దిగుమతులపై పూర్తి నిషేధం విధింపు
దేశ భద్రతను దృష్టిలో ఉంచుకుని, పాకిస్థాన్పై ఆర్థికంగా ఒత్తిడి తెచ్చేందుకు భారత ప్రభుత్వం పాక్ దిగుమతులపై నిషేధం విధించింది. ఈ నిషేధం విదేశీ వాణిజ్య విధానం 2023లో భాగంగా కొత్త నిబంధనగా చేర్చబడింది. దీనిలో భాగంగా, పాకిస్థాన్ నుంచి ఉత్పత్తులు దిగుమతి చేసుకునే లైసెన్సులను రద్దు చేయడం, ఎలాంటి సరుకుల ప్రవేశానికి అనుమతి ఇవ్వకపోవడం వంటి చర్యలు తీసుకున్నారు. ఈ నిషేధంతో పాకిస్థాన్ ఆర్థిక వ్యవస్థపై భారీగా ప్రతికూల ప్రభావం పడే అవకాశముంది.
భారత ప్రభుత్వం ఈ చర్యను అంతర్జాతీయ వేదికలపై కూడా న్యాయబద్ధంగా నిలబెట్టే ప్రయత్నం చేయనుంది. ఉగ్రవాదంపై సోరులో ఇది ఒకటని తెలిపారు. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్-పాకిస్థాన్ సంబంధాలు మరింత దిగజారాయి. ఈ క్రమంలోనే భారత ప్రభుత్వం పాకిస్థాన్ నుంచి అన్ని రకాల దిగుమతులపై నిషేధం విధించింది. జాతీయ భద్రత, ప్రజా ప్రయోజనాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వాణిజ్య మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ నిషేధం వెంటనే అమలులోకి వొచ్చింది.
రవాణాలో ఉన్న వస్తువులతో సహా పాకిస్థాన్ నుంచి వొచ్చే లేదా ఆ దేశం నుంచి రవాణా అయ్యే అన్ని ఉత్పత్తులపై వర్తిస్తుంది. ఈ క్రమంలో పాకిస్థాన్లో లేదా అక్కడి నుంచి ఎగుమతి చేయబడిన అన్ని వస్తువుల దిగుమతి లేదా రవాణా అన్నీ కూడా వెంటనే నిషేధించబడతాయి. ఈ నిషేధానికి మినహాయింపు కోసం భారత ప్రభుత్వం ముందస్తు అనుమతి అవసరమని వాణిజ్య మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్లో పేర్కొంది. పహల్గాంలో పర్యాటకులపై ఉగ్రదాడితో దాయాదితో అన్ని రకాల దౌత్య సంబంధాలు తెంచుకుంటోన్న భారత్ ఇలా మరో గట్టి షాకిచ్చింది. పాకిస్థాన్ నుంచి మన దేశానికి రవాణా అయ్యే అన్ని ఉత్పత్తులకు ఈ నిషేధం వర్తిస్తుందని స్పష్టం చేసింది.
పాకిస్థాన్లో ఉత్పత్తి అయ్యే లేదా ఆ దేశం నుంచి భారత్కు వచ్చే అన్నిరకాలా వస్తువుల ప్రత్యక్ష, పరోక్ష దిగుమతులపై నిషేధం విధిస్తున్నాం. అనుమతులు ఉన్న ఉత్పత్తులైనా, స్వేచ్ఛాయుత దిగుమతులైనా సరే పాక్ నుంచి ఎలాంటి వస్తువులను అనుమతించబోం. ఈ నిషేధం తక్షణమే అమల్లోకి వొస్తుంది. తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు ఈ ఆంక్షలు కొనసాగుతాయి. ఈ నిషేధం నుంచి ఏవైనా మినహాయింపులు కావాలంటే.. భారత ప్రభుత్వం నుంచి ముందస్తు అనుమతి తప్పనిసరని వాణిజ్య మంత్రిత్వ శాఖ తమ నోటిఫికేషన్లో వెల్లడించింది.