Tag political analysis

“క్యా బొల్తీ పబ్లిక్…”

CJP Party, CJP Party Kya Bolti Public, Public Opinion, Indian Politics, Political Analysis

దేశ రాజకీయాల్లో కొత్త తరహా ప్రజా స్పందనకు నాంది పలుకుతూ అభిజీత్ దిప్కే స్థాపించిన ‘కాక్‌రోచ్ జనతా పార్టీ (CJP)’ రాజకీయ పార్టీగా కాకుండా ప్రజా ఒత్తిడి వేదికగా కొనసాగుతామని ప్రకటించడం, అనంతరం ‘క్యా బోల్తీ పబ్లిక్’ పేరుతో దేశవ్యాప్త ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమాన్ని ప్రారంభించాలనుకోవడం ఒక ఆసక్తికర పరిణామం. ప్రజల అసలు సమస్యలను నేరుగా వినడం, వాటిని ప్రభుత్వాల ముందుంచడం…

ప్రశాంత్‌ ‌కిశోర్‌ ‌గెలుపు

“వ్యవసాయ రంగానికి సంబందించి కొత్తగా రూపొందించిన చట్టాలను వెనక్కు తీసుకోవడం ఒకటైతే ఏకంగా క్యాబినెట్‌ ‌మంత్రితో రాజీనామా చేయించక తప్పని పరిస్థితి రెండవ అంశానికి చెందింది, అయితే యువత ఆకాంక్షలను గౌరవిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సాక్షాత్తు ప్రధాని మోదీ ప్రకటించారు. అంతేకాదు తనను, తల్లిని తిట్టిపోసిన విద్యార్థులను ‘హమారే బచ్చే హై’ అంటూ వాళ్ళను…

ఈ జాడ్యానికి ముగింపు ఏదీ!?

“ప్రజాస్వామ్యంలో రాజకీయ హక్కులు అనేవి అందరికీ సమానంగా ఉండాలి.కనుక “వారసత్వ రాజకీయ నిరోధక చట్టం”గురించి ఆధునిక ప్రజాస్వామ్య వ్యవస్థ పటిష్టానికి నూటికి నూరు శాతం ఆలోచించాల్సిన అంశం ! అవసరమే కాదు, అనుసరణీయం కూడా! ఒకసారి చట్టసభ కు ఎన్నికైన వారి కుటుంబం నుండి మరొకరికి ప్రాతినిధ్యం కల్పించకుండా నియంత్రణ చేయాల్సిన అవసరం ఉంది.అంతేకాదు, ఒకసారి…

2026లో భారత రాజకీయాల అద్దం: ఇసుక తక్కెడ…!

1983లో యం. యస్. ఆచార్య హెచ్చరిక, “దేశంలో రాజకీయాలు పూర్తిగా లొష్టమైపోయినై.  మానావమానాలు శష్ప సమానాలైనవి.” — ఈ ఒక్క వాక్యం చాలు. 1983 నవంబరు 17న జనధర్మ సంపాదకుడు యం.యస్. ఆచార్య రాసిన సంపాదకీయం ఎంత దూరదృష్టితో రాయబడిందో అర్థం చేసుకోవడానికి. నాలుగు దశాబ్దాల క్రితం రాసిన ఈ వ్యాసం నేటి రాజకీయాలను చదివినట్లే…

పశ్చిమ బెంగాల్ లో బీజేపీ ‘పిల్ల’ చేష్టలు ..!

ఇటీవల పశ్చిమ బెంగాల్‌లో అధికారంలోకి వొచ్చిన బీజేపీ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మధ్యాహ్న భోజనాన్ని అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం (ఇస్కాన్) ఆధ్వర్యంలో అందించనున్నట్లు ప్రకటించింది. ఇస్కాన్ సంప్రదాయం ప్రకారం భోజనంలో గుడ్లు, మాంసాహార పదార్థాలు, ఉల్లి, వెల్లుల్లి వంటి పదార్థాలను ఉపయోగించదు. వాటికి బదులుగా సోయాబీన్, పప్పుధాన్యాలు వంటి వృక్షాధారిత ప్రోటీన్లను…

హేతుబద్దం కాని హేతుకీకరణ

 “27 లక్షల ఎనభై వేల మంది విద్యార్థుల కు రవాణా సౌకర్యం కోసం యేటా ఖర్చు చేసేందుకు నిధులు ఎలా సర్దుతారన్నది తెలియదు.ఊర్లో బడి ఉండగా,బడి ఆవాస ప్రాంతంలో బడి ఈడు పిల్లలుండగా ఆ బడిని మూసి ఆ ఊరి పిల్లలను బస్సులెక్కించి వేరే ఊరి  బడికి పంపడం సహేతుకం ఎలా అవుతుందో ఆయన వివరించాల్సి…

వోటుబొండిగలో సర్కార్ చేప!

“హైదరాబాద్ చేప ప్రసాదం అనేది విశ్వాసం, విజ్ఞాన శాస్త్రం మధ్య ఉన్న గీతను చెరిపేసే ఒక ప్రయత్నం. 180 ఏండ్ల క్రితం ప్రారంభమైన ఒక చిన్న కుటుంబ సంప్రదాయం, నేడు ప్రభుత్వ అండదండలతో ఒక భారీ సామాజిక వేడుకగా మారింది. అయితే శాస్త్రీయ ఆధారాలు లేకపోవడం, ఆరోగ్య ముప్పులు పొంచి ఉండడం రాజ్యాంగబద్ధమైన శాస్త్రీయ దృక్పథానికి…

జీవన పోరాటం..

“ప్రస్తుత సంక్షోభానికి ప్రధాన కారణం పార్టీ ఫిరాయింపులు. సుదీర్ఘ కాలం పాటు జగిత్యాలలో జీవన్ రెడ్డికి ప్రధాన ప్రత్యర్థిగా ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ కాంగ్రెస్‌లో చేరడం జీవన్ రెడ్డికి అశనిపాతంలా మారింది. దశాబ్ద కాలంగా ఎవరితోనైతే పోరాడారో, ఎవరి విధానాలను ఎండగట్టారో, అదే వ్యక్తిని పార్టీలోకి ఆహ్వానించడం ఆయన ఆత్మగౌరవాన్ని దెబ్బతీసింది.…

నిబద్ధత లేని తటస్థ వైఖరి!!

“క్రూరమైన అంతర్జాతీయ రాజకీయాల్లో భారత్ తన చమురు అవసరాల కోసం నైతికత అనే దిక్సూచిని ఉపయోగిస్తోంది. ఇరాన్ పాఠశాలలపై క్షిపణుల దాడులను ఖండించకుండా మౌనం పాటిస్తూ, తన చమురు ట్యాంకర్లు సురక్షితంగా స్వదేశానికి పంపాలని ఇరాన్‌ను అడుక్కుంటోంది. అంటే ఇక్కడ రక్తం కంటే చమురుకే అధిక ప్రాధాన్యం! ఇరాన్ కూడా మన దేశంపై ప్రేమతో చేయడం…