Tag congress party

ఉచిత హామీలను తిరస్కరించాలి!

కేంద్రంలో పదేళ్లు దాటినా బిజెపిలో ఇసుమంత్కెనా మార్పుకనిపించడంలేదు. 2 కోట్ల ఉద్యోగాల హామీ గాలిలో, దిల్లీ కాలుష్యంలో కొట్టుకు పోయింది. కేవలం పన్నులు బాదడం తప్ప దానికి మరోటి తెలియడంలేదు. ఎన్నికల్లో గెలవడమే లక్ష్యం. కాంగ్రెస్‌ కావొచ్చు..బిజెపి కావొచ్చు..తాయిలాలు ప్రకటించి ప్రజలను బురిడీ కొట్టిస్తున్నాయి. ఇచ్చిన హామీలను విస్మరిస్తున్నాయి. అధికారంలోకి రాగానే తమ స్వలాభమే తప్ప ప్రజల మేలుకోరి పనిచేయడం లేదు. జార్కండ్‌, మహారాష్ట్రాల్లో మాత్రం కాంగ్రెస్‌, బిజెపిలు అధికారం కోసం నానాగడ్డీ కరుస్తున్నాయి. జార్కండ్‌ఎ న్నికలు దగ్గరపడుతున్న తరుణంలో ఇండియా కూటమి తన మేనిఫెస్టో విడుదల చేసింది. కూటమి పార్టీలైన జార్కండ్‌ ముక్తిమోర్చా (జెఎంఎం), కాంగ్రెస్‌, ఆర్జేడీ, సీపీఎం ఉమ్మడిగా ఏడుగ్యారంటీలతో ఈ మేనిఫెస్టోను ప్రకటించాయి. పదిలక్షలమంది యువతకు ఉపాధి, పదిహేను లక్షల రూపాయలవరకూ ఆరోగ్యబీమా, నాలుగువందల యాభై రూపాయలకే సిలండర్‌, మహిళలకు నెలకు రెండున్నరవేల రూపాయలు, ప్రతివ్యక్తికీ ఏడుకేజీల ఆహారధాన్యాలు, వరి కనీసమద్దతుధరను ఎనిమిది వందల రూపాయలు పెంచడం, వెనుకబడిన తరగతులవారికి ప్రత్యేక కమిషన్‌, మైనారిటీల హక్కుల పరిరక్షణ ఇందులో ఉన్నాయి. ఈ హామీలన్నీ ఇప్పుడు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో కొనసాగించివుంటే నమ్మకం ఉండేది. కానీ బిజెపి, కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాల్లో ఇచ్చిన హామీలకే దిక్కులేదు. ఆదివాసుల వో ట్లకోసం బీజేపీ ఎంతగా కష్టపడుతోంది. ఇటీవలి ఎన్నికల సభలో మోదీ చేసిన వ్యాఖ్యలు చూస్తే ఇది తెలియచెబుతాయి. ప్రధానంగా బంగ్లాదేశీ అక్రమ వలసదారులు జార్కండ్‌ మూలమూలల్లోకి చొరబడ్డారని, వారికి దొంగసర్టిఫికేట్లు ఇచ్చి స్థిరపరచడం ద్వారా ఇండియా కూటమిలోని పార్టీలు అతిపెద్ద వోటుబ్యాంకును తయారుచేసుకున్నాయని ఆరోపిస్తూ సెంటిమెంట్‌ ప్రయోగిస్తున్నారు. ఆ చొరబాటుదారులు గిరిజన ఆడబిడ్డల మీద అఘాయిత్యాలకు పాల్పడుతున్నారని, విద్యాసంస్థలకు మైనారిటీ గుర్తింపుతో ఆదివాసీ విద్యార్థులకు జెఎంఎం ప్రభుత్వం అన్యాయం చేస్తున్నదని బీజేపీ విమర్శలు చేస్తోంది. సంథాల్‌ పరగణాస్‌లో పెద్దసంఖ్యలో అక్రమ చొరబాటుదారులు స్థిరపడ్డారంటూ జార్కండ్‌ హైకోర్టులో ఒక పిల్‌ దాఖలు కావడం, దానిపై మీడియాలో విస్తృతంగా చర్చ జరుగుతూండటం ఎన్నికల్లో బిజెపి వాడుకుంటోంది. గత ఎన్నికల్లో బీజేపీ కంటే ఓ ఐదుసీట్లు ఎక్కువ తెచ్చుకున్న జెఎంఎం, కాంగ్రెస్‌తో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ప్రతీ చిన్న ఎన్నికనూ తీవ్రంగా తీసుకొనే బీజేపీ ఈ మారు జార్కండ్‌ ను స్వాధీనం చేసుకోవడానికి శాయశక్తులా ప్రయత్నిస్తోంది. బీజేపీ ఇప్పటికే విడుదల చేసిన మేనిఫెస్టోలో, తాను అధికారంలోకి రాగానే 2.87లక్షల ప్రభుత్వోద్యోగాలను భర్తీచేస్తానని, నెలకు రెండువేల రూపాయల నిరుద్యోగ భృతి ఇస్తానని హామీ ఇవ్వడంతోపాటు, మహిళలకు వివిధ పథకాలద్వారా దండిగానే ఆర్థిక సాయం ప్రకటించింది. పదేళ్ళక్రితం బీజేపీ ఆదివాసీయేతరులను, ప్రధానంగా ఓబీసీలను దగ్గరకు చేర్చుకొని జార్కండ్లో అధికారంలోకి రాగలిగింది. ఆ ఎన్నికల్లో మోదీ హవా ఉధృతంగా ఉన్నందువల్ల కూడా ఆ ఎత్తుగడ సులువుగా పనిచేసింది. కాని ఇప్పుడా పరిస్థితి లేదు. ఎందుకంటే బిజెపి పాలన ఎలావుందో గత పదేళ్లుగా ప్రజలు అనుభవిస్తున్నారు. అధికారంలోకి రావడం కోసం కర్ణాటక, తెలంగాణలో ఇష్టారీతిన ఇచ్చిన గ్యారెంటీలు, హామీలు, ప్రకటించిన పథకాలు అమలు చేయలేక, చేయలేమని ప్రజలకు చెప్పలేకపోతున్న తీరును ప్రజలు చూస్తున్నారు. మహారాష్ట్ర, జార్కండ్‌ ఎన్నికలకు ముందు ఈ రకమైన హామీలు గుప్పించినా ప్రజలు ఇరుపార్టీలను నమ్మేంతగా పరిస్థితులు లేవు. ఎన్నికల సమయంలో అలవికాని హామీలిచ్చి ఏదోరకంగా ఆయా రాష్ట్రాల్లో అధికారం దక్కించుకునేందుకు బిజెపి, కాంగ్రెస్‌ పార్టీలు ఎత్తుగడలు వేస్తున్నాయి. చాంతాడంత లిస్టుతో హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన తరవాత హామేలు అమలు చేయలేక చతికిలపడడం అలవాటు చేసుకున్నారు. ఐదేళ్ల తరువాత మళ్లీ కొత్తగా హామీలు ఇవ్వడానికి వెనకాడడంలేదు. ఇప్పటికే అనేక సందర్భాల్లో ఇచ్చిన హామీలు అమలుచేయలేని అసహాయతను బయటపెడుతున్నారు. దున్నపోతు మీద వాన పడినట్టు పట్టించుకోనట్టు నటించడం కూడా అలవాటు చేసుకున్నారు. మ్యానిఫెస్టోలో హామీలు గుప్పించడం మాత్రంమానడంలేదు. బీజేపీ పరిస్థితి కూడా కాంగ్రెస్‌కు భిన్నంగా ఏమీ లేదు. ఉచితాల గురించి అభ్యంతరాలు వ్యక్తం చేసే మోదీ బృందం కూడా వాటి బాటే పట్టింది. ప్రతీ మహిళకు రూ.2,100 ఇస్తామని జార్కండ్‌ లో చెప్పిన బీజేపీ, నిరుద్యోగ భృతి కూడా ఇస్తామని చెప్పింది. మహారాష్ట్రలోనూ ఇదే అంశంపై బీజేపీ ఆధారపడ్డట్టు కన్పించింది. ముఖ్యమంత్రి లడ్కీ బచావ్‌ పేరుతో మహిళలకు ప్రతీ నెల రూ.1500 హామీ ఇచ్చి, ఇప్పటికే పాక్షికంగా అమలుచేస్తున్నారు. గ్యాస్‌ సిలిండర్ల పంపిణీ హామీ మామూలే. ఉచితాలు, హామీల విషయంలో ఈ రెండు రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ కూటములు కూడా తక్కువేం తినలేదు. ఒకడుగు ముందుకేసి మహారాష్ట్రలో ప్రతి మహిళకు నెలకు రూ.2 వేలు ఇస్తామని హామీ ఇచ్చారు. తెలంగాణ, కర్ణాటక అనుభవాలతో కాంగ్రెస్‌ హామీలకన్నా, అధికారమే మిన్న అన్న ధోరణిలో సాగుతోంది. గత హామీల అమలుకు దిక్కు లేకున్నా, కొత్త హామీలు, పథకాలు ప్రకటిస్తే ప్రజలు వోట్లేస్తారులే అన్న ధీమాలో కాంగ్రెస్‌, బీజేపీలు ఉన్నట్లుగా కనపడుతున్నది. బీజేపీ, కాంగ్రెస్‌లకు ఏ విషయంలో విభేదాలున్నా ప్రజలకిచ్చే హామీల విషయంలో ఈ రెండు పార్టీల వ్యవహారశైలి ఒక్కటే అన్నట్టుగా ఉన్నది. ప్రజల నిజమైన అవసరాలపై వాటికి పట్టింపులేదు. ఇచ్చిన హామీలు తప్పనిసరిగా నెరవేర్చాలనే బాధ్యత లేదు. అధికారమే పరమావధి అన్నట్టుగా వీరి కార్యాచరణ ఉంది. అందుకే ప్రజలు ఎప్పటికప్పుడు చైతన్యం కావాలి. మిగతా రాష్ట్రాల్లో అమలు చేస్తున్నారా లేదా తెలుసుకోవాలి. అలాగే ఉచిత హామీలను తిరస్కరించాలి. అప్పుడే నాయకులు ఒళ్లు దగ్గర పెట్టుకుని పనిచేస్తారని గుర్తించాలి. జార్కండ్‌లో ఉత్కంఠపోరు.. గెలిచేదెవరో ...!? జార్కండ్‌ లో ఉన్నవి 81 సీట్లే. అక్కడ రెండువిడతల్లో ఈనెల 13, 20 తేదీల్లో పోలింగ్‌ జరపాలని ఎన్నికల సంఘం నిర్ణయించుకుంది. దీంతో ప్రచారహోరు సాగుతోంది. ఆదివాసులను విస్మరించినందునే అధికారాన్ని చేజార్చుకున్నానని బీజేపీ నమ్ముతున్నందున ఈ మారు వారి వోట్లను సైతం అధికంగా కొల్లగొట్టేందుకు విశేషమైన ప్రయత్నం చేస్తోంది. జార్కండ్‌ లో ఉమ్మడి పౌరస్మృతి (యూసిసి)ని అమలు చేస్తానని ప్రకటించిన ఆ పార్టీ దానినుంచి ఆదివాసులను మాత్రం మినహాయించింది. ఇందుకు పూర్తిభిన్నంగా జెఎంఎం ఆదివాసులకు 1932 నాటి ఖతియాన్‌ విధానం ఆధారంగా సర్వమత నియమావళి ని అమలుచేసి ఒక ప్రత్యేక ఆదివాసీ మత గుర్తింపునకు హామీ పడుతోంది. మొన్నటి లోక్‌సభ ఎన్నికల్లో మొత్తం ఐదు ఎస్టీ రిజర్వుడు సీట్లనూ ఇండియా బ్లాక్‌ గెలుచుకున్న విషయం తెలిసిందే. జెఎంఎం-కాంగ్రెస్‌ కూటమి ఏలుబడిలో అన్ని రకాలుగా అన్యాయమైపోయిన ఆదివాసుల ప్రయోజనాలను పరిరక్షించేది తానేనని బీజేపీ చెబుతోంది. ఇక భూకుంభకోణంలో హేమంత్‌ సొరేన్‌ అరెస్టు, సుప్రీంచొరవతో విడుదల కావడం, హేమంత్‌ భార్య కల్పనా సొరేన్‌ తెరవిరీదకు రావడం ఇత్యాది పరిణామాలు నిజానికి జెఎంఎంకు కొత్తశక్తిని ఇచ్చాయి. మహిళా వోటర్లను ఆమె బలంగా ఆకర్షించగలుగుతున్నదని అంటారు. అయితే, ఓబీసీలు, ఎగువకులాల వోట్లు అధికంగా బీజేపీపక్షాన ఉన్నందున ఇండియా కూటమిని ఆదుకోవాల్సింది ప్రధానంగా రాష్ట్ర జనాభాలో దాదాపు 27శాతంగా ఉన్న ఆదివాసులే. హేమంత్‌ సొరేన్‌ మీద కేసులు, అనంతరం చంపయ్‌ సొరేన్‌ బీజేపీలో చేరడం ఇత్యాది పరిణామాల మీద జార్కండ్‌ వాసులు ఏ తీర్పు ఇచ్చారో నవంబరు 23న తేలుతుంది. వెయిట్‌ అండ్‌ సీ.. -కందుల శ్రీనివాస్‌ సీనియర్‌ జర్నలిస్ట్‌ సెల్‌: 98484 43599

హామీలకన్నా, అధికారమే మిన్న  ఇచ్చిన హామీలకే దిక్కులేదు.. మళ్లీ హామీలు ఉచితాలపై అభ్యంతరాలు వ్యక్తం చేసే మోదీ బృందం కూడా వాటి బాటే పట్టింది… కేంద్రంలో పదేళ్లు దాటినా బిజెపిలో ఇసుమంత్కెనా  మార్పుకనిపించడంలేదు.  2 కోట్ల ఉద్యోగాల హామీ గాలిలో, దిల్లీ కాలుష్యంలో కొట్టుకు పోయింది. కేవలం పన్నులు బాదడం తప్ప దానికి మరోటి తెలియడంలేదు.…

దేశంలో కాంగ్రెస్‌ ‌పాలిత రాష్ట్రాలు దివాలా

రాష్ట్రంలో 11 నెలల్లోనే ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత •ధాన్యం కొనే దిక్కులేక రైతుల అవస్థలు• దళారులతో మిల్లర్లు కుమ్మక్కు.. •సంస్థాగతంగా బిజెపి బలోపేతం చేయాలి •ప్రజల సమస్యలపై ఎక్కడికక్కడ పోరాటాలు •పార్టీ కార్యశాలలో కేంద్ర మంత్రి కిషన్‌ ‌రెడ్డి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, నవంబర్‌ 7: ‌రాష్ట్రంలో 11 నెలల్లోనే కాంగ్రెస్‌  ‌ప్రభుత్వంపై ప్రజల్లో  తీవ్ర వ్యతిరేకత…

వ్యాపారాలకు నేను వ్యతిరేకిని కాను..

కాంగ్రెస్‌ అ‌గ్రనేత రాహుల్‌ ‌గాంధీ బిజెపి విమర్శలపై రాహుల్‌ ‌స్పష్టత న్యూదిల్లీ, నవంబర్‌7:  ‌తాను వ్యాపార వ్యతిరేకిని కాదని, కేవలం గుత్తాధిపత్యాన్ని మాత్రమే వ్యతిరేకిస్తానని కాంగ్రెస్‌ ‌నేత రాహుల్‌ ‌గాంధీ పేర్కొన్నారు. తనను వ్యాపార వ్యతిరేకిగా చిత్రీకరించేందుకు బీజేపీ ప్రయత్నాలు చేస్తోందన్నారు. అందుకే ‘ఓ విషయంపై స్పష్టతనివ్వాలని అనుకుంటున్నట్లు వెల్లడించారు. వ్యాపారంలో గుత్తాధిపత్యం కారణంగా మిగతా…

మహారాష్ట్రలో మహావికాస్ అఘాడి(యం.వి.ఏ)దే విజయం

Mahavikas Aghadi winner in Maharashtra

హిమాచల్ ప్రదేశ్,కర్నాటక, తెలంగాణా లలో ఇచ్చిన హామీలు అమలు చేశాం  మహారాష్ట్ర ప్రజల కోసం రాహుల్ గాంధీ ఐదు హామీలనిచ్చారు  అధికారంలోకి రాగానే అమలులోకి   మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో మంత్రి కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రజాతంత్ర ఇంటర్నెట్ డెస్క్, నవంబర్ 06: మహారాష్ట్ర శాసనసభకు జరుగుతున్న ఎన్నికల్లో మహా వికాస్ అఘాడి ( యం.వి.ఏ.)…

నవంబర్‌ 1‌న మూసీ పునరుజ్జీవం ప్రాజెక్టు పనులు ప్రారంభం

55 కి.మీ మూసీ పునరుజ్జీవం పూర్తయితే అద్భుతనగరం ఆవిష్కృత‌మవుతుంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మూసీ పరీవాహకంలో సమయం వొచ్చినప్పుడు పాద‌యాత్ర చేస్తా. అవసరమైతే వాడపల్లి నుంచి వికారాబాద్‌ ‌వరకు పాదయాత్ర చేస్తా.. మూసీపై ముందడుగే.. వెనకడుగు వేసేది లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. నిర్ణయం తీసుకునే ముందే వెయ్యిసార్లు ఆలోచిస్తామని అన్నారు. నిర్ణయం…

దారి తప్పిన పార్టీతో.. రాజీ పడలేక పోతున్నా..

నీతి, నిజాయితీ, నైతిక విలువలేవీ? రాజీవ్‌ ‌రూపొందించిన ఫిరాయింపుల చట్టానికి తూట్లు.. రాహుల్‌ ‌గాంధీ పాంచ్‌ ‌న్యాయ్‌ ‌కి అట‌కెక్కించారు. ఏఐసిసి అధ్యక్షులు ఖర్గే కు రాసిన లేఖలో ఎమ్మెల్సీ జీవన్‌ ‌రెడ్డి ఆవేదన జగిత్యాల, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 24: ఇం‌దిరాగాంధీ ఆశయాలకు అనుగుణంగా, యువతకు స్ఫూర్తిగా.. గౌరవ మర్యాదలు కలిగిన కాంగ్రెస్‌ ‌పార్టీలో అనైతిక…

విపక్షాల విమర్శలు.. స్వీయపార్టీలో కలహాలమధ్య నలుగుతున్న కాంగ్రెస్‌

 ( మండువ రవీందర్‌రావు ) తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీ అధికారం చేపట్టి ఏడాది కావొస్తున్న తరుణంలో ఆపార్టీలో విభేదాలు తారాస్థాయికి చేరుకుంటున్నాయి. నేతల మధ్య సమన్వయం పూర్తిగా లోపించడంతో క్యాడర్‌ అయోమయానికి గురవుతున్నది. నాయకులు పరస్పరం చేసుకుంటున్న ఆరోపణలు చివరకు దాడులకు దారితీస్తున్నది. రాష్ట్రంలోని అనేక నియోజకవర్గాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. రాష్ట్ర కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా…

డి ఫాల్టర్లకు ఈ సీజన్లో ధాన్యం కేటాయించము

 క్యాబినెట్ సబ్ కమిటీ సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి  హైదరాబాద్,ప్రజాతంత్రఅక్టోబర్ 16: డి ఫాల్టర్లకు ఎట్టి పరిస్థితుల్లో ఈ సీజన్లో ధాన్యం కేటాయించబోమని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. బుధవారం డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్  సచివాలయంలో ధాన్యం కొనుగోలుపై ఏర్పాటైన సబ్…

‌రాష్ట్ర వ్యాప్తంగా స్కూళ్ల పండుగ

‘‘‌తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా సిద్ధం చేస్తున్న ఇంటిగ్రేటెడ్‌ ‌రెసిడెన్షియల్స్ ‌స్కూళ్ల భవనాలకు శుక్రవారం శంకుస్థాపనలు జరిగాయి. రాష్ట్రంలోని దాదాపు 28 అసెంబ్లీ నియోజకవర్గాల్లో భవనాల నిర్మాణానికి మంత్రులు, కాంగ్రెస్‌ ‌ప్రజాప్రతినిధులు పునాదిరాయి వేశారు. రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌లోని కొందుర్గులో ఏర్పాటు చేయనున్న బడి భవనాలకు ముఖ్యమంత్రి భూమిపూజ చేశారు. మధిర నియోజకవర్గంలో ఉప ముఖ్యమంత్రి మల్లు…