Category Uncategorized

కోట్ల రూపాయలతో డివిజన్ల అభివృద్ధి

పటాన్ చెరు,ప్రజాతంత్ర, ఆగస్ట్ 11: జిహెచ్ఎంసి పరిధిలోని డివిజన్ల అభివృద్ధికి కోట్ల రూపాయల నిధులు ఖర్చు చేస్తూ, మౌలిక వసతుల కల్పనలో ఆదర్శంగా నిలుస్తున్నామని పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు.పటాన్ చెరు డివిజన్ పరిధిలోని రాఘవేంద్ర కాలనీ, శ్రీరామ్ నగర్ కాలనీ, శాంతినగర్ కాలనీలలో కోటి రూపాయల అంచనా వ్యయంతో చేపట్టనున్న సిసి…

మతసామరస్యానికి ప్రతీక తెలంగాణ

పటాన్ చెరు,ప్రజాతంత్ర,ఆగస్ట్ 11: సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తోందని పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు.గుమ్మడిదల మండలం మంబాపూర్ గ్రామంలో ప్రతి ఏటా ప్రతిష్టాత్మకంగా నిర్వహించే అలీ అబ్బాస్ జాతర మహోత్సవానికి ఎమ్మెల్యే జిఎంఆర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అనంతరం ఆశిర్ఖానాలో ఏర్పాటు చేసిన పీర్లకు ప్రత్యేక…

గుండెను ఈదిన గొంతు

మరిగిన మనసుతో అరిగిన బతుకులో నాలుక పారిన చోటల్లా మొలిచిన ప్రతి గుర్తు గద్దర్… మోసిన అనుభవాన్ని అక్షరంలో రంగరించి మెదడుకు రుచి చూపి చూపి పెలే పల్లవి మోతరా గద్దర్ నిప్పుల్ని నమిలి మింగి ముళ్లను వాటేసుకుని మట్టితో కలసి మెలసి మనిషిని గుండెలో ఈదిన ఈతరా గద్దర్ గుడిసె దిగులు గుబులు తెలిసి చెమట ఇంకిన బతుకు నడచి నలిగిన శరీరంలో పగిలిన ప్రతి కలను చూసి గొంతును ఆయుధంగా మ్రోగిన గళం గద్దర్ ఎత్తిన గొంతులో  వెలిగేత్తే  ప్రశ్నలు కత్తిలా దూసుకుపోయే పదునైన ఆలోచనలు మెరుపులా తాకే చురుకైన శక్తులు పాటలో శక్తికి పట్టం కట్టిన  వీరుడు గద్దరు…. …. చందలూరి నారాయణరావు.               9704437247

అమరగానం

తూర్పు పవన గాలుల జడికి ఎరుపెక్కిన తిరుగుబాటు గళానివి! మట్టి మనుషుల శ్రమ సుగంధాన్ని పాటగా ఎలుగెత్తి ప్రజల గుండెల్లో పదిలంగా నాటిన ప్రజాగాయకుడువి! ఉస్మానియా అలజడుల నడుమ ఎరుపు పాటవై నక్సల్బరి వసంత కాల మేఘ ఘర్జనలో పాటలని  పదును ఈటెలుగా దోపిడీ శక్తుల గుండెలకు గురిపెట్టిన విలుకాడివి నీవు! జనం గుండె చప్పుళ్లకు నీ పాటలే దరువై శివమెత్తి నర్తించే నీ ఆటలు కన్నీళ్ళ వాడల్ని కదిలించి కత్తుల కవాతు దండుగ మార్చేశాయి! అమరుల అమ్మల కన్నీళ్లను ఆర్తితో తుడుస్తూ ఓదార్పు వందనాలు అందించిన కొడుకువి! గంగ దాటెళ్ళి పోయే విప్లవ చెల్లెళ్ళ పాదం మీది పుట్టుమచ్చవై తోడబుట్టకున్నా అన్నవై రుణంతీర్చుకుంటానని బాసచేసినోడివి! అడవులు పల్లెలు మైదానాలు నీ పాటను పలవరిస్తూ కొత్త లోకంకోసం కలల్ని కంటూ తూరుపు దారిలో రేపటి ప్రభాత వెలుగు క్రాంతులయ్యాయి! దుక్కి దున్నే దుర్గన్న మోటకొట్టే మల్లన్న రిక్షా తొక్కే రహీమన్న కలుపు తీసే లచ్చుమమ్మ గనిలో శ్రామికుడు కార్ఖానాలో కార్మికుడు జంగల్ లో అడవి బిడ్డలు లోకపు పీడితుల గొంతువై పాటగా నినదించిన విప్లవ శంఖానాదం నీవు! గోచీబతుకుల కాపరిలా గొంగడి భుజాన వేసుకుని…

యుద్ధం ముగిసిపోలేదు

యుద్ధం ముగిసిపోలేదు యుద్ధం అలసిపోలేదు గుండెలో పద్మవ్యూహమై తూటాకు పాట నేర్పుతూ యుద్ధనౌక సాగిపోతుంది యుద్ధం పాటై ప్రవహిస్తుంది యుద్ధం మాటై పలుకుతుంది యుద్ధం ఆటపాటలై విరామం లేని పోరాటం చేస్తుంది యుద్ధం కోకిల గానం చేస్తూ కొండ కోనల్లో వాగు వంకల్లో నదీ నదాలపై అలలై ప్రవహిస్తుంది యుద్ధం నెమలితోనాట్యం చేస్తూ అడవి బిడ్డలను ఒడిలో చేర్చుకుంటుంది యుద్ధం హావ భావాలతో అరుణ పతాకమై గగనాన రెపరెపలాడుతూ దోపిడీని పాతాళానికి తొక్కుతుంది యుద్ధభూమిలో యుద్ధం నియంతృత్వంపై ఉరుములా గర్జిస్తూ మెరుపులా యుద్ధనౌక సాగిపోతుంది యుద్ధం అలసిపోలేదు యుద్ధం ముగిసిపోలేదు యుద్ధం రాకాసి రాజ్యంపై రాజీలేని పోరాటం చేస్తుంది యుద్ధంలోని రక్తపుటేరులను భుజాలపైనుండి గొంగలి మోసుకుపోతుంది యుద్ధం గద్దరై గర్జిస్తుంది యుద్ధం గద్దరై గాండ్రిస్తుంది యుద్ధం గద్దరై కదనరంగాన కదం తొక్కుతుంది యుద్ధం అలసిపోలేదు యుద్ధం ముగిసిపోలేదు యుద్ధం గద్దరై గానం చేస్తుంది యుద్ధం గద్దరై గజ్జ కట్టింది యుద్ధం గద్దరై నాట్యం చేస్తుంది యుద్ధభూమిలో యుద్ధం విరామ మెరుగని విప్లవ వీరుడు గద్దర్ కు లాల్ సలాం చేస్తూ…

నాకు తెలిసిన గద్దర్‌

గద్దర్‌, ‌నేను సమకాలికులం. విరసం సభ్యుడిగా, రాడికల్‌ ‌యువజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా, గద్దర్‌ ‌జననాట్యమండలి కళాకారుడుగా ఒకే విప్లవోద్యమంలో, భిన్న రంగాల్లో దశాబ్దాలుగా కలిసి పనిచేస్తున్నాము. మా మాతృ సంస్థ పీపుల్స్ ‌వార్‌ ‌పార్టీ, నేటి మావోయిస్టు పార్టీ 1980ల నుండి మేము అనేక రంగాల్లో, అనేక వేదికల మీద కలిసి పనిచేస్తున్నాము.…

భూముల వేలంపై స్టేకు హైకోర్టు తిరస్కరణ

హైదరాబాద్‌,ఆగస్ట్10(ఆర్‌ఎన్‌ఎ): ‌హైదరాబాద్‌ ‌నగరంలోని బుద్వేలులో భూముల వేలం ఆపాలని హైకోర్టు న్యాయవాదుల సంఘం వేసిన పిల్‌ ఆధారంగా స్టే ఇచ్చేందుకు హైకోర్టు తిరస్కరించింది. దీంతో వేలానికి మార్గం ఉగమమైంది. న్యాయవాదుల సంఘం లంచ్‌ ‌మోషన్‌ ‌మెన్షన్‌ ‌చేయనుంది. ఈ రోజు నుంచి వేలం పక్రియ ప్రారంభం కానుంది. బుద్వేలులో 100 ఎకరాలు కేటాయించాలని 2012 నుంచి…

సర్కారు దవాఖానా ల సరికొత్త రికార్డ్…!

‌జూలై నెలలో ప్రభుత్వ దవాఖాన డెలివరీలు 72.8% నమోదు వైద్య సిబ్బందికి శుభాకాంక్షలు తెలిపిన మంత్రి హరీష్‌ ‌రావు సీజనల్‌ ‌వ్యాధుల పై అప్రమత్తంగా ఉండాలి..అధికారులకు ఆదేశాలు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఆగస్ట్ 10:‌జూలై నెలలో ప్రభుత్వ దవాఖాన డెలివరీలు 72.8% నమోదు కావడం పట్ల ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి హరీశ్‌ ‌రావు సంతోషం వ్యక్తం…

‌గ్రూప్‌-2 ‌పరీక్ష వాయిదా వేయాలి

తెలంగాణ పబ్లిక్‌ ‌సర్వీస్‌ ‌కార్యలయం వద్ద ఉద్రిక్తత అభ్యర్థుల ఆందోళన-కార్యాలయ ముట్టడితో భారీగా  ట్రాఫిక్‌ ‌జామ్‌ ఆం‌దోళనకారునలు అరెస్ట్ ‌చేసిన పోలీసులు వాయిదాను పరిశీలిస్తామని తెలిపిన కమిషన్‌ హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,ఆగస్ట్10: ‌గ్రూప్‌-2 అభ్యర్థుల ర్యాలీ,ఆందోళనలతో ప్రభుత్వం దిగివచ్చింది.  గ్రూప్‌ 2 ‌వాయిదా వేయాలన్న అభ్యర్థుల డిమాండ్‌పై తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ ‌సర్వీస్‌ ‌కమిషన్‌ ‌స్పందించింది. ప్రస్తుతం టీఎస్‌పీఎస్సీ…