంగ్రెస్
కాళోజి జంక్షన్ / హనుమకొండ ప్రజాతంత్ర, ఆగస్ట్ 21 : సైన్స్ పరిశోధనల్లోని ఫలితాలు దేశంలోని సామాన్యులకు చేరాలని తెలంగాణ సైన్స్ కాంగ్రెస్ అధ్యక్షుడు, సీసీఎంబీ మాజీ డైరెక్టర్, ప్రొఫెసర్ సిహెచ్ మోహన్ రావు పిలుపునిచ్చారు. మూడు రోజులుగా కాకతీయ యూనివర్సిటీ లో తెలంగాణ సైన్స్ కాంగ్రెస్ సదస్సు (Telangana Science Congress) , టెక్నికల్ సెషన్లు గరువారం ముగిశాయి. కేయూ ఆడిటోరియంలో కేయూ వీసీ ప్రొఫెసర్ కర్నాటి ప్రతాప రెడ్డి అధ్యక్షతన ముగింపు సమావేశంలో మోహన్ రావు ముఖ్యఅతిథిగా పాల్గొని కీలక ప్రసంగం చేశారు. దేశ సర్వతోముఖాభివృద్ధిలో సాంకేతిక రంగం ప్రధానమన్నారు. ఏఐ, ఎంఎల్, స్పేస్ రీసెర్చ్, బయోటెక్నాలజీ రంగాలపై ఫలవంతమైన చర్చలు జరిగాయన్నారు. మిగతా రంగాల్లోనూ మంచి పరిశోధన పత్రాలు వొచ్చాయని అభినందించారు. కేయూ స్వర్ణోత్సవ సంబురాల వేళ వర్సిటీలో తెలంగాణ సైన్స్ కాంగ్రెస్ సదస్సు నిర్వహించడం ప్రత్యేకమని కొనియాడారు.
సభాధ్యక్షులు కేయూ వీసీ ప్రొఫెసర్ కర్నాటి ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ లెర్నింగ్, షేరింగ్, డిస్కషన్స్ పరిశోధనల్లో నాణ్యమైన పురోగతి సాధిస్తామని చెప్పారు. మూడు రోజుల్లో కేయూలో ఆరోగ్య పరిరక్షణ, స్పేస్, క్వాంటం అనేక అంశాల్లో పరిశోధనలపై కీలక చర్చలు జరిగాయని చెప్పారు. భవిష్యత్తో వాటి ఫలితాలు వస్తాయని ఆకాంక్షించారు. కేయూ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ వల్లూరి రామచంద్రం మాట్లాడుతూ శాస్త్రవేత్తలు నూతన ఆవిష్కరణలపై దృష్టి సారించి సమాజ అవసరాలకు అనుగుణంగా పరిశోధనలను వెలువరించాలన్నారు. టీసీఎస్-25 జనరల్ సెక్రటరీ, ఓయూ మాజీ వీసీ ప్రొఫెసర్ ఎస్. సత్యనారాయణ మాట్లాడుతూ తెలంగాణ సైన్స్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ శాస్త్ర, సాంకేతిక రంగాల పురోగతికి పనిచేస్తుందన్నారు. వర్సిటీలు, పరిశోధనలు, పారిశ్రామిక రంగాలకు అనువర్తనాలుగా సాగాలని అన్నారు. కేయూ యూజీసీ కో ఆర్డినేటర్ ప్రొఫెసర్ ఆర్.మల్లికార్జున్ రెడ్డి, టీపీసీ, టీఎస్ సీ-25 చైర్మన్ ప్రొఫెసర్ పి.మల్లారెడ్డి, టీసీఎస్-25 సెషన్ కోఆర్డినేటర్ ప్రొఫెసర్ వడ్డె రవీందర్, టీఏఎస్ ఉపాధ్యక్షుడు ప్రొఫెసర్ సీహెచ్. సంజీవరెడ్డి, నిట్ ప్రొఫెసర్ కె. లక్ష్మారెడ్డి, సోషల్ సైన్స్ డీన్ ప్రొఫెసర్ బి.సురేశ్ లాల్ సదస్సు ఉద్దేశ్యాలను కేయూ సైన్స్ డీన్ ప్రొఫెసర్ జి. హన్మంతు, కేయూ పార్మసీ డీన్ ప్రొఫెసర్ గాదె సమ్మయ్య వివరించారు. తెలంగాణ సైన్స్ కాంగ్రెస్ ఆర్గనైజింగ్ సెక్రెటరీ ప్రొఫెసర్ బైరు వెంకట్రామిరెడ్డి మూడు రోజుల సదస్సు నివేదికను ప్రవేశపెట్టారు. ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్ మంచాల సదానందం, కేయూ క్యాంపస్ కళాశాల ప్రిన్సిపాల్ తాళ్ళపల్లి మనోహర్, డాక్టర్ బి. దీపాజ్యోతి, ప్రొఫెసర్ ఎన్. ప్రసాద్, ప్రొఫెసర్ రాంరెడ్డి, సారంగపాణి, దత్తాలు పాల్గొన్నారు.
సైన్స్ కాంగ్రెస్ అవార్డుల విజేతలు వీరే
కేయూలో జరిగిన తెలంగాణ అకాడమీ సైన్స్ కాంగ్రెస్ ఉత్తమ పరిశోధనా పత్రాలకు అవార్డులను ప్రదానం చేశారు. ఉత్తమ ప్రజెంటేషన్ అవార్డును ఫిజికల్ సైన్స్ వెంకటరమణ సాధించారు. గణితంలో బెస్ట్ ఓరల్ అభిలాష్, బెస్ట్ పోస్టర్ రాజ్ కుమార్ సాధించారు. కెమికల్ సైన్స్ లో బెస్ట్ ఓరల్ నాగరాజు, బెస్ట్ పోస్టర్ విక్రమ్ సాధించారు. ఇంజనీరింగ్, టెక్నాలజీ లో బెస్ట్ ఓరల్ సతీశ్ కుమార్, బెస్ట్ పోస్టర్ పారిన్ ఫాతిమా సాధించారు. ఫార్మసీలో బెస్ట్ ఓరల్ శిరీష, బెస్ట్ పోస్టర్ ప్రసాద్ సాధించారు. ఎర్త్ సైసైస్లో బెస్ట్ ఓరల్ శ్రీధర్, బెస్ట్ పోస్టర్ సతీష్ సాధించారు. లైఫ్ సెన్స్ లో బెస్ట్ ఓరల్ డాక్టర్ బి. అనేదా, బెస్ట్ పోస్టర్ లక్ష్మి పునీత సాధించారు. అతిథులు విజేతలకు ప్రశంసా పత్రాలను అందజేసి అభినందించారు.





