Category Uncategorized

బడిబువ్వకు ‘తిథి తిప్పలు’!

గుడ్డెద్దు శేన్ల పడుడంటే గీ తీర్గనే! సదూకునే పోరల్లకు బళ్ళె అంబటేల బెట్టేడి బడి బువ్వనే కాదుల్లా! ఇటు సంది వూరోళ్ళను సుత బువ్వ పెట్టమంటాంది మన సర్కార్‌ ! ఏ ఇంట్ల యెసోంటి పబోజనమైనా, సుట్టాలకింత బెట్టినట్టే వూరి బడి పోరల్లకింత బువ్వ పెట్టాలంటాంది. యెందుకంటె పబోజనం కాడి బువ్వ జరింత అవ్వల్‌ టది.…

అభివృద్ధి.. సంక్షేమం సమపాళ్లుగా ముందుకు…

మొత్తంగా ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు పక్కాగా కార్యాచరణ రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం  ఒక్కో హామీని నెరవేర్చుకుంటూ  ముందుకు వెళుతోంది. హామీలకు గ్యారెంటీ వస్తోంది. ఒక్కో హామీని నెరవేర్చే క్రమంలో అత్యంత ముఖ్యమైన రుణమాఫీని ఎట్టకేలకు పట్టాలు ఎక్కింది. అలాగే మిగతా హావిరీలకు కూడా గ్యారెంటీ ఇస్తున్నారు. ఈ క్రమంలోనే  అంతర్గ శతృత్వం లేకుండా మంత్రులంతా…

నిరుద్యోగం, ధరల పెరుగుదల, జిఎస్టీలపై చర్చలేవీ?

బడ్జెట్‌ సమావేశాల సందర్భంగా నిత్యం సభలో ప్రధాని మోదీ ఉండడం లేదు. సమస్యలను లేవనెత్తినప్పుడు లేచి సమాధానం ఇవ్వడం బాధ్యత. ఈ సమావేశాల్లో కూడా అధికార పార్టీ తీరు మారడం లేదు. సభ్యులు అడిగిన ప్రశ్నలకు నింపాదిగా, సమయోచితంగా, ప్రజలు మెచ్చుకునేలా సమాధానాలు ఇవ్వడంలో మంత్రులు విఫలం అవుతున్నారు. నీట్‌పై జరిగిన చర్చలో ఇది కనిపించింది.…

పెద్ద సంఖ్యలో ఉపాధ్యాయుల పదోన్నతులు

ఆగస్టు 2న పదోన్నతి పొందిన ఉపాధ్యాయులతో సీఎం సమావేశం ఎల్‌బి స్టేడియంలో నిర్వహణకు ఏర్పాట్లపై సిఎస్‌ సమీక్ష హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూలై 29 : రాష్ట్రంలో ఇటీవల పదోన్నతి పొందిన దాదాపు 30 వేల మంది ఉపాధ్యాయులతో రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ రేవంత్‌ రెడ్డి ఆగస్టు 2వ తేదీన సమావేశం కానున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు…

వ్యవసాయ విూటర్లు పెట్టాలని చెప్పలేదు

ఇందుకోసం 30వేల కోట్లు వదులుకున్నాం విద్యుత్‌ స్థాపక శక్తిని పెంచిన ఘనత మాదే నిజంగానే కెసిఆర్‌ సత్యహరిశ్చంద్రుడే అసెంబ్లీలో మాజీ మత్రి జగదీష్‌ రెడ్డి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూలై 29 : రైతుల పొలాల్లో విూటర్లు పెట్టడానికి కేసీఆర్‌ ఒప్పుకోలేదని బిఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే, మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి విమర్శించారు. శాసన సభలో పద్దులపై చర్చ సందర్భంగా…

కమర్షియల్‌ ట్యాక్స్‌ స్కామ్‌పై అసెంబ్లీలో చర్చ

రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూలై 29 : కమర్షియల్‌ ట్యాక్స్‌ స్కామ్‌లో కీలక పరిణామం చోటు చేసుకుంది. రూ.1400 కోట్ల స్కామ్‌పై అసెంబ్లీలో చర్చించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ కుంభకోణంలో ఇప్పటికే ఐదు మందిపై సీసీఎస్‌ పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. మాజీ సీఎస్‌ సోమేశ్‌ కుమార్‌ వ్యవహారంపై…

గుత్తాధిపత్యం బలోపేతం లక్ష్యంగానే బడ్జెట్‌

6 గురు వ్యక్తుల నియంత్రణలో ‘కమలం’ చక్రవ్యూహం నాడు పద్యవ్యూహంలో చిక్కుకున్న అభిమన్యుడిలా..నేడు కమలం చక్రవ్యూహంలో భారత్‌ విలవిల కులగణన చేపట్టి దాన్ని విచ్ఛిన్నం చేస్తాం కేంద్ర బడ్జెట్‌పై రాహుల్‌ గాంధీ మండిపాటు ప్రజాతంత్ర ఇంటర్నెట్‌ డెస్క్‌, జూలై 29 : బిజెపి నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం యువత, రైతులు, మహిళలు, చిన్న వ్యాపారుల చుట్టూ…

దిల్లీ కోచింగ్‌ సెంటర్‌ ప్రమాదంపై ‘సుప్రీమ్‌’లో విద్యార్థుల పిటిషన్‌

ఘటనపై రాహుల్‌, కిషన్‌ రెడ్డి, సిఎం రేవంత్‌ రెడ్డి తీవ్ర సంతాపం దిల్లీ రాజేంద్రనగర్‌ యూపీఎస్సీ అభ్యర్థుల మృతి కేసుపై యూపీఎస్సీ అభ్యర్థి అవినాశ్‌ దూబే సుప్రీమ్‌ కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ప్రాథమిక హక్కులను కాపాడాలని అభ్యర్థిస్తూ సీజేఐకి దరఖాస్తు చేశారు. మున్సిపాలిటీ ఉదాసీనత కారణంగా ఓల్డ్‌ రాజేంద్రనగర్‌, ముఖర్జీనగర్‌ ప్రాంతాల్లో వర్షపు నీరు…

జిష్ణుదేవ్‌తో సిఎం రేవంత్‌ భేటీ

రాష్ట్ర నూతన గవర్నర్‌గా నియామకం కావడంపై అభినందనలు రేపు నూతన గవర్నర్‌ ప్రమాణ స్వీకారం హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూలై 29 : తెలంగాణ నూతన గవర్నర్‌గా నియమితులైన  జిష్ణుదేవ్‌ వర్మను ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. సోమవారం ఉదయం 9 గంటల సమయంలో రాజ్‌భవన్‌కు వెళ్లి శాలువాతో సన్మానించారు. అనంతరం రాష్ట్రానికి సంబంధించిన పలు…